- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఎత్తిపోతల్లో ఎగసిన గోదారి!
నైరుతి పలకరించి నెల రోజులు గడిచినా కృష్ణాలో ప్రవాహాల్లేవు. గోదావరిలో మాత్రమే కాస్త వరద పారుతోంది. ఈ నీటి పాయలను బీళ్ల వైపు మళ్లించాలని.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
ఒకేరోజు 4 లిప్టుల నుంచి నీటి తరలింపు
నదుల అనుసంధాన ఫలాలు మళ్లీ అందుబాటులోకి
నీరు విడుదల చేసిన మంత్రి రామానాయుడు
ఈనాడు, అమరావతి: నైరుతి పలకరించి నెల రోజులు గడిచినా కృష్ణాలో ప్రవాహాల్లేవు. గోదావరిలో మాత్రమే కాస్త వరద పారుతోంది. ఈ నీటి పాయలను బీళ్ల వైపు మళ్లించాలని.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వరద జలాల సద్వినియోగానికి అడుగులు వేశారు. కృష్ణా, గోదావరి అనుసంధాన ఫలాలు అందించేందుకు జులై ప్రారంభంలోనే ఓ నిర్ణయానికొచ్చారు. ఆ వెంటనే కార్యాచరణ మొదలుపెట్టారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా బుధవారం ఒక్క రోజే నాలుగు ఎత్తిపోతల ద్వారా జలాలు విడుదల చేశారు. కృష్ణా డెల్టా తాగు, సాగునీటి అవసరాలకు పట్టిసీమ ఎత్తిపోతలు, ఏలేరు జలాశయం నింపేందుకు పురుషోత్తపట్నం లిఫ్టును ప్రారంభించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు నిర్మించిన పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాలకూ జలాలు విడుదల చేశారు. ఒకే రోజు గోదావరికి రెండు వైపుల ఉన్న పథకాలను మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా ప్రారంభించారు. ఈ ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు రెండు రోజుల కిందట మంత్రి రామానాయుడు, అధికారులతో మాట్లాడారు. సోమ, మంగళవారాల్లో గోదావరి బ్యారేజి అధికారులతో మంత్రి సమీక్షించారు. గోదావరి డెల్టా ఖరీఫ్ అవసరాలు పోనూ.. ప్రవాహాలు సద్వినియోగం చేసుకునేందుకు ఉన్న అవకాశాలు చర్చించారు. మంగళవారం గోదావరిలో 11,620 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. బుధవారం నాటికి 39,903 క్యూసెక్కులకు చేరాయి. ప్రవాహ అంచనాలు లెక్కించారు. డెల్టా అవసరాలు పోను పట్టిసీమతోపాటు ఇతర ఎత్తిపోతలకూ నీరివ్వచ్చని తేలడంతో 4 పథకాల ద్వారా నీళ్లు విడుదల చేశారు.
ఏమిటీ ప్రయోజనం?
పట్టిసీమ: ఈ ఎత్తిపోతల ద్వారా విడుదల చేసిన నీరు పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజికి చేరుతుంది. ఎప్పుడో చంద్రబాబు హయాంలో ఈ పథకాన్ని నిర్మించారు. జగన్ హయాంలో అవసరం ఉన్నా ఉపయోగించుకోలేదు. ప్రస్తుతం కృష్ణాకు నీళ్లు ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కృష్ణా డెల్టాకు తాగు నీరు అత్యవసరం. అందుకే పట్టిసీమ నుంచి జలాలు విడుదల చేశారు.
పురుషోత్తపట్నం: గోదావరికి ఎడమ వైపున పురుషోత్తపట్నం వద్ద పంపు హౌస్ ఏర్పాటు చేసి నీటిని పోలవరం ఎడమ కాలువ ద్వారా మళ్లించి తిరిగి ఏలేరు జలాశయానికి ఎత్తిపోయడం దీని ఉద్దేశం. ఏలేరు జలాశయం సామర్థ్యం 23.44 టీఎంసీలు. విశాఖ నగరానికి తాగు, విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో సాగు, పారిశ్రామిక అవసరాలకు ఈ జలాలు మళ్లించవచ్చు. ఈ ఎత్తిపోతలతో 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వగలుగుతారు.
తాడిపూడి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2,06,000 ఎకరాలకు ఈ ఎత్తిపోతలతో నీళ్లు అందుతాయి.
పుష్కర: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 18 మండలాల్లోని 1,85,000 ఎకరాలకు దీంతో నీళ్లు అందుతాయి.
ప్రస్తుతం నీటి విడుదల (క్యూసెక్కుల్లో..)
పట్టిసీమ: 1,050 (పూర్తి సామర్థ్యం: 8,500)
తాడిపూడి: 175 (పూర్తి సామర్థ్యం: 1,400).
పురుషోత్తపట్నం: 700 (పూర్తి సామర్థ్యం: 3,500)
పుష్కర: 175 (పూర్తి సామర్థ్యం: 1400)
- గోదావరిలో ప్రవాహాలను బట్టి పూర్తి సామర్థ్యం వరకూ నీరు విడుదల చేసేలా ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి రామానాయుడు ‘ఈనాడు’కు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమరావతి ఓఆర్ఆర్కు పచ్చజెండా
రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. -
రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం
గత ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. -
కోట్ల ప్రజాధనం.. వైఎస్ విగ్రహాలపాలు
ఇడుపులపాయలోని వైఎస్సార్ స్మారక రాజీవ్ నాలెడ్జి వ్యాలీలో ఏర్పాటు చేసిన రాజశేఖర్రెడ్డి విగ్రహాలు ఎన్నో తెలుసా? మొత్తం 23. -
సీమ ముఖచిత్రం మార్చనున్న హైదరాబాద్ - బెంగళూరు హైవే
రాయలసీమ ముఖచిత్రం త్వరలో మారిపోనుంది. గతంలో ఎన్నడూలేనంతగా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు కళకళలాడనున్నాయి. -
ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
రాష్ట్ర సమస్యల పరిష్కారం దిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. -
పోతేపోనీ అని వదిలేశారు!
గత జగన్ ప్రభుత్వ నిర్వాకంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ. 250 కోట్ల నిధుల్ని రాష్ట్ర పోలీసు శాఖ కోల్పోయింది. -
ఇద్దరు తెలుగు సీఎంల భేటీ నేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం ముఖాముఖి భేటీ కాబోతున్నారు. -
సహకార సంఘాలకు వైకాపా చెదలు
వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలోని అధికశాతం సహకార బ్యాంకుల్ని ఊడ్చేశారు. రుణాల పేరుతో ఎడాపెడా కొల్లగొట్టారు. -
ప్రజాదర్బార్కు వినతుల వెల్లువ
రాష్ట్ర మానవవనరులు, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్కు.. మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించారు. -
హమ్మయ్య.. ఈ చెట్లు బతికిపోయాయి
రహదారిపై పందిరి వేసినట్లు కనువిందు చేస్తున్న ఈ దృశ్యం.. రాజధాని అమరావతిలోనిది. నేలపాడులో హైకోర్టు ఎదుట రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లు సుందరంగా కనిపించడమే కాదు.. దారెంట నీడనిస్తున్నాయి. -
పవన్కల్యాణ్ వారాహి దీక్షోద్వాసన
ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వారాహి ఏకాదశ దీక్ష శుక్రవారం కలశోద్వాసన క్రతువుతో ముగించారు. -
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి బాధ్యులెవరు?
‘అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఉన్న అధికారులు ఎవరు? పింఛా ప్రాజెక్టు నిండిపోయి అన్నమయ్యకు అంచనాకు మించి వరద వస్తుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారు? -
రాజధాని నిర్మాణానికి తొలి వేతనం విరాళం
విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్సభ సభ్యుడిగా అందుకున్న తొలి గౌరవ వేతన మొత్తం రూ.1.57 లక్షలను అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. -
తితిదే నిర్ణయించిన ధరలకే ఆహారమందిస్తాం
తిరుమలలోని ఏపీ టూరిజం హోటళ్లలో తితిదే నిర్ణయించిన ధరలకే నాణ్యమైన ఆహారం అందిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న టాటా గ్రూప్ ఛైర్మన్, రేమండ్స్ సీఎండీ
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం బ్రేక్ దర్శన సమయంలో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, రేమండ్స్ గ్రూప్ సీఎండీ గౌతమ్ సింఘానియా వేర్వేరుగా దర్శించుకున్నారు. -
ద్వారంపూడి సంస్థకు షోకాజ్ నోటీసులివ్వండి
కాకినాడ నగర వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. -
పేదల భూముల్ని చౌకగా కొట్టేశారు
పేదలకు ఇచ్చిన ఎసైన్డ్ భూములను వైకాపా పెత్తందార్లు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కుల కల్పనపై గత వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి, తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. -
ధ్రువపత్రాలు ఎందుకు అందించలేదో వివరణ ఇవ్వండి
మాజీ మంత్రి, వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ జడ్జి ఎస్.రామకృష్ణ 2021లో వేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన కేసులో దిగువ కోర్టు ధ్రువపత్రాలు(సర్టిఫైడ్ కాపీలు) ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. -
9, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. -
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాల సమయంలోనూ రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో శుక్రవారం 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. -
ఎర్రచందనం దందాలో పెద్ద తలకాయల్ని పట్టుకోండి
ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖాధికారులను ఆదేశించారు.