- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి అవార్డు
విజయవాడలోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి దేశంలోనే ఉత్తమ సేవా విభాగంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అవార్డు లభించింది.
దేశంలోనే రికార్డుస్థాయిలో ఏటా 3.75 లక్షల మందికి జారీ
విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్సింగ్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న శివహర్ష
ఈనాడు, అమరావతి: విజయవాడలోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి దేశంలోనే ఉత్తమ సేవా విభాగంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అవార్డు లభించింది. జూన్ 24న దిల్లీలో జరిగిన పాస్పోర్టు సేవా దివస్ కార్యక్రమంలో విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్సింగ్ చేతుల మీదుగా అవార్డును విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి శివహర్ష అందుకున్నారు. విజయవాడలో బుధవారం విలేకరుల సమావేశంలో శివహర్ష ఈ విషయం తెలిపారు. 2023-24లో రికార్డుస్థాయిలో 3.75 లక్షల పాస్పోర్టులను జారీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. దేశంలోని 37 పాస్పోర్టు రీజియన్ కార్యాలయాల పరిధిలో అంతకుముందు ఏడాది కంటే 15 శాతం అధికంగా జారీ చేయగా, విజయవాడలో 20 శాతం దాటడం గొప్ప విషయమని శివహర్ష తెలిపారు. 13 పోస్టాఫీసు సేవాకేంద్రాలు, విజయవాడ, తిరుపతిలోని పాస్పోర్టు కార్యాలయాల ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించామని వివరించారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత కేవలం రెండు మూడు రోజుల్లో పాస్పోర్టును జారీ చేసే దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 600 మందికి సేవలు అందిస్తున్నామన్నారు. త్వరలోనే సేవలను విస్తరించడం ద్వారా రోజుకు 1,200 మందికి పెంచనున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కృష్ణపట్టిలో పెద్దపులి
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. -
వైకాపా వీర విధేయ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా
వైకాపాతో అంటకాగి, ఆ పార్టీకి వీరవిధేయుడిగా పేరొందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) ప్రసాదరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. -
వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా
‘‘కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకొని బియ్యం అక్రమ రవాణా చేశారు. ప్రభుత్వం రూ.39కి కిలో బియ్యం అందిస్తుంటే.. పేదల వద్ద రూ.7కి కొనుగోలు చేశారు. -
ఎన్టీఆర్ మోడల్ స్కూల్ను సందర్శించిన భువనేశ్వరి
నిరుపేద చిన్నారులకు అదో అక్షరాల గుడి.. తల్లిదండ్రుల్లేని వారిని అక్కున చేర్చుకున్న అమ్మ ఒడి..అదే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్. -
14 అడుగుల గిరినాగు పట్టివేత
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడలో 14 అడుగుల గిరినాగు (కింగ్ కోబ్రా) హల్చల్ చేసింది. అందరూ చూస్తుండగానే ఎస్సీ కాలనీలోని ఓ గుడిసెలోకి చొరబడింది. -
వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్పై వైకాపా పడగ
వైజాగ్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ (వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్)పై వైకాపా స్వారీ చేస్తోంది. కల్చరల్ సెంటర్కు సాధారణంగా ఒకటే కమిటీ ఉంటుంది. -
దారి కొట్టుకుపోయింది.. అవస్థలు మిగిలాయి..!
పక్కా రోడ్డు కోసం గిరిజనులు ఏళ్లుగా ఎదురుచూశారు. ప్రభుత్వం కనికరించి పనులు మొదలుపెట్టి.. మధ్యలోనే వదిలేసింది. ఇంకేం.. చేసిన కాస్త పనులూ వర్షాలకు కొట్టుకుపోయాయి. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. -
గత సర్కారు నిర్లక్ష్యం.. కొత్త ప్రభుత్వంపై చక్కదిద్దే భారం
గత ప్రభుత్వం పాఠశాలల్లో అసంపూర్తిగా వదిలేసిన మౌలికసదుపాయాల పనులను పూర్తి చేయడం కొత్త ప్రభుత్వానికి సవాల్గా మారనుంది. -
అరాచక అధికారులపై సర్కారు డేగకన్ను!
వైకాపా హయాంలో గత అయిదేళ్ల పాటు రాష్ట్రంలో కొనసాగిన దాష్టీకాలు, అరాచకాలు, అక్రమాలు, దాడులు, రాజకీయ హత్యలు, తప్పుడు కేసులకు బాధ్యులైన పోలీసు అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
గ్రామాలకు జగన్ ద్రోహం
గ్రామీణాభివృద్ధికి దోహదం చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలకు గత వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులివ్వకుండా భ్రష్టు పట్టించడమే కాదు.. కేంద్రం ఇతర పథకాల కింద ఇచ్చే నిధులూ ఉపయోగించుకోలేకపోయింది. -
తితిదేలో అక్రమాల చిట్టా సిద్ధం!
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదేళ్ల కాలంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు నడుం బిగించిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులు తమ పరిశీలనను ముగించారు. -
ఒక ముఖ్యమంత్రికి 986 మంది భద్రత కావాలా?
‘ఒక ముఖ్యమంత్రికి 986 మంది సిబ్బందితో భద్రత కావాలా? పరదాలు కట్టుకుని తిరగడం, చెట్లు కొట్టేయడం.. ఏమిటిది? నేరస్థులకు సెక్యూరిటీ కావాలని అంటున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయవ్య దిశగా పయనించనుంది. -
భారీ వర్షాలపై అప్రమత్తం
‘భారీ వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశాం. ఐఎండీ అంచనాల ప్రకారం సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. -
వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. -
బీఎన్ఎస్ఎస్ అమలు కోసం నోటిఫికేషన్లు
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) చట్టం జులై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో అందులోని వివిధ సెక్షన్ల కింద పోలీసులకు అధికారాలను దఖలుపరుస్తూ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేసింది. -
ఒక అధికారి వెనక్కు
వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అనేకమంది డిప్యుటేషన్పై పట్టణ స్థానిక సంస్థల్లో కమిషనర్లు, అదనపు కమిషనర్లుగా పని చేస్తున్నారు. వారిలో ఒకరిని ప్రభుత్వం వెనక్కి రప్పించింది. -
పని ఒత్తిడి తగ్గించండి
వివిధ శాఖల నుంచి అనధికారికంగా కేటాయిస్తున్న పనుల నుంచి తమకు విముక్తి కలిగించాలని గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు(మహిళా పోలీసులు) కోరారు. -
1 నుంచి ట్రిపుల్ ఐటీ దరఖాస్తుల పరిశీలన
ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల దరఖాస్తులను జులై ఒకటి నుంచి పరిశీలిస్తామని ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య ఎస్.అమరేంద్రకుమార్ తెలిపారు. -
మచిలీపట్నం పూర్వ కమిషనర్ చంద్రయ్యపై హైకోర్టు ఆగ్రహం
న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రెవెన్యూ అధికారి ఎస్.వెంకటేష్ను విధుల్లోకి తీసుకునేందుకు నిరాకరించిన మచిలీపట్నం నగరపాలక సంస్థ పూర్వ కమిషనర్ జి.చంద్రయ్య (ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత అదనపు కమిషనర్)కు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.