- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
డ్రగ్స్, గంజాయి రక్కసి కోరలు పీకాల్సిందే
జగన్ జమానాలో మాదక ద్రవ్యాలకు, గంజాయికి కేంద్రంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ మహమ్మారిని తరిమికొట్టాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది.
జగన్ జమానాలో ఊరూరా లభ్యత
సాగు, రవాణా, విక్రయం వరకూ అష్టదిగ్బంధం చేయాలి
ఆ దిశగా బహుముఖ వ్యూహం అమలు చేయాలి
ఈనాడు, అమరావతి: జగన్ జమానాలో మాదక ద్రవ్యాలకు, గంజాయికి కేంద్రంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ మహమ్మారిని తరిమికొట్టాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. ఊరూరా వేళ్లూనుకుపోయిన ఈ రక్కసి కోరలు పీకేందుకు పటిష్ఠ కార్యాచరణ అమలుచేయాలి. ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం... సాగు నుంచి రవాణా, విక్రయం వరకూ ప్రతి దశలోనూ అష్టదిగ్బంధం చేస్తేనే గంజాయి లభ్యత, వినియోగం తగ్గుతాయి. ఆ మేరకు బహుముఖ వ్యూహం రూపొందించాలి. ఏఓబీలో ఇప్పటికీ వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. దాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలి. దీనికోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటుచేయాలి. ఒడిశాలోని మల్కన్గిరి, గజపతి, గంజాం తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గంజాయి ఏపీలోకి వచ్చేస్తోంది. ఆయా మార్గాలన్నింటినీ గుర్తించి తనిఖీలు ముమ్మరం చేసి వాటికి అడ్డుకట్ట వేయాలి. గంజాయి స్థావరాలపై దాడులు చేయాలి. ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటుచేసి.. విస్తృత తనిఖీలు జరపాలి.
టీఎస్ న్యాబ్ తరహా విభాగాలు అవసరం
గంజాయి, మాదకద్రవ్యాల కట్టడి కోసం అదనపు డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో తెలంగాణలో యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్)ను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. అది మంచి ఫలితాలిచ్చింది. గోవా తదితర రాష్ట్రాలకు వెళ్లి ఆపరేషన్లు నిర్వహించి డ్రగ్స్ ముఠాల సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఈ తరహా విభాగాల్ని ఏర్పాటుచేయాలి. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తరహాలో ఈ విభాగాల్ని సిద్ధం చేయాలి.
విద్యాసంస్థల్లో డ్రగ్ పెడలర్స్ను గుర్తించాలి
వైకాపా హయాంలో అన్ని స్థాయుల విద్యాసంస్థల్లోకి గంజాయి వ్యాపించింది. దీన్ని అరికట్టే కార్యాచరణలో కొత్త ప్రభుత్వం విద్యాసంస్థలను భాగస్వాముల్ని చేయాలి. కళాశాలల్లో అంతర్గత తనిఖీలు, నిశిత పరిశీలనలు చేయించాలి. విద్యార్థులపై వ్యక్తిగత పర్యవేక్షణ పెంచాలి. డ్రగ్ పెడలర్స్గా మారిన విద్యార్థులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలి. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలు, బానిసలు.. తమ జీవితాల్ని నాశనం చేసుకున్న తీరుపై అవగాహన సదస్సులు నిర్వహించాలి.
వ్యసన విముక్తి కేంద్రాలు ఏర్పాటుచేయాలి
రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల బానిసల సంఖ్య వేలల్లో ఉంది. వారిని ఆ విష వలయం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తగినన్ని వ్యసన విముక్తి కేంద్రాలు లేవు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యసన విముక్తి, పునరావాస కేంద్రాలు విస్తృతంగా ఏర్పాటు చేయాలి.
గంజాయి సరఫరా, వినియోగంపై అధ్యయనం జరగాలి
- రాష్ట్రంలో ఒకప్పుడు మద్యం మత్తులో ఎక్కువగా తీవ్ర, హింసాత్మక నేరాలు జరిగేవి. కానీ గత ఐదేళ్లలో గంజాయి మత్తులో జరిగిన దారుణాలే అత్యధికం. గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం రాష్ట్రంలో ఎంత ఉద్ధృతంగా ఉందనే దానిపై సమగ్ర అధ్యయనం చేయించాలి. అమెరికాలో మాదకద్రవ్యాల బారిన పడి ఒక వ్యక్తి చనిపోతే అందుకు గల కారణాలపై చాలా మేధోమథనం జరుగుతుంది. మన దగ్గర కూడా ఆ స్థాయిలో అధ్యయనం జరగాలి. దాని ఆధారంగా కట్టడికి పటిష్ఠ కార్యాచరణ రూపొందించాలి.
- డ్రగ్స్, గంజాయి రవాణా, వినియోగంపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా టోల్ఫ్రీ నంబరు ఏర్పాటుచేయాలి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో ఇది బాగా పనిచేసినా గత వైకాపా ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది. మళ్లీ కొత్త నంబరును సిద్ధం చేసి.. విస్తృత ప్రచారం కల్పించాలి.
- సీఐడీలోని నార్కొటిక్స్ విభాగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. దాన్ని మళ్లీ క్రియాశీలకం చేసి.. మత్తు ముఠాల ఆటకట్టించాలి.
- రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా చేసే ముఠాలపై నిఘాపెట్టాలి. వాటి వెనకనున్న కింగ్పిన్ల ఆచూకీ కనిపెట్టాలి. గంజాయి స్మగ్లర్ల ఆస్తులు జప్తుచేయాలి.
పీడీ యాక్ట్ ప్రయోగిస్తేనే...
- జగన్ పాలనలో దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు విశాఖ మన్యంలోనే బయటపడేవి. గంజాయి సాగు, రవాణాను అరికట్టకుండా వదిలేయడంతో మత్తుముఠాలు పేట్రేగిపోయాయి. వాటికి ముకుతాడు వేయాలి.
- మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుకు చెందిన మత్తు ముఠాలు గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తున్నాయి. మన్యంలో అలాంటి ముఠాలపై పీడీ యాక్ట్ ప్రయోగించాలి.
- గంజాయి విక్రేతలను గుర్తించేందుకు ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి వారిపై చర్యలు తీసుకోవాలి. అలాంటివారిపై పీడీ యాక్ట్ తెరవాలి.
- విశాఖ మన్యం నుంచి విదేశాల వరకూ గంజాయి మాఫియా కోరలు చాచింది. పోలీసులు కొరియర్లపైనే కేసులు పెడుతున్నారు. ఆ నెట్వర్క్ను ఛేదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
రాష్ట్రంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణను హైకోర్టు తప్పుపట్టింది. -
అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?
‘అరకొర సొమ్ము చేతిలో పెట్టి విడాకులు తీసుకుంటే.. రేప్పొద్దున్న భార్య, పిల్లలు ఎలా బతుకుతారు.. ఇదేం పరిష్కారం?’ అని గుంటూరు నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్బాబు విస్మయం వ్యక్తంచేశారు. -
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు!
పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగప్రవేశం చేశారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం దిల్లీ చేరుకున్నారు. -
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జులై 1వ తేదీ నుంచి కార్గో సేవలు పునఃప్రారంభం కానున్నాయి. కార్గో సర్వీసుకు 2021లో ముందడుగు పడినప్పటికీ కరోనా కారణంగా నిలిచిపోయాయి. -
జేఈఈ 8వ ర్యాంకర్కు రూ.1.60 కోట్ల పురస్కారం
విజయవాడ ఫిట్జి కళాశాల విద్యార్థి కోడూరు తేజేశ్వర్ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించినందుకు కళాశాల యాజమాన్యం రూ.1.60 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. -
అమరావతి పనులు పట్టాలెక్కించేందుకు సన్నాహాలు
ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు అవసరమైన సన్నాహాల్ని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చేస్తోంది. -
పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ కన్నుమూత
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్(76) కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యేకాలనీలోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. -
మాస్టారూ.. మీరే మీరే మాస్టారు!
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 39 ఏళ్లు వ్యాయామోపాధ్యాయునిగా పనిచేసిన తూము హన్మంతరావు చివరిగా సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. -
మీ భద్రత మా బాధ్యత
సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. -
స్టీల్ప్లాంటును జరిపేసి.. రాజధాని కట్టేద్దామన్నారు!
జగన్ లాంటి విపరీత, విధ్వంసకర ఆలోచనలు ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారని.. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఎదురైన అనుభవాలు మరోసారి రుజువు చేశాయి. -
దారి ఇస్తారా.. ఇక్కట్లు కొనసాగిస్తారా?
పదవి ఏదైనా ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం ఉపయోగించాలి. జగన్ మాత్రం అధికారం అండతో తన నివాసం పరిసరాల వారిని ఇబ్బందులకు గురిచేశారు. -
పదవి కాదు.. బాధ్యత
‘ఎంతో కీలకమైన పదవి ఇచ్చారు. ఇది ఉత్తరాంధ్రకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా. దీన్ని పదవిగా కాకుండా బాధ్యతగా నిర్వర్తిస్తా’ అని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. -
కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలుపైనే తొలి సంతకం: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సుభాష్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలు పైనే తొలి సంతకం చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. -
జీజీహెచ్ అభివృద్ధికి ఆర్థిక సహకారం: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో (జీజీహెచ్) మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందిస్తామని గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
లోక్ అదాలత్కు భారీ స్పందన 14,389 కేసుల పరిష్కారం
రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లకు భారీ స్పందన లభించింది. 14,389 పైగా కేసులు పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.49.36 కోట్ల పరిహారం అందజేశారు. -
నాగార్జున వర్సిటీ వీసీ రాజీనామా
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.రాజశేఖర్ ఎట్టకేలకు శనివారం రాజీనామా చేశారు. విషయం తెలుసుకున్న వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. -
తిరుమలలోని శారదా పీఠం భవనాలు సీజ్ చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మించిన భవనాలను సీజ్ చేయాలని శ్రీఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. -
ఇదీ సంగతి!
-
మా భవనాలపై దాడులు జరగకుండా నియంత్రించండి
వైకాపా కార్యాలయాల కోసం నిర్మిస్తున్న భవనాలపై దాడులు జరపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని గవర్నర్కు వైకాపా నేతలు విజ్ఞప్తి చేశారు. -
జోగి కుటుంబం కబ్జాపై డీజీపీకి నివేదిక
అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో మాజీ మంత్రి, వైకాపా నాయకుడు జోగి రమేష్ కుటుంబం పాత్రపై డీజీపీ కార్యాలయానికి ప్రాథమిక నివేదిక చేరింది. -
‘అనంతబాబుపై నమోదైన హత్య కేసును.. ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలి’
ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసును ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
-
నేనెప్పుడూ గణాంకాలు చూడను.. భారత్ గెలుపే ముఖ్యం: రోహిత్
-
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు
-
ఇదెంతో ప్రత్యేకం.. గత ఆరు నెలలు ఎలా ఉన్నాయో తెలుసు: హార్దిక్
-
టీమ్ఇండియా విజయం.. సినీ ప్రముఖుల ఆనందం.. ఎవరేమన్నారంటే?
-
తొలుత పెళ్లి.. తర్వాత అంత్యక్రియలు.. వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి