- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి: మంత్రి లోకేశ్
విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ఈనాడు, అమరావతి: విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఉండవల్లిలో మంగళవారం రాష్ట్రోపాధ్యాయ సంఘం నేతలు, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి లోకేశ్ను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, అధికారులు, పలు వర్గాలతో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన సంస్కరణలు అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం కనీసం చర్చలు లేకుండా ఏకపక్షంగా తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు విద్యారంగంలో గందరగోళ పరిస్థితులకు దారి తీశాయని పేర్కొన్నారు. ఉత్తర్వులు-117 రద్దు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆలోచిస్తున్నామని, టీచర్లకు బోధనేతర పనిభారం లేకుండా నూతన సంస్కరణలపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు. ఎలాంటి సర్వీసు సమస్యలు లేకుండా పదోన్నతులు, నియామకాలు, బదిలీలు చేపడతామని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయ వాణి మాస పత్రికను మంత్రి ఆవిష్కరించారు. మంత్రిని కలిసిన వారిలో ఎస్టీయూ అధ్యక్షుడు ఎల్.సాయిశ్రీనివాస్, ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు, ‘ఉపాధ్యాయ వాణి’ ప్రధాన సంపాదకులు గాజుల నాగేశ్వరరావు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుకు థాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర
విదేశీ విద్యా పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లకు ధన్యవాదాలు తెలపడానికి మక్బుల్జాన్ అనే మహిళ ద్విచక్ర వాహన యాత్ర చేపట్టారు. -
కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణం వేగంగా సాగుతోంది. చిన్నఅవుటపల్లి నుంచి సూరాయపాలెం వరకూ పనులు తుది దశకు వచ్చాయి. -
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ
రాజధాని అమరావతిలో మరో ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ ఏర్పాటు కాబోతోంది. మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైనదిగా గుర్తింపు పొందిన ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ త్వరలో తన ప్రాంగణాన్ని అమరావతిలో నెలకొల్పనుంది. -
ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి
గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. -
పెద్దిరెడ్డీ.. ఇదేం పని?
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ‘ఘన’కార్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపంలోని రాయల్నగర్లో రూ.19 లక్షల కార్పొరేషన్ సొమ్ముతో ఇంటికి సీసీ రోడ్డు వేయించుకున్నారు.. అంతేకాకుండా మరెవరికీ ప్రవేశం లేదంటూ రెండు వైపులా గేట్లు పెట్టేశారు. -
చేసిన పాపం కాల్చేస్తే పోతుందని!?
కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబంధించిన కీలక పత్రాల దహనం అనేక సందేహాలకు తావిస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పీసీబీ కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమాలకు ఆధారాలు లభించకుండా చేసేందుకు పత్రాల్ని, దస్త్రాల్ని తగలబెట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
ఆ రొయ్యల శుద్ధి పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమై రోగాల బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
మన్యంవీరుడు అల్లూరికి చంద్రబాబు నివాళి
స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. -
జగన్ ఫొటోతో ఉన్న నవరత్నాల లోగోలు తొలగించరేం?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా కొన్ని ప్రభుత్వశాఖల అధికారులకు గత వైకాపా ప్రభుత్వంపై అభిమానం తగ్గినట్లు లేదు. వైకాపా జెండా రంగులో రూపొందించిన కొన్ని ప్రభుత్వశాఖల వెబ్సైట్లను ఇప్పటికీ అదే విధంగా కొనసాగిస్తున్నారు. -
గుంతలు పూడ్చే ప్రాజెక్టు గోవిందా!
గత వైకాపా ప్రభుత్వం తలపెట్టిన గ్రామీణ రహదారుల్లో గుంతలు పూడ్చే ప్రాజెక్టు అటకెక్కింది. ఆర్థికసాయం చేసేందుకు నాబార్డు ససేమిరా అనడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. -
ప్రజా వేదిక శిథిలాలు అక్కడే
గతంలో జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలను తొలగించకుండా అలాగే ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వండి
దిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. -
అనుమతి లేకున్నా.. ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం
ధనార్జనే ధ్యేయంగా గత ఐదేళ్లలో వైకాపా నాయకులు వీలున్నచోటల్లా అక్రమ లేఅవుట్లు వేసి భారీగా దోపిడీకి పాల్పడ్డారు. -
జగన్ పర్యటనలో దొంగల హల్చల్
మాజీ సీఎం జగన్ పర్యటనలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గురువారం నెల్లూరులోని సెంట్రల్ జైలు వద్దకు రాగా.. ఆయన్ను చూసేందుకు వైకాపా కార్యకర్తలు పెద్దఎత్తున గుమిగూడారు. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరిస్తామని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్మార్క్ తెలిపారు. -
ఇదీ సంగతి!
-
మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ
మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటుకానుంది. దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో భేటీ అయ్యారు. -
ఆగస్టు 16 నుంచి విజయవాడ-ముంబయి విమాన సర్వీస్
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబయికి ప్రత్యేక సర్వీస్ను నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. -
సూర్యారాధన చేసిన పవన్ కల్యాణ్
వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం సూర్యారాధన క్రతువులో పాల్గొన్నారు. -
కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించాలి
రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. -
పిన్నెల్లిని పోలీసు కస్టడీకి అప్పగించాలని వాదనలు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు వేసిన పిటిషన్పై గురువారం మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వాదనలు సాగాయి.