జగన్‌ జమానాలో ఓఎస్డీ హవా!

మాజీ సీఎం జగన్‌ వద్ద ఓఎస్డీగా పనిచేసిన ధనుంజయరెడ్డి అప్పటి అధికార అండతో హవా కొనసాగించారు. హైదరాబాద్‌ జేఎన్టీయూలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించే తన సతీమణి వై.అపర్ణను రాష్ట్రానికి తీసుకొచ్చి..

Published : 02 Jul 2024 04:31 IST

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: మాజీ సీఎం జగన్‌ వద్ద ఓఎస్డీగా పనిచేసిన ధనుంజయరెడ్డి అప్పటి అధికార అండతో హవా కొనసాగించారు. హైదరాబాద్‌ జేఎన్టీయూలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించే తన సతీమణి వై.అపర్ణను రాష్ట్రానికి తీసుకొచ్చి.. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థలో కార్యదర్శి సభ్యురాలి హోదాలో నియమించుకున్నారు. ప్రస్తుతం ఆమె అదే పదవిలో కొనసాగుతున్నారు. సంస్థ నుంచి పెద్దఎత్తున డీఏ, టీఏలు పొందినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని