- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
గత సర్కారు నిర్లక్ష్యం.. కొత్త ప్రభుత్వంపై చక్కదిద్దే భారం
గత ప్రభుత్వం పాఠశాలల్లో అసంపూర్తిగా వదిలేసిన మౌలికసదుపాయాల పనులను పూర్తి చేయడం కొత్త ప్రభుత్వానికి సవాల్గా మారనుంది.
బడుల్లో మౌలిక సదుపాయాల పనులకు రూ.వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్
నిర్మాణ సామగ్రి సరఫరా ఆపేసిన గుత్తేదార్లు
అసంపూర్తి తరగతి గదులతో ఇబ్బందులు
ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వం పాఠశాలల్లో అసంపూర్తిగా వదిలేసిన మౌలికసదుపాయాల పనులను పూర్తి చేయడం కొత్త ప్రభుత్వానికి సవాల్గా మారనుంది. మాజీ సీఎం జగన్ ఐదేళ్లపాటు పనులు చేస్తున్నట్లు ప్రచారం చేయడం తప్ప వాటిని పూర్తి చేయలేదు. మూడు విడతల్లో అన్ని పాఠశాలల్లో మౌలికసదుపాయాలు కల్పిస్తామంటూ గొప్పగా ప్రకటనలు చేసి, రెండో విడత పనులనే అసంపూర్తిగా వదిలేశారు. 2021 ఆగస్టు 16న ప్రారంభించిన రెండో విడత పనులను రెండున్నరేళ్లకుపైగా సాగదీసి, మధ్యలో వదిలేశారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గదుల నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. వీటి కోసం తీసుకొచ్చిన సామగ్రిని పాఠశాలల ఆవరణల్లో ఎక్కడపడితే అక్కడ పడేశారు. కొన్నిచోట్ల సామగ్రిని తరగతుల్లో భద్ర పరచడంతో గదుల కొరత నెలకొంది. ఇప్పుడు ఈ అసంపూర్తి పనులను కొత్త ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయాల్సి ఉంది. ఎన్నికల ముందు తమకు కావాల్సిన గుత్తేదారులకు దోచిపెట్టిన జగన్ ప్రభుత్వం ఈ పనుల బిల్లులను పెండింగ్లో పడేసింది. పనులు పూర్తి చేయించడంతోపాటు సామగ్రి కొనుగోలుకు నిర్వహించిన టెండర్లపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తోంది.
బిల్లులు ఇవ్వలేదని సిమెంటు నిలిపివేత
గత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించి రూ.1,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో సామగ్రి సరఫరా చేసిన గుత్తేదార్లకు రూ.230 కోట్లు చెల్లించాల్సి ఉంది. బిల్లులు పెండింగ్ పెట్టినందున గుత్తేదారులు సామగ్రి సరఫరా నిలిపివేశారు. కొన్నిచోట్ల మరుగుదొడ్లు పూర్తయినా.. తలుపులు లేక వాటిని వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. అదనపు తరగతి గదులకు సైతం తలుపులు, కిటికీల సమస్య నెలకొంది. కొన్నిచోట్ల బడుల్లో నిధులున్నా సిమెంట్, మరికొన్నిచోట్ల ఇసుక కొరత వేధిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేలకుపైగా తరగతి గదులు అసంపూర్తిగా ఉన్నాయి. కొత్త గదుల నిర్మాణాల కోసమంటూ కొన్నిచోట్ల పాతవాటిని కూల్చేశారు.
చేసిన పనుల్లోనూ అక్రమాలు
వైకాపా హయాంలో చేసిన పనుల్లోనూ అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. మొదటి విడత బడులకు సరఫరా చేసిన ఆర్వోప్లాంట్లు సక్రమంగా పని చేయడం లేదు. కొన్నిచోట్ల నీటి క్యాన్లు తెప్పిస్తుండగా.. మరికొన్నిచోట్ల నల్లా నీళ్లనే విద్యార్థులు తాగాల్సి వస్తోంది. ఈ ఆర్వోప్లాంట్లకు మూడేళ్లు గ్యారంటీ ఉన్నా బిగించిన ఆరు నెలలకే సమస్యలు వచ్చాయి. ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ కొనుగోళ్ల టెండర్లను ఏపీ విద్య, సంక్షేమ మౌలికసదుపాయాల కల్పన సంస్థ(ఏపీఈడబ్ల్యుఎస్) నిర్వహించింది. ఆర్వోప్లాంట్ల విషయంలో సరైన నిబంధనలు పాటించకపోవడంతో రూ.కోట్లలో ప్రజాధనం ఖర్చు చేసినా ఉపయోగం లేకుండాపోయింది.
- డ్యూయల్ డెస్క్ల సరఫరాలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మొదట 1.50లక్షల డ్యూయల్ డెస్క్లకు ఒప్పందం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వీటి కంటే 15% అదనంగా తీసుకోవచ్చు. దీనికి మించితే కొత్త టెండర్లు నిర్వహించాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా 1.50లక్షలకు ఒప్పందం చేసుకొని 2.49లక్షలు కొనుగోలు చేశారు.
- బగ్రీన్ చాక్పీస్ బోర్డుల టెండర్లలో మరో వింత చోటుచేసుకుంది. ఈ-టెండరులో ఎల్-1గా నిలిచిన వ్యక్తికి 15వేల బోర్డుల సరఫరా ఇచ్చి, ఒప్పంద గడువు ముగిసిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఎల్-2గా నిలిచిన గుత్తేదారుకు 20 వేల బోర్డుల సరఫరా ఇచ్చారు.
- ఫ్యాన్లలోనూ నాణ్యత లోపించింది. గుత్తేదారుకు జరిమానా విధించాలని ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్ఫోన్లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. -
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా
-
కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురు
-
దిగొచ్చిన వాణిజ్య సిలిండర్ ధర.. రూ.32 తగ్గింపు
-
మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్.. నిలిచిన ఆన్లైన్ టికెట్ల జారీ
-
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
-
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్