- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.
వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలే కారణం
ఆరో తరగతిలో ఒకే విద్యార్థికి పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడు
సోంపేట, న్యూస్టుడే: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం పాఠశాలల విలీనం పేరిట తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ 3 నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులను కేటాయించారు. గత ఏడాది 22 మందితో పాఠశాలను నడిపారు. వారిలో పదో తరగతి విద్యార్థులు నలుగురు వెళ్లిపోగా 18 మంది మిగిలారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 11 మంది టీసీలు తీసుకుని ప్రైవేటు బడులకు వెళ్లిపోయారు. ఇప్పుడు మూడో తరగతిలో ఒకరు,
ఏడో తరగతిలో ముగ్గురు విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయుడు
నాలుగో తరగతిలో ఇద్దరు, ఆరో తరగతిలో ఒకరు, ఏడో తరగతిలో ముగ్గురు మాత్రమే మిగిలారు. వారికి ఏడుగురు స్కూలు అసిస్టెంట్లు పాఠాలు బోధిస్తున్నారు. ఆంగ్లం, గణితం సబ్జెక్టులకు ఇద్దరేసి ఉపాధ్యాయులు ఉన్నారు. తెలుగు, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రాలకు సంబంధించి ఒక్కొక్కరు పని చేస్తున్నారు. ఉపాధ్యాయుల జీతభత్యాలు, మధ్యాహ్న భోజన పథకం వంట నిర్వాహకులు, ఆయా వేతనాలు, ఇతర ఖర్చులు పరిశీలిస్తే నెలకు రూ.7 లక్షలకు పైగా ఖర్చవుతోంది. ఈ విషయమై శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావును ‘న్యూస్టుడే’ సంప్రదించగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మ్యాపింగ్ పాఠశాలల్లో విద్యార్థులతో సంబంధం లేకుండా స్కూలు అసిస్టెంట్లను నియమించాలనే ఆదేశాల మేరకు ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ముంగిళిపట్టు పంచాయతీలో పింఛన్ల అక్రమ బాగోతం వెలుగు చూసింది. వైకాపా సర్పంచి జాగర్లమూడి భారతి దంపతులతోపాటు మరో 20 మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు తెదేపా నాయకులు వెల్లడించారు. -
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం!
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. -
‘స్టాప్ డయేరియా’పై విస్తృత అవగాహన
డయేరియా మహమ్మారి పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రానున్న రెండు నెలల పాటు పల్లెల్లో, మురికివాడల్లో ‘స్టాప్ డయేరియా’ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. రెండున్నరేళ్ల తర్వాత కదిలిన పోలీసులు
తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా మూకల దాడి ఘటనలో రెండున్నరేళ్ల తర్వాత పోలీసులు కదిలారు. నాటి వైకాపా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హింసాకాండపై ఇన్నాళ్లూ కనీసం చర్యలు తీసుకోని పోలీసులు.. -
పలువురు వీసీల రాజీనామా
రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల ఉప కులపతులు సోమవారం రాజీనామాలు సమర్పించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నియామకాలు పొందిన వీసీల్లో పలువురు అనేక ఆరోపణలు మూటగట్టుకున్నారు. -
గుంతలు పూడ్చిన గుత్తేదారులకే రూ.668 కోట్ల బకాయిలు
మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం రహదారుల విస్తరణ కాదు కదా.. కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. ఫలితంగా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రాష్ట్రమంతటా రోడ్లు ధ్వంసమై ప్రజలు ఐదేళ్లు నరకం చూశారు. -
జగన్ నివాసం వెనుక రోడ్డులో.. అడ్డంకుల తొలగింపు
వైకాపా హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురిచేశారు. -
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభమయ్యాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఆదేశాలతో ఈ సేవలను సోమవారం పునఃప్రారంభించారు. -
ఉచిత ప్రయాణంపై త్వరితగతిన అధ్యయనం అవసరం
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై త్వరితగతిన అధ్యయనం అవసరమని రాష్ట్ర రవాణా, వ్యవసాయశాఖ మంత్రులు మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. -
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
రేషన్ సరకులు పంపిణీ చేసే వ్యాన్లపై మాజీ సీఎం జగన్ బొమ్మలు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా, పాటించకపోవడంపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని సుమారు 30 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. -
బందోబస్తుకు ఆలస్యంగా వచ్చారని ఎస్ఐపై మంత్రి భార్య ఆగ్రహం
మంత్రుల పర్యటనల్లో ఆడంబరాలు వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయినా ఓ మంత్రి భార్య పోలీసులపై మండిపడటం.. ఏకవచనంతో సంబోధించడం వివాదాస్పదమైంది. -
దివ్యాంగురాలి పింఛను పునరుద్ధరణ
నిబంధనల పేరుతో గత వైకాపా ప్రభుత్వం ఓ దివ్యాంగురాలికి నిలిపివేసిన పింఛన్ను.. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం పునరుద్ధరించి ఆమె జీవితంలో వెలుగులు నింపింది. -
ప్రక్షాళన దిశగా ఆర్థికశాఖ
ఆర్థికశాఖ ప్రక్షాళన దిశగా ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైకాపా ప్రభుత్వంతో అంటకాగిన పలువురు అధికారుల్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. -
అమరావతిపై 3న శ్వేతపత్రం విడుదల
ఐదేళ్ల జగన్ పాలనలో రాజధాని అమరావతి విధ్వంసం, తాజా పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు 3న (బుధవారం) శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. -
అప్పుల కుప్పగా విద్యుత్ సంస్థ
జగన్ అప్పుల థియరీ ఇంధన శాఖను నిండా ముంచింది. గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా సంస్థ అప్పులను రూ. 1.20 లక్షల కోట్లకు పెంచింది. -
‘సార్వత్రిక’ పది పరీక్షల్లో 63% మంది ఉత్తీర్ణత
సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి పరీక్షల్లో 63.30% మంది, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 69.07% మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా సోమవారం విడుదల చేశారు. -
స్వగ్రామాలకు వీర సైనికుల పార్థివదేహాలు
లద్దాఖ్ వద్ద శ్యోక్ నదిని దాటుతుండగా.. ఆకస్మికంగా వచ్చిన వరదకు దౌలత్బేగ్ ఓల్డీ సైనిక స్థావరానికి చెందిన యుద్ధ ట్యాంకర్ శనివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. -
క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి
క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఆరోగ్యశ్రీ వంటి ఉచిత ఆరోగ్య సేవల్లో చేర్చడం ద్వారా ప్రజలు ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా.నోరి దత్తాత్రేయుడు అన్నారు. -
జగన్ జమానాలో ఓఎస్డీ హవా!
మాజీ సీఎం జగన్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన ధనుంజయరెడ్డి అప్పటి అధికార అండతో హవా కొనసాగించారు. హైదరాబాద్ జేఎన్టీయూలో ప్రొఫెసర్గా విధులు నిర్వహించే తన సతీమణి వై.అపర్ణను రాష్ట్రానికి తీసుకొచ్చి.. -
మహిళలు, చిన్నారులపై నేర ఘటనల్లో కఠిన శిక్షలకు వీలుగా బీఎన్ఎస్
బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో కఠిన శిక్షలు విధించేందుకు వీలుగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు అన్నారు.