ఆరోగ్యశాఖ ఉద్యోగుల వివరాలివ్వండి: మంత్రి సత్యకుమార్‌

ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వివరాలు పంపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

Published : 02 Jul 2024 05:41 IST

ఈనాడు, అమరావతి: ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వివరాలు పంపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. 2014-19 మధ్య ఎంత మంది పని చేశారు, ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు, డిప్యుటేషన్‌లపై పని చేసే వారి వివరాలు, మంజూరైన పోస్టులు, పొరుగు/ఒప్పంద సేవల కింద ఎంత మంది పనిచేస్తున్నారు.. తదితర వివరాలను వెంటనే పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా అధికారుల బాధ్యతల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని