- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
రీ సర్వేపై రైతుల నుంచి అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయ్?
భూముల రీ సర్వే నిర్వహణ తీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ శాఖ అధికారులను ప్రశ్నించారు.
అధికారులను ప్రశ్నించిన మంత్రి అనగాని సత్యప్రసాద్
వినతుల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం
సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, సర్వే అధికారులతో సమావేశమైన మంత్రి అనగాని సత్యప్రసాద్
ఈనాడు, అమరావతి: భూముల రీ సర్వే నిర్వహణ తీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ శాఖ అధికారులను ప్రశ్నించారు. తనకు నిత్యం రీ సర్వేపై రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాదర్బార్ మాదిరిగానే భూ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి ప్రత్యేకంగా విజ్ఞప్తుల స్వీకరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో రీ సర్వే నిర్వహణ తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన సర్వేపై భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ జి.సాయిప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్, సర్వే శాఖ కమిషనర్ సిద్దార్థజైన్ మంత్రికి వివరించారు. ‘13,321 గ్రామాల్లో రీ సర్వే సందర్భంగా డ్రోన్ ఫ్లై (1.20 లక్షల చదరపు కిలో మీటర్లు) పూర్తయింది. 12,348 గ్రామాలకు చిత్రాలు పంపించాం. రైతుల ఆమోదంతో 7,110 గ్రామాల్లో సరిహద్దులు నిర్ణయించాం. 6,707 గ్రామాల్లో విస్తీర్ణం నిర్ధారణ చేశాం. 6,353 గ్రామాల్లో రీ సర్వే పూర్తయినట్లు నోటిఫికేషన్ ఇచ్చాం. 6,316 గ్రామాల్లో రికార్డుల్లో నమోదు ప్రక్రియ పూర్తయింది. సర్వే నంబర్ల స్థానంలో 81 లక్షల ల్యాండ్ పార్సిళ్లను జనరేట్ చేశాం. 8.64 లక్షల యజమానుల పేర్లను రికార్డుల్లో అప్డేట్ చేశాం. 86 వేల వివాదాలు పరిష్కరించాం. చివరిగా 22.48 లక్షల యజమానుల పేర్లను రికార్డుల్లో నమోదు చేశాం’ అని వివరించారు. అనంతరం మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. సర్వేయర్లు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే ఆన్లైన్లో వివరాలు నమోదు చేసినట్లు చెప్పారని, రీ సర్వే నిర్వహణ తీరుపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయని ప్రశ్నించారు. సర్వేకు తక్కువ సమయం కేటాయించడం వల్ల పలు ఇబ్బందులు వచ్చాయని అధికారులు వివరణ ఇచ్చారు.
సుమోటోగా కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తాం..
రాష్ట్రంలో అర్హత కలిగిన వారిలో ఇంకా 34 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోలేదని అధికారులు మంత్రికి వివరించారు. వీరందరికీ సులువుగా ఉండేలా సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని తెలిపారు. వీరి వివరాలను వీఆర్వోల లాగిన్కు పంపించామని చెప్పారు. సుమోటో కింద ఈ ధ్రువీకరణపత్రాలు జారీ చేస్తామని భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ తెలిపారు. తండ్రి కులధ్రువీకరణ ఆధారంగా ఈ పత్రాలు అందజేస్తామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
రాష్ట్రంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణను హైకోర్టు తప్పుపట్టింది. -
అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?
‘అరకొర సొమ్ము చేతిలో పెట్టి విడాకులు తీసుకుంటే.. రేప్పొద్దున్న భార్య, పిల్లలు ఎలా బతుకుతారు.. ఇదేం పరిష్కారం?’ అని గుంటూరు నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్బాబు విస్మయం వ్యక్తంచేశారు. -
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు!
పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగప్రవేశం చేశారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం దిల్లీ చేరుకున్నారు. -
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జులై 1వ తేదీ నుంచి కార్గో సేవలు పునఃప్రారంభం కానున్నాయి. కార్గో సర్వీసుకు 2021లో ముందడుగు పడినప్పటికీ కరోనా కారణంగా నిలిచిపోయాయి. -
జేఈఈ 8వ ర్యాంకర్కు రూ.1.60 కోట్ల పురస్కారం
విజయవాడ ఫిట్జి కళాశాల విద్యార్థి కోడూరు తేజేశ్వర్ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించినందుకు కళాశాల యాజమాన్యం రూ.1.60 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. -
అమరావతి పనులు పట్టాలెక్కించేందుకు సన్నాహాలు
ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు అవసరమైన సన్నాహాల్ని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చేస్తోంది. -
పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ కన్నుమూత
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్(76) కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యేకాలనీలోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. -
మాస్టారూ.. మీరే మీరే మాస్టారు!
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 39 ఏళ్లు వ్యాయామోపాధ్యాయునిగా పనిచేసిన తూము హన్మంతరావు చివరిగా సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. -
మీ భద్రత మా బాధ్యత
సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. -
స్టీల్ప్లాంటును జరిపేసి.. రాజధాని కట్టేద్దామన్నారు!
జగన్ లాంటి విపరీత, విధ్వంసకర ఆలోచనలు ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారని.. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఎదురైన అనుభవాలు మరోసారి రుజువు చేశాయి. -
దారి ఇస్తారా.. ఇక్కట్లు కొనసాగిస్తారా?
పదవి ఏదైనా ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం ఉపయోగించాలి. జగన్ మాత్రం అధికారం అండతో తన నివాసం పరిసరాల వారిని ఇబ్బందులకు గురిచేశారు. -
పదవి కాదు.. బాధ్యత
‘ఎంతో కీలకమైన పదవి ఇచ్చారు. ఇది ఉత్తరాంధ్రకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా. దీన్ని పదవిగా కాకుండా బాధ్యతగా నిర్వర్తిస్తా’ అని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. -
కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలుపైనే తొలి సంతకం: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సుభాష్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలు పైనే తొలి సంతకం చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. -
జీజీహెచ్ అభివృద్ధికి ఆర్థిక సహకారం: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో (జీజీహెచ్) మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందిస్తామని గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
లోక్ అదాలత్కు భారీ స్పందన 14,389 కేసుల పరిష్కారం
రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లకు భారీ స్పందన లభించింది. 14,389 పైగా కేసులు పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.49.36 కోట్ల పరిహారం అందజేశారు. -
నాగార్జున వర్సిటీ వీసీ రాజీనామా
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.రాజశేఖర్ ఎట్టకేలకు శనివారం రాజీనామా చేశారు. విషయం తెలుసుకున్న వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. -
తిరుమలలోని శారదా పీఠం భవనాలు సీజ్ చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మించిన భవనాలను సీజ్ చేయాలని శ్రీఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. -
ఇదీ సంగతి!
-
మా భవనాలపై దాడులు జరగకుండా నియంత్రించండి
వైకాపా కార్యాలయాల కోసం నిర్మిస్తున్న భవనాలపై దాడులు జరపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని గవర్నర్కు వైకాపా నేతలు విజ్ఞప్తి చేశారు. -
జోగి కుటుంబం కబ్జాపై డీజీపీకి నివేదిక
అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో మాజీ మంత్రి, వైకాపా నాయకుడు జోగి రమేష్ కుటుంబం పాత్రపై డీజీపీ కార్యాలయానికి ప్రాథమిక నివేదిక చేరింది. -
‘అనంతబాబుపై నమోదైన హత్య కేసును.. ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలి’
ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసును ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
-
నేనెప్పుడూ గణాంకాలు చూడను.. భారత్ గెలుపే ముఖ్యం: రోహిత్
-
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు
-
ఇదెంతో ప్రత్యేకం.. గత ఆరు నెలలు ఎలా ఉన్నాయో తెలుసు: హార్దిక్
-
టీమ్ఇండియా విజయం.. సినీ ప్రముఖుల ఆనందం.. ఎవరేమన్నారంటే?
-
తొలుత పెళ్లి.. తర్వాత అంత్యక్రియలు.. వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి