- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం
రాబోయే వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మిగిలిన 6.75 లక్షల గృహాలను మార్చికల్లా పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
ఈనాడు డిజిటల్, అమరావతి: రాబోయే వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మిగిలిన 6.75 లక్షల గృహాలను మార్చికల్లా పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో బుధవారం మంత్రి సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 8.04 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 5.76 లక్షలు ఇంకా మొదలుపెట్టలేదు. వీటికి రూ.2,000 కోట్లు అవసరం. ఐచ్ఛికం-3 కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారుల తరఫున కొన్ని సంస్థలు చేపట్టాయి. వాటిలో లాభదాయకంగా ఉండే స్థాయి వరకు నిర్మించి మిగిలిన భాగాన్ని వదిలేశారనే ఫిర్యాదులు వచ్చాయి. లబ్ధిదారుల పేర్లపై నిర్మాణ సామగ్రిని అధికంగా తీసుకున్నారని తెలిసింది. వీటిపై విచారణ చేసి.. ఈ నెల 31 లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించాం. కొన్ని ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న భూములను అధిక ధరలకు కొని ఇళ్ల పట్టాలుగా ఇచ్చారనే దానిపై విచారణ చేస్తాం. గృహనిర్మాణ శాఖాధికారులు లేని ప్రాంతాల్లో సచివాలయాల ఉద్యోగులను వినియోగిస్తాం. దీనిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ని కూడా అడిగా’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హమ్మయ్య.. ఈ చెట్లు బతికిపోయాయి
రహదారిపై పందిరి వేసినట్లు కనువిందు చేస్తున్న ఈ దృశ్యం.. రాజధాని అమరావతిలోనిది. నేలపాడులో హైకోర్టు ఎదుట రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లు సుందరంగా కనిపించడమే కాదు.. దారెంట నీడనిస్తున్నాయి. -
పవన్కల్యాణ్ వారాహి దీక్షోద్వాసన
ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వారాహి ఏకాదశ దీక్ష శుక్రవారం కలశోద్వాసన క్రతువుతో ముగించారు. -
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి బాధ్యులెవరు?
‘అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఉన్న అధికారులు ఎవరు? పింఛా ప్రాజెక్టు నిండిపోయి అన్నమయ్యకు అంచనాకు మించి వరద వస్తుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారు? -
రాజధాని నిర్మాణానికి తొలి వేతనం విరాళం
విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్సభ సభ్యుడిగా అందుకున్న తొలి గౌరవ వేతన మొత్తం రూ.1.57 లక్షలను అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. -
తితిదే నిర్ణయించిన ధరలకే ఆహారమందిస్తాం
తిరుమలలోని ఏపీ టూరిజం హోటళ్లలో తితిదే నిర్ణయించిన ధరలకే నాణ్యమైన ఆహారం అందిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న టాటా గ్రూప్ ఛైర్మన్, రేమండ్స్ సీఎండీ
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం బ్రేక్ దర్శన సమయంలో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, రేమండ్స్ గ్రూప్ సీఎండీ గౌతమ్ సింఘానియా వేర్వేరుగా దర్శించుకున్నారు. -
ద్వారంపూడి సంస్థకు షోకాజ్ నోటీసులివ్వండి
కాకినాడ నగర వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. -
పేదల భూముల్ని చౌకగా కొట్టేశారు
పేదలకు ఇచ్చిన ఎసైన్డ్ భూములను వైకాపా పెత్తందార్లు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కుల కల్పనపై గత వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి, తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. -
ధ్రువపత్రాలు ఎందుకు అందించలేదో వివరణ ఇవ్వండి
మాజీ మంత్రి, వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ జడ్జి ఎస్.రామకృష్ణ 2021లో వేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన కేసులో దిగువ కోర్టు ధ్రువపత్రాలు(సర్టిఫైడ్ కాపీలు) ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. -
9, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. -
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాల సమయంలోనూ రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో శుక్రవారం 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. -
ఎర్రచందనం దందాలో పెద్ద తలకాయల్ని పట్టుకోండి
ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖాధికారులను ఆదేశించారు. -
ఇద్దరు తెలుగు సీఎంల భేటీ నేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం ముఖాముఖి భేటీ కాబోతున్నారు. -
వైదొలుగుతామన్న ఇసుక గుత్తేదారులు
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఇసుక తవ్వకాలు, విక్రయాల గుత్తేదారులుగా ఉన్న జీసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థలు ఆ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు ముందుకొచ్చాయి. -
అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి
ఉద్యాన పంటలకు ప్రసిద్ధిగాంచిన అనంతపురం జిల్లా నుంచి పండ్లు, పూలు, కూరగాయల ఎగుమతితోపాటు, ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు వీలుగా అనంతపురంలో ఎయిర్పోర్టుతోపాటు, విమానయాన సిబ్బంది శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడిని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి కోరారు. -
సహకార సంఘాలకు వైకాపా చెదలు
వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలోని అధికశాతం సహకార బ్యాంకుల్ని ఊడ్చేశారు. రుణాల పేరుతో ఎడాపెడా కొల్లగొట్టారు. -
వాసుదేవరెడ్డి, కొడాలి నానిలపై పోలీసులకు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డి వ్యవహార శైలి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అతని అనుచరుల బెదిరింపులతో నా తల్లి మరణించిందని గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బాలికల పాఠశాలల వద్ద సీసీ కెమెరాలు: హోం మంత్రి అనిత
బాలికల పాఠశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్పై సీబీఐ కోర్టు తీర్పు వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను సాక్షిగా పరిగణించాలని కోరుతూ నాలుగో నిందితుడైన షేక్ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు తీర్పును వాయిదా వేసింది. -
ప్రజాదర్బార్కు వినతుల వెల్లువ
రాష్ట్ర మానవవనరులు, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్కు.. మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించారు. -
మొక్కులు తీర్చుకున్న అమరావతి రైతులు
తమ పూజల ఫలితంగా సకల దేవతలు కరుణించి, రాక్షస పాలనకు చరమగీతం పాడి ప్రజా పాలనకు పట్టం కట్టారని పలువురు అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేశారు.