- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
గనులశాఖలో అన్నీ ఆన్లైన్ పర్మిట్లే
గనులశాఖలో ప్రక్షాళన మొదలైంది. గత ఐదేళ్లూ ఆన్లైన్ బిల్లు లేకుండా గుత్తేదారులు చేతిరాతతో రాసిచ్చి భారీగా అక్రమాలు చేయగా.. ఈ విధానానికి చెక్పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
మంత్రి ఆదేశాలతో ఆ దిశగా చర్యలు చేపట్టిన అధికారులు
సీనరేజి వసూళ్ల గుత్తేదారులూ ఆన్లైన్ పర్మిట్లు ఇవ్వాల్సిందే
ఇసుకకూ ఆన్లైన్ విధానం రూపకల్పన
ఈనాడు, అమరావతి: గనులశాఖలో ప్రక్షాళన మొదలైంది. గత ఐదేళ్లూ ఆన్లైన్ బిల్లు లేకుండా గుత్తేదారులు చేతిరాతతో రాసిచ్చి భారీగా అక్రమాలు చేయగా.. ఈ విధానానికి చెక్పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో అన్ని ఖనిజాలకూ ఆన్లైన్ పర్మిట్ల విధానం ఉండగా, ఇప్పుడూ దాన్నే అమలు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో.. ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గనులశాఖ కార్యదర్శి యువరాజ్, సంచాలకుడు ప్రవీణ్కుమార్.. అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏ ఖనిజానికీ ముద్రిత బిల్లు ఉండకూడదని ఆదేశించారు. దీంతో దీనిపై కసరత్తు మొదలైంది.
సీనరేజి గుత్తేదారులు అమలుచేయాల్సిందే
రాష్ట్రంలో ఏడు ఉమ్మడి జిల్లాల్లో సీనరేజి వసూళ్ల గుత్తేదారులు.. లీజుదారులకు చేతిరాతతో బిల్లులు జారీచేస్తున్నారు. ప్రభుత్వం ఈ విధానంపై త్వరలో సమీక్ష జరపనుంది. ఈ విధానం కొనసాగించాలని భావిస్తే ఆన్లైన్ పర్మిట్లే ఇవ్వాలని భావిస్తున్నారు. దీనికోసం గతంలోనే సిద్ధంచేసిన సాఫ్ట్వేర్ను మళ్లీ తీసుకొస్తున్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రమంతటా పర్మిట్ల జారీ నిలిపేశారు. రెండు, మూడు రోజుల్లో మళ్లీ పర్మిట్ల జారీపై నిర్ణయం తీసుకోనున్నట్లు గనులశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇసుకకూ చేతిరాత బిల్లులుండవ్
ఇసుకలోనూ ఆన్లైన్ వేబిల్లుల జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 2019 నుంచి 2021 మే వరకు ఏపీఎండీసీ ద్వారా ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఇసుక వ్యాపారం జరగ్గా, తర్వాత ఇసుక గుత్తేదారుగా జేపీ సంస్థ వచ్చాక.. చేతిరాత బిల్లులతో నిలువు దోపిడీ చేశారు. ఒకే సీరియల్ నంబర్లతో అనేక వేబిల్లులు ముద్రించుకొని, వాటితో ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి, భారీగా దోచుకున్నారు. గనులశాఖ లెక్కల ప్రకారం స్టాక్పాయింట్లలో 43 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంది. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలన్నా, మరే విధంగా విక్రయించాలన్నా ఆన్లైన్ పర్మిట్లు ఇచ్చేలా అధికారులు సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్నారు.
ఏపీఎండీసీ లెక్కలు తీయిస్తున్న ఎండీ
ఏపీఎండీసీలో గత ఐదేళ్లలో ఏమి జరిగిందో నివేదిక ఇవ్వాలని అన్ని విభాగాల అధికారులను ఇన్ఛార్జి ఎండీ ప్రవీణ్కుమార్ ఆదేశించారు. తొలుత ఏపీఎండీసీ ఇసుక వ్యాపారం చేసినప్పుడు ఏం జరిగింది? ఇంకా సంస్థకు ఎంత సొమ్ము రావాల్సి ఉంది? సర్వే రాళ్ల సరఫరా వివరాలు, అన్ని విభాగాల్లో ఎంతమంది పొరుగుసేవలు, కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారు? తదితర వివరాలను గురువారానికి ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఏపీఎండీసీ అధికారులు నివేదికలు తయారుచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
రాష్ట్రంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణను హైకోర్టు తప్పుపట్టింది. -
అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?
‘అరకొర సొమ్ము చేతిలో పెట్టి విడాకులు తీసుకుంటే.. రేప్పొద్దున్న భార్య, పిల్లలు ఎలా బతుకుతారు.. ఇదేం పరిష్కారం?’ అని గుంటూరు నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్బాబు విస్మయం వ్యక్తంచేశారు. -
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు!
పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగప్రవేశం చేశారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం దిల్లీ చేరుకున్నారు. -
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జులై 1వ తేదీ నుంచి కార్గో సేవలు పునఃప్రారంభం కానున్నాయి. కార్గో సర్వీసుకు 2021లో ముందడుగు పడినప్పటికీ కరోనా కారణంగా నిలిచిపోయాయి. -
జేఈఈ 8వ ర్యాంకర్కు రూ.1.60 కోట్ల పురస్కారం
విజయవాడ ఫిట్జి కళాశాల విద్యార్థి కోడూరు తేజేశ్వర్ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించినందుకు కళాశాల యాజమాన్యం రూ.1.60 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. -
అమరావతి పనులు పట్టాలెక్కించేందుకు సన్నాహాలు
ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు అవసరమైన సన్నాహాల్ని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చేస్తోంది. -
పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ కన్నుమూత
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్(76) కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యేకాలనీలోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. -
మాస్టారూ.. మీరే మీరే మాస్టారు!
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 39 ఏళ్లు వ్యాయామోపాధ్యాయునిగా పనిచేసిన తూము హన్మంతరావు చివరిగా సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. -
మీ భద్రత మా బాధ్యత
సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. -
స్టీల్ప్లాంటును జరిపేసి.. రాజధాని కట్టేద్దామన్నారు!
జగన్ లాంటి విపరీత, విధ్వంసకర ఆలోచనలు ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారని.. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఎదురైన అనుభవాలు మరోసారి రుజువు చేశాయి. -
దారి ఇస్తారా.. ఇక్కట్లు కొనసాగిస్తారా?
పదవి ఏదైనా ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం ఉపయోగించాలి. జగన్ మాత్రం అధికారం అండతో తన నివాసం పరిసరాల వారిని ఇబ్బందులకు గురిచేశారు. -
పదవి కాదు.. బాధ్యత
‘ఎంతో కీలకమైన పదవి ఇచ్చారు. ఇది ఉత్తరాంధ్రకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా. దీన్ని పదవిగా కాకుండా బాధ్యతగా నిర్వర్తిస్తా’ అని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. -
కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలుపైనే తొలి సంతకం: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సుభాష్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలు పైనే తొలి సంతకం చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. -
జీజీహెచ్ అభివృద్ధికి ఆర్థిక సహకారం: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో (జీజీహెచ్) మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందిస్తామని గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
లోక్ అదాలత్కు భారీ స్పందన 14,389 కేసుల పరిష్కారం
రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లకు భారీ స్పందన లభించింది. 14,389 పైగా కేసులు పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.49.36 కోట్ల పరిహారం అందజేశారు. -
నాగార్జున వర్సిటీ వీసీ రాజీనామా
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.రాజశేఖర్ ఎట్టకేలకు శనివారం రాజీనామా చేశారు. విషయం తెలుసుకున్న వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. -
తిరుమలలోని శారదా పీఠం భవనాలు సీజ్ చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మించిన భవనాలను సీజ్ చేయాలని శ్రీఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. -
ఇదీ సంగతి!
-
మా భవనాలపై దాడులు జరగకుండా నియంత్రించండి
వైకాపా కార్యాలయాల కోసం నిర్మిస్తున్న భవనాలపై దాడులు జరపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని గవర్నర్కు వైకాపా నేతలు విజ్ఞప్తి చేశారు. -
జోగి కుటుంబం కబ్జాపై డీజీపీకి నివేదిక
అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో మాజీ మంత్రి, వైకాపా నాయకుడు జోగి రమేష్ కుటుంబం పాత్రపై డీజీపీ కార్యాలయానికి ప్రాథమిక నివేదిక చేరింది. -
‘అనంతబాబుపై నమోదైన హత్య కేసును.. ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలి’
ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసును ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎవరిని అడగాలి? తిరిగిరాని ధరణి స్లాట్ రద్దు సొమ్ములు
-
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
-
ఇంకా పోని వైకాపా వాసనలు.. కుర్చీ వదలని ఉపకులపతి..!
-
విశ్వవిజేత.. భారత్కు దక్కిన ప్రైజ్మనీ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం.. సీఎం రేవంత్ చొరవతో అంగీకరించిన కేంద్రం