- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
నేటి వరకు యథాతథ స్థితి పాటించండి
నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనాల విషయంలో వివరణ ఇవ్వాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాలుచేస్తూ తొమ్మిది జిల్లాల వైకాపా అధ్యక్షులు బుధవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాలు వేశారు.
వైకాపా కార్యాలయాల కూల్చివేతపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఈనాడు, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనాల విషయంలో వివరణ ఇవ్వాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాలుచేస్తూ తొమ్మిది జిల్లాల వైకాపా అధ్యక్షులు బుధవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాలు వేశారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి కోరడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ విచారణను గురువారానికి వాయిదా వేశారు. గురువారం వరకు కూల్చివేతల విషయంలో యథాతథ స్థితి పాటించాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనాలను ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నోటీసులు జారీచేశారు. వీటిని సవాలు చేస్తూ 9 జిల్లాల వైకాపా అధ్యక్షులు హైకోర్టులో అత్యవసర పిటిషన్లు వేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి, న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. ‘జాతీయ, గుర్తింపు పొందిన పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయించేందుకు 2016లో జీఓ జారీచేశారు. అసెంబ్లీలో 50%కు మించి సంఖ్యాబలం ఉన్న పార్టీకి జిల్లా ప్రధాన కేంద్రంలో రెండెకరాలు కేటాయించవచ్చు. స్థలం కేటాయించాక ఏడాదిలోపు కార్యాలయ నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తిచేయాలి. ప్లాన్ ఆమోదం కోసం చేసిన దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయి. నిర్మాణాలు జరపవచ్చని అధికారులు మౌఖికంగా తెలిపారు. అందుకే నిర్మాణాలు కొనసాగించాం. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక కూల్చేస్తున్నారు. కూల్చివేత అనేది చివరి అంశంగా ఉండాలి. ఏ క్షణానైనా కూలుస్తారని పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారు. స్టేటస్ కో ఉత్తర్వులు జారీచేయాలి’ అని కోరారు.
కూల్చే ఆలోచన ఉంటే నోటీసులు ఎందుకిస్తారు?
రాష్ట్రప్రభుత్వం తరఫున కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘అధికారులు చట్ట నిబంధనల ప్రకారం నడుచుకుంటారు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దు. భవనాలను కూల్చే ఉద్దేశం ఉంటే నోటీసులు ఇచ్చి వివరణ ఎందుకు కోరతారు? పిటిషనర్లది ఆందోళన మాత్రమే. వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాల విషయంలో అధికారులు ముందుకెళ్లకుండా పిటిషనర్లు కోర్టు నుంచి ఉత్తర్వులు పొందాలని అనుకుంటున్నారు. ఈ వ్యాజ్యాల్లో వివరాలు సమర్పించేందుకు స్వల్ప సమయం కావాలి’ అని కోరారు.
రాయచోటిలో వైకాపా కార్యాలయానికి నోటీసు
ఈనాడు, కడప: అన్నమయ్య జిల్లా రాయచోటిలో అనుమతులు లేకుండా.. ప్లాన్ అప్రూవల్ తీసుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మించిన వైకాపా కార్యాలయానికి అధికారులు నోటీసు జారీచేశారు. కడప పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) అధికారులు కొత్తగా నిర్మించిన భవనానికి బుధవారం నోటీసు అతికించారు. అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మిస్తున్నారని.. వారం రోజులలోపు సంజాయిషీ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా కడపలో నిర్మిస్తున్న కార్యాలయానికి గతంలోనే నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరం విధ్వంసం.. రూ.వేల కోట్ల నష్టం
జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
రివర్స్ టెండర్లలో ఆదా వట్టిదే
‘‘జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైంది. 2020 జులై నుంచి 2024 జూన్ వరకు ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్ పనులు ఏవీ చేయలేదు. -
భోగాపురంలో భూబకాసురులు
వైకాపా ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం అనేది ఆ పార్టీ నేతలు, వారితో అంటకాగే కొంతమంది అధికారులు హక్కుగా భావించిన పరిస్థితి. -
ఇంటింటా నైపుణ్య గణన
జనాభా లెక్కింపు మాదిరి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది. -
నిఘా విభాగం అధిపతిగా మహేష్చంద్ర లడ్హా!
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం అధిపతిగా మహేష్చంద్ర లడ్హా నియమితులు కానున్నారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఐజీగా కొనసాగుతున్నారు. -
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన గవర్నర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. -
కృష్ణపట్నం పోర్టులో కంటెయినర్ టెర్మినల్ పునరుద్ధరించాలి
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని కంటెయినర్ టెర్మినల్ను పునరుద్ధరించాలని, లేదంటే ప్రాణాలిచ్చేందుకూ వెనుకాడమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. -
కృష్ణపట్టిలో పెద్దపులి
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. -
వైకాపా వీర విధేయ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా
వైకాపాతో అంటకాగి, ఆ పార్టీకి వీరవిధేయుడిగా పేరొందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) ప్రసాదరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. -
వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా
‘‘కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకొని బియ్యం అక్రమ రవాణా చేశారు. ప్రభుత్వం రూ.39కి కిలో బియ్యం అందిస్తుంటే.. పేదల వద్ద రూ.7కి కొనుగోలు చేశారు. -
ఎన్టీఆర్ మోడల్ స్కూల్ను సందర్శించిన భువనేశ్వరి
నిరుపేద చిన్నారులకు అదో అక్షరాల గుడి.. తల్లిదండ్రుల్లేని వారిని అక్కున చేర్చుకున్న అమ్మ ఒడి..అదే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్. -
14 అడుగుల గిరినాగు పట్టివేత
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడలో 14 అడుగుల గిరినాగు (కింగ్ కోబ్రా) హల్చల్ చేసింది. అందరూ చూస్తుండగానే ఎస్సీ కాలనీలోని ఓ గుడిసెలోకి చొరబడింది. -
వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్పై వైకాపా పడగ
వైజాగ్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ (వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్)పై వైకాపా స్వారీ చేస్తోంది. కల్చరల్ సెంటర్కు సాధారణంగా ఒకటే కమిటీ ఉంటుంది. -
దారి కొట్టుకుపోయింది.. అవస్థలు మిగిలాయి..!
పక్కా రోడ్డు కోసం గిరిజనులు ఏళ్లుగా ఎదురుచూశారు. ప్రభుత్వం కనికరించి పనులు మొదలుపెట్టి.. మధ్యలోనే వదిలేసింది. ఇంకేం.. చేసిన కాస్త పనులూ వర్షాలకు కొట్టుకుపోయాయి. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. -
గత సర్కారు నిర్లక్ష్యం.. కొత్త ప్రభుత్వంపై చక్కదిద్దే భారం
గత ప్రభుత్వం పాఠశాలల్లో అసంపూర్తిగా వదిలేసిన మౌలికసదుపాయాల పనులను పూర్తి చేయడం కొత్త ప్రభుత్వానికి సవాల్గా మారనుంది. -
అరాచక అధికారులపై సర్కారు డేగకన్ను!
వైకాపా హయాంలో గత అయిదేళ్ల పాటు రాష్ట్రంలో కొనసాగిన దాష్టీకాలు, అరాచకాలు, అక్రమాలు, దాడులు, రాజకీయ హత్యలు, తప్పుడు కేసులకు బాధ్యులైన పోలీసు అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
గ్రామాలకు జగన్ ద్రోహం
గ్రామీణాభివృద్ధికి దోహదం చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలకు గత వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులివ్వకుండా భ్రష్టు పట్టించడమే కాదు.. కేంద్రం ఇతర పథకాల కింద ఇచ్చే నిధులూ ఉపయోగించుకోలేకపోయింది. -
తితిదేలో అక్రమాల చిట్టా సిద్ధం!
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదేళ్ల కాలంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు నడుం బిగించిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులు తమ పరిశీలనను ముగించారు. -
ఒక ముఖ్యమంత్రికి 986 మంది భద్రత కావాలా?
‘ఒక ముఖ్యమంత్రికి 986 మంది సిబ్బందితో భద్రత కావాలా? పరదాలు కట్టుకుని తిరగడం, చెట్లు కొట్టేయడం.. ఏమిటిది? నేరస్థులకు సెక్యూరిటీ కావాలని అంటున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయవ్య దిశగా పయనించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు