- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
స్వగ్రామాలకు వీర సైనికుల పార్థివదేహాలు
లద్దాఖ్ వద్ద శ్యోక్ నదిని దాటుతుండగా.. ఆకస్మికంగా వచ్చిన వరదకు దౌలత్బేగ్ ఓల్డీ సైనిక స్థావరానికి చెందిన యుద్ధ ట్యాంకర్ శనివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
విజయవాడ విమానాశ్రయంలో నివాళి
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తరఫున వీరసైనికుల భౌతికకాయాలకు నివాళులర్పిస్తున్న ఏడీసీ మేజర్ దీపక్శర్మ
గన్నవరం గ్రామీణం, రేపల్లె అర్బన్, పెడన, న్యూస్టుడే: లద్దాఖ్ వద్ద శ్యోక్ నదిని దాటుతుండగా.. ఆకస్మికంగా వచ్చిన వరదకు దౌలత్బేగ్ ఓల్డీ సైనిక స్థావరానికి చెందిన యుద్ధ ట్యాంకర్ శనివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు జవాన్ల పార్థివదేహాలను గ్వాలియర్ విమానాశ్రయం నుంచి వాయుసేన విమానంలో సోమవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. వీర సైనికులు సాదరబోయిన నాగరాజు (కృష్ణా జిల్లా, పెడన మండలం, చేవెండ్ర), ఆర్.కృష్ణారెడ్డి (ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, రేచర్ల), సుభాన్ఖాన్ (బాపట్ల జిల్లా, ఇస్లాంపూర్) భౌతికకాయాలకు గన్ సెల్యూట్, పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తరఫున ఏడీసీ మేజర్ దీపక్శర్మ నివాళి అర్పించారు. బ్రిగేడియర్ వి.వెంకట్రెడ్డి, లెఫ్టినెంట్ కల్నల్ సందీప్యాదవ్, మేజర్ సుధీర్శర్మ, ఏవోసీ సికింద్రాబాద్ కేంద్ర కెప్టెన్ దీపక్బాణి, నాయుబ్సుబిదార్ జీడీరెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ఆర్మీ వాహనాల్లో జవాన్ల పార్థివదేహాలను స్వగ్రామాలకు తరలించారు. ఇస్లాంపూర్ గ్రామస్థులు జాతీయ జెండాలతో ఊరేగింపుగా సుభాన్ఖాన్ పార్థివదేహాన్ని ఆయన ఇంటి వద్దకు తీసుకొచ్చారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరులు సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. మరో అమర సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివదేహానికి రాత్రి 9 గంటలకు ఆయన స్వగ్రామం చేవేండ్రలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ నయీం అస్మీ తదితరులు నివాళులర్పించారు. ప్రజలు భారీగా తరలివచ్చారు.
సైనికుల మృతి కలచివేసింది: సీఎం చంద్రబాబు
లద్దాఖ్ వద్ద జరిగిన ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు సైనికులు చనిపోయిన ఘటన తనను కలచివేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఎక్స్ వేదికగా సోమవారం ఆయన నివాళి అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
ఆ రొయ్యల శుద్ధి పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమై రోగాల బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం.. కాకాణి సొంతూరిలో భారీ మోసం
ధనార్జనే ధ్యేయంగా గత ఐదేళ్లలో వైకాపా నాయకులు వీలున్నచోటల్లా అక్రమ లేఅవుట్లు వేసి భారీగా దోపిడీకి పాల్పడ్డారు. -
నెల్లూరు జిల్లాలో 2 పెద్దపులులు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ అధికారి బి.చంద్రశేఖర్ ధ్రువీకరించారు. -
మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ
మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటుకానుంది. దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో భేటీ అయ్యారు. -
సూర్యారాధన చేసిన పవన్ కల్యాణ్
వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం సూర్యారాధన క్రతువులో పాల్గొన్నారు. -
జగన్ పర్యటనలో దొంగల హల్చల్
మాజీ సీఎం జగన్ పర్యటనలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గురువారం నెల్లూరులోని సెంట్రల్ జైలు వద్దకు రాగా.. ఆయన్ను చూసేందుకు వైకాపా కార్యకర్తలు పెద్దఎత్తున గుమిగూడారు. -
జగన్ ఫొటోతో ఉన్న నవరత్నాల లోగోలు తొలగించరేం?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా కొన్ని ప్రభుత్వశాఖల అధికారులకు గత వైకాపా ప్రభుత్వంపై అభిమానం తగ్గినట్లు లేదు. వైకాపా జెండా రంగులో రూపొందించిన కొన్ని ప్రభుత్వశాఖల వెబ్సైట్లను ఇప్పటికీ అదే విధంగా కొనసాగిస్తున్నారు. -
చంద్రబాబుకు థాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర
విదేశీ విద్యా పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లకు ధన్యవాదాలు తెలపడానికి మక్బుల్జాన్ అనే మహిళ ద్విచక్ర వాహన యాత్ర చేపట్టారు. -
కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణం వేగంగా సాగుతోంది. చిన్నఅవుటపల్లి నుంచి సూరాయపాలెం వరకూ పనులు తుది దశకు వచ్చాయి. -
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ
రాజధాని అమరావతిలో మరో ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ ఏర్పాటు కాబోతోంది. మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైనదిగా గుర్తింపు పొందిన ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ త్వరలో తన ప్రాంగణాన్ని అమరావతిలో నెలకొల్పనుంది. -
ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి
గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. -
పెద్దిరెడ్డీ.. ఇదేం పని?
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ‘ఘన’కార్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపంలోని రాయల్నగర్లో రూ.19 లక్షల కార్పొరేషన్ సొమ్ముతో ఇంటికి సీసీ రోడ్డు వేయించుకున్నారు.. అంతేకాకుండా మరెవరికీ ప్రవేశం లేదంటూ రెండు వైపులా గేట్లు పెట్టేశారు. -
చేసిన పాపం కాల్చేస్తే పోతుందని!?
కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబంధించిన కీలక పత్రాల దహనం అనేక సందేహాలకు తావిస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పీసీబీ కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమాలకు ఆధారాలు లభించకుండా చేసేందుకు పత్రాల్ని, దస్త్రాల్ని తగలబెట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మన్యంవీరుడు అల్లూరికి చంద్రబాబు నివాళి
స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. -
గుంతలు పూడ్చే ప్రాజెక్టు గోవిందా!
గత వైకాపా ప్రభుత్వం తలపెట్టిన గ్రామీణ రహదారుల్లో గుంతలు పూడ్చే ప్రాజెక్టు అటకెక్కింది. ఆర్థికసాయం చేసేందుకు నాబార్డు ససేమిరా అనడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. -
ప్రజా వేదిక శిథిలాలు అక్కడే
గతంలో జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలను తొలగించకుండా అలాగే ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వండి
దిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. -
సంక్షిప్త వార్తలు (11)
రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరిస్తామని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్మార్క్ తెలిపారు. -
ఇదీ సంగతి!
-
ఆగస్టు 16 నుంచి విజయవాడ-ముంబయి విమాన సర్వీస్
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబయికి ప్రత్యేక సర్వీస్ను నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. -
కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించాలి
రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్పై స్పందించిన నాగ్ అశ్విన్
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
-
అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం.. కాకాణి సొంతూరిలో భారీ మోసం
-
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి