- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
పారిశుద్ధ్యం.. భద్రత.. ఓ కుంభకోణం!
బోధనాసుపత్రుల్లో జోన్ల వారీగా పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు గత వైకాపా ప్రభుత్వం పిలిచిన టెండర్ను కొత్త ప్రభుత్వం రద్దుచేసింది. కొత్తగా మరోసారి టెండరు పిలవనుంది.
ఆసుపత్రుల్లో సిబ్బంది రాకపోయినా భారీగా మార్కులు
వాటి ఆధారంగానే వారికి చెల్లింపులు
గత ప్రభుత్వం పిలిచిన టెండర్ రద్దు
ఈనాడు, అమరావతి: బోధనాసుపత్రుల్లో జోన్ల వారీగా పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు గత వైకాపా ప్రభుత్వం పిలిచిన టెండర్ను కొత్త ప్రభుత్వం రద్దుచేసింది. కొత్తగా మరోసారి టెండరు పిలవనుంది. బోధనాసుపత్రుల్లో భద్రత, పారిశుద్ధ్యం, ఎలుకల నివారణ లాంటి పనుల్లో వైకాపా పాలనలో చాలా పెద్ద కుంభకోణమే చోటుచేసుకుంది. ఈ మూడు అంశాలకు వైకాపా పాలనలో టెండర్ల ద్వారా ఎంపికచేసిన సంస్థలు 2021 జూన్ 1 నుంచి బాధ్యతలు చేపట్టాయి. మూడేళ్ల కాలపరిమితి ఈ ఏడాది మే 31తో ముగిసింది. వీటి అక్రమాలను మరో ఏడాది పొడిగించేలా వైకాపా హయాంలో గట్టి ప్రయత్నాలే జరిగినా, అధికారులు 3 నెలలకే పొడిగింపు ఇచ్చారు. పారిశుద్ధ్య పనులకు గత ప్రభుత్వం పిలిచిన టెండర్లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ రద్దుచేశారు. ఈ మూడు రకాల పనులకు ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.100 కోట్ల వరకు ఖర్చుపెడుతోంది. నిత్యం రద్దీగా ఉండే బోధనాసుపత్రుల్లో పారిశుద్ధ్యం, భద్రత, ఎలుకల నివారణ పనులు సక్రమంగా జరగడంలేదు. మరోవైపు.. ఈ సంస్థల పనితీరు, బిల్లుల చెల్లింపులను పరిశీలించే అధికారులు, సిబ్బందిలో చాలామందికి నెలవారీ ముడుపులు అందుతున్నాయి. టెండర్లు పొందినవారి తరఫున సబ్కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. ఇలాంటి అక్రమాలను నిశితంగా గమనించి, ఉల్లంఘనలకు తగ్గట్లు చర్యలు తీసుకోవాల్సిన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఉదాసీనంగా వ్యవహరించడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హాజరు కాకున్నా మార్కుల వరద
డీఎంఈ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 23 బోధనాసుపత్రులు, ప్రత్యేక ఆసుపత్రులు ఉన్నాయి. రోజూ వార్డులు, ఫ్లోర్లను మూడు సార్లు, ఆపరేషన్ థియేటర్లను ఐదుసార్లు శుభ్రం చేస్తేనే దుర్వాసన రాకుండా ఉంటుంది. దీన్ని పరిశీలించేవారు లేరు. తిరుపతి రుయాలో గతేడాది పారిశుద్ధ్య విభాగంలో 76% మందే హాజరైనట్లు నమోదుకాగా.. 98 మార్కులు వేశారు. కడప జీజీహెచ్లో పారిశుద్ధ్యం, భద్రతా విభాగాల్లో 76.01%, 68.11% మంది చొప్పున విధులకు హాజరైతే... 96 చొప్పున మార్కులు ఇచ్చారు. విశాఖ కేజీహెచ్లో భద్రత, ఎలుకల నివారణ విభాగంలో ఉద్యోగుల హాజరు (ఆగస్టు) 80-85% మధ్యన ఉండగా ప్రాధాన్య మార్కులు 96 వరకు వచ్చాయి. ఈ మార్కుల ఆధారంగానే వారికి చెల్లింపులు ఉంటాయి. కాకినాడ జీజీహెచ్లో నిబంధనల ఉల్లంఘన తీవ్రంగా ఉంది.
భద్రతా విభాగంలో మహిళలే ఎక్కువ
భద్రతా విభాగంలో నిబంధనల ఉల్లంఘనలు మరీ దారుణంగా ఉన్నాయి. గార్డుల్లో ఎక్కువమంది మహిళలు ఉంటున్నారు. 30 పడకలకు మొదటి షిఫ్టులో ఇద్దరు, రెండో షిఫ్టులో ఒకరు, మూడో షిఫ్టులో ఒకరి చొప్పున ఉండాలి. పారిశుద్ధ్య పనివారు ప్రతి పది పడకలకు ఒకరు (ఫస్ట్ షిఫ్ట్), 20 పడకలకు ఒకరు (రెండో షిఫ్ట్), 30 పడకలకు ఒకరు (మూడో షిఫ్ట్) విధుల్లో ఉండాలి. కేజీహెచ్ వంటి పెద్దాసుపత్రుల్లో కనీసం 200 మంది విధుల్లో ఉండాలి. కానీ తగిన సంఖ్యలో వీరిని నియమించడం లేదు. తక్కువ మందిని నియమించి, ఎక్కువ మందిని నియమించినట్లు చూపించి డబ్బు కొట్టేస్తున్నారు. ఒకటి రెండు చోట్ల మినహా దాదాపుగా ఏ ఆసుపత్రిలోనూ నిబంధనల మేరకు సిబ్బంది విధుల్లో ఉండడంలేదు. ఈ మొత్తం వ్యవహారాలపై తగిన విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్ఫోన్లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. -
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా?
-
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
-
‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్
-
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా
-
కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురు
-
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర..