- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
తిరుమలలోని శారదా పీఠం భవనాలు సీజ్ చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మించిన భవనాలను సీజ్ చేయాలని శ్రీఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు.
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసానంద సరస్వతి. చిత్రంలో ఏపీ సాధుపరిషత్ సభ్యులు
ఈనాడు డిజిటల్, తిరుపతి-తిరుపతి భవానీనగర్, తిరుమల, న్యూస్టుడే: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మించిన భవనాలను సీజ్ చేయాలని శ్రీఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు ఎనభై అడుగుల విస్తీర్ణంలో ఉన్న వాగును అరవై అడుగుల వరకు ఆక్రమించి అడ్డదారిలో అనుమతులు తెచ్చుకొని భవనాలు నిర్మించారని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో వరద నీరంతా శారదా పీఠంలోకి వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల భక్తుల ప్రాణాలకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో కల్తీ ఆహారం, అక్రమ కట్టడాలపై తితిదే అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తులకు భోజనం, వసతి, యజ్ఞాలు నిర్వహించుకునేందుకు వీలుగా తితిదే పలు మఠాల నిర్మాణం కోసం స్థలాలు ఇస్తే, విశాఖ శారదా పీఠం వంటి మఠాలు మాత్రం వాటిపేరుతో వ్యాపారం చేస్తున్నాయని ఆరోపించారు.
హైకోర్టు పరిధిలో శారదాపీఠం అదనపు నిర్మాణాల అంశం: తితిదే
తిరుమలలో మఠం నిర్మించుకోవడానికి విశాఖ శారదాపీఠానికి ఐదువేల చదరపు అడుగుల స్థలాన్ని తితిదే లీజుకు ఇచ్చిందని, 2005 ఫిబ్రవరిలో 30 సంవత్సరాలపాటు స్థలం లీజుకు ఇవ్వడానికి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుందని తితిదే శనివారం ప్రకటనలో పేర్కొంది. తిరుమలలో అనుమతులకు మించి శారదా పీఠం చేపట్టిన నిర్మాణాలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో తితిదే స్పందించింది. శ్రీశారదా మఠానికి పక్కనే ఉన్న 4817 చదరపు అడుగుల స్థలాన్ని కూడా శారదాపీఠం వినియోగించుకుందని, 2019లో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి క్రమబద్ధీకరించుకుందని వెల్లడించింది. అక్రమ నిర్మాణాల వివాద అంశం ఏపీ హైకోర్టు పరిధిలో ఉందని తితిదే పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
రేషన్ సరకులు పంపిణీ చేసే వ్యాన్లపై మాజీ సీఎం జగన్ బొమ్మలు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా, పాటించకపోవడంపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఊరువాడా ‘కొత్త పింఛన్ల కళ’
రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా వాడవాడలా సోమవారం పింఛన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛనుదారుల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.7 వేల చొప్పున పింఛన్ను లబ్ధిదారులకు అందించింది. -
నిరుపేద ఇంటికి చంద్రన్న ‘భరోసా’
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాకలో ఉండే బాణావత్ పాములు నాయక్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆ కుటుంబానికి తొలి పింఛను అందజేశారు. -
నీళ్లలో ఉన్నా డయాఫ్రం వాల్కు ఏం కాదు
‘పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్పై వరద నీరు ప్రవహంచినంత మాత్రాన ఆ కట్టడానికి ఏమీ కాదు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదు’ అని అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వ్యాఖ్యానించారు. -
విభజన సమస్యలు పరిష్కరించుకుందాం
విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6న హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి.. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం లేఖ రాశారు. -
ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టెట్ నోటిఫికేషన్ను సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది. పేపర్-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్-1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. -
ఫోన్పే, గూగుల్పే ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు ఇక కుదరదు
ఫోన్పే, గూగుల్పే, పేటీఎం తదితŸర యూపీఐ యాప్ల ద్వారా ఇప్పటి వరకు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు షాక్ తగిలింది. ఈ నెల నుంచి వాటి ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. -
95 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
‘చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు 95 శాతం మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశాం. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల్లోపు 61,76,188 మందికి, రూ.4,169.49 కోట్లు అందించాం. -
రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి ఎగుమతి!
కాకినాడలో రేషన్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పేదల బియ్యాన్ని నూకలుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు రెండు రోజులుగా పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు నిర్వహించిన దాడుల్లో బట్టబయలైంది. -
స్తంభించిన దేవాదాయశాఖ వెబ్సైట్
దేవాదాయశాఖకు చెందిన వెబ్సైట్ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి నిలిచిపోయింది. దీంతో వివిధ ప్రధాన ఆలయాల్లో దర్శనాలు, పూజలు తదితరాలకు ఆన్లైన్లో ముందే టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు గందరగోళానికి గురయ్యారు. -
నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్
ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ ప్రవేశాల కౌన్సెలింగ్కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్కు మంగళవారం నుంచి ఈ నెల 10 వరకు అవకాశం కల్పించింది. -
ఆరోగ్యశాఖ ఉద్యోగుల వివరాలివ్వండి: మంత్రి సత్యకుమార్
ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వివరాలు పంపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు. -
ప్రభుత్వం మారినా ఉన్నత విద్యామండలిలో వారిదే పెత్తనం
ప్రభుత్వం మారినా ఉన్నత విద్యామండలి నిర్వహణ గాడిన పడలేదు. అధికారుల బెదిరింపులు, పాతవారి పెత్తనం కొనసాగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చంద్రబాబు చిత్రపటానికి ఎంపీల పాలాభిషేకం
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలు, దివ్యాంగులకు ఏప్రిల్ నుంచి పెంచిన పింఛను అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి తెదేపా ఎంపీలు సోమవారమిక్కడ పాలాభిషేకం చేశారు. -
ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు అంతా సిద్ధం
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. -
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ముంగిళిపట్టు పంచాయతీలో పింఛన్ల అక్రమ బాగోతం వెలుగు చూసింది. వైకాపా సర్పంచి జాగర్లమూడి భారతి దంపతులతోపాటు మరో 20 మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు తెదేపా నాయకులు వెల్లడించారు. -
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం!
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. -
‘స్టాప్ డయేరియా’పై విస్తృత అవగాహన
డయేరియా మహమ్మారి పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రానున్న రెండు నెలల పాటు పల్లెల్లో, మురికివాడల్లో ‘స్టాప్ డయేరియా’ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. రెండున్నరేళ్ల తర్వాత కదిలిన పోలీసులు
తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా మూకల దాడి ఘటనలో రెండున్నరేళ్ల తర్వాత పోలీసులు కదిలారు. నాటి వైకాపా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హింసాకాండపై ఇన్నాళ్లూ కనీసం చర్యలు తీసుకోని పోలీసులు.. -
పలువురు వీసీల రాజీనామా
రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల ఉప కులపతులు సోమవారం రాజీనామాలు సమర్పించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నియామకాలు పొందిన వీసీల్లో పలువురు అనేక ఆరోపణలు మూటగట్టుకున్నారు. -
గుంతలు పూడ్చిన గుత్తేదారులకే రూ.668 కోట్ల బకాయిలు
మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం రహదారుల విస్తరణ కాదు కదా.. కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. ఫలితంగా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రాష్ట్రమంతటా రోడ్లు ధ్వంసమై ప్రజలు ఐదేళ్లు నరకం చూశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం