శ్రీవారి అన్నప్రసాదాలపై అవాస్తవాలు నమ్మొద్దు: తితిదే

శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాల్లో సేంద్రియ బియ్యం వాడకం నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని తితిదే నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం

Published : 04 Jul 2024 04:48 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాల్లో సేంద్రియ బియ్యం వాడకం నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని తితిదే నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తితిదే బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రెండు రోజుల కిందట ఈవో జె.శ్యామలరావు.. అర్చకులు, ఆలయ అధికారులతో సమావేశమై స్వామివారికి నివేదించే అన్నప్రసాదాలు, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారు తప్పితే ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని