- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
జల సంరక్షణ పనుల్లో రూ.427 కోట్ల బకాయిలు
జగన్ ప్రభుత్వం చిన్ననీటి వనరులను నిర్లక్ష్యం చేసింది. అంతకుముందు తెదేపా ప్రభుత్వంలో ‘నీరు-చెటు’్ట పేరుతో జలసంరక్షణ పనులు చేసినా ఆ బిల్లులూ చెల్లించకుండా రైతు సంఘాలను, గుత్తేదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.
జగన్ ప్రభుత్వంలో చిన్ననీటి వనరులపై ఎనలేని నిర్లక్ష్యం
చేసిన పనులకు బిల్లులూ చెల్లించలేదు
ఈనాడు, అమరావతి: జగన్ ప్రభుత్వం చిన్ననీటి వనరులను నిర్లక్ష్యం చేసింది. అంతకుముందు తెదేపా ప్రభుత్వంలో ‘నీరు-చెటు’్ట పేరుతో జలసంరక్షణ పనులు చేసినా ఆ బిల్లులూ చెల్లించకుండా రైతు సంఘాలను, గుత్తేదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. రైతు సంఘాల సమాఖ్య, మరికొన్ని సంఘాలు కలిసి ఈ బిల్లుల కోసం న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసులు కూడా వేయాల్సివచ్చింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘నీరు-చెటు’్ట బిల్లులు ఏమేరకు పెండింగ్లో ఉన్నాయని పరిశీలిస్తే.. ఇంకా రూ.427 కోట్లు చెల్లించాల్సి ఉందని తేలింది. అప్పట్లో చంద్రబాబు ఆదేశంతో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి నీరు-చెట్టు బకాయిల వివరాలు సేకరించి న్యాయస్థానాల్లో పోరాటం చేశారు. వైకాపా ప్రభుత్వం విజిలెన్సు విచారణల పేరుతో, పనులు నాణ్యంగా చేయలేదంటూ ఈ బిల్లుల చెల్లింపునకు అవరోధాలు కల్పించినా తగిన సమాచారంతో రైతు సంఘాలు పోరాటం చేస్తూ వచ్చాయి. ప్రస్తుతం పెండింగులో ఉన్న రూ.427 కోట్ల బకాయిలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణతో కూడిన నాయకుల బృందం జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని బుధవారం కలిసి విన్నవించింది.
నాడు ఉద్ధృతంగా జలసంరక్షణ పనులు
2014-19 మధ్య రాష్ట్రంలో జలసంరక్షణ పనులు ఉద్ధృతంగా జరిగాయి. చిన్ననీటి వనరుల ద్వారా అనేక కరవు ప్రాంతాల్లో సాగు, తాగు నీరు ఇవ్వవచ్చనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వంలో పనులు చేశారు.
పెద్ద ఎత్తున చెరువులు పూడిక తీయించారు. చెరువులు కళకళలాడితే భూగర్భజలాలు నిండుగా ఉండి సాగుకు ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో పనులను పరుగులు పెట్టించారు.
- తెదేపా హయాంలో కట్టడాల మరమ్మతులు, గేట్ల మరమ్మతులు తదితర పనులు ‘నీరు-చెట్టు’ కింద చేశారు రాష్ట్రంలో అప్పటి 13 ఉమ్మడి జిల్లాల్లో ఇలాంటి పనులు 10,623 చేపట్టారు. ఇందుకోసం రూ.644.27 కోట్లు ఖర్చు చేశారు.
- చెరువుల్లో పూడికతీత పనులను అన్ని జిల్లాల్లోనూ చేశారు. మొత్తం 8,708 పనులు చేయగా రూ.530.58 కోట్లు వెచ్చించారు.
- ఇతర నీటి సంరక్షణ పనులకు రూ.532.55 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం అన్ని కలిపి రూ.1,707 కోట్లు ఖర్చు చేసినా పెండింగు బిల్లులు అనేకం జగన్ ప్రభుత్వం చెల్లించలేదు. పైగా విజిలెన్సు విచారణ, ఇతర అంశాల పేరుతో అధికారులను, ఇతరులను కూడా ఇబ్బంది పెట్టారు. విజిలెన్సు విచారణలో తేలిన అక్రమాలపై చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టకపోయినా...ఆ పేరుతో అన్ని పనులకూ బిల్లులు నిలిపివేయడమే సమస్యగా మారింది.
న్యాయస్థానాల్లో పోరు...
బిల్లుల చెల్లింపు కోసం న్యాయస్థానంలో పోరాటం చేశారు. మొత్తం 9,391 కేసులు దాఖలయ్యాయి. ఇందులో రిట్ పిటిషన్లు ఉన్నాయి. ఆ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు వెలువడినవీ ఉన్నాయి. కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఈ న్యాయ పోరాటం ఫలితంగా ఇంతవరకు రూ.999 కోట్ల వరకు చెల్లించినా ఇంకా రూ.427 కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు తేల్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
రాష్ట్రంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణను హైకోర్టు తప్పుపట్టింది. -
అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?
‘అరకొర సొమ్ము చేతిలో పెట్టి విడాకులు తీసుకుంటే.. రేప్పొద్దున్న భార్య, పిల్లలు ఎలా బతుకుతారు.. ఇదేం పరిష్కారం?’ అని గుంటూరు నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్బాబు విస్మయం వ్యక్తంచేశారు. -
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు!
పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగప్రవేశం చేశారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం దిల్లీ చేరుకున్నారు. -
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జులై 1వ తేదీ నుంచి కార్గో సేవలు పునఃప్రారంభం కానున్నాయి. కార్గో సర్వీసుకు 2021లో ముందడుగు పడినప్పటికీ కరోనా కారణంగా నిలిచిపోయాయి. -
జేఈఈ 8వ ర్యాంకర్కు రూ.1.60 కోట్ల పురస్కారం
విజయవాడ ఫిట్జి కళాశాల విద్యార్థి కోడూరు తేజేశ్వర్ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించినందుకు కళాశాల యాజమాన్యం రూ.1.60 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. -
అమరావతి పనులు పట్టాలెక్కించేందుకు సన్నాహాలు
ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు అవసరమైన సన్నాహాల్ని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చేస్తోంది. -
పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ కన్నుమూత
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్(76) కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యేకాలనీలోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. -
మాస్టారూ.. మీరే మీరే మాస్టారు!
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 39 ఏళ్లు వ్యాయామోపాధ్యాయునిగా పనిచేసిన తూము హన్మంతరావు చివరిగా సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. -
మీ భద్రత మా బాధ్యత
సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. -
స్టీల్ప్లాంటును జరిపేసి.. రాజధాని కట్టేద్దామన్నారు!
జగన్ లాంటి విపరీత, విధ్వంసకర ఆలోచనలు ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారని.. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఎదురైన అనుభవాలు మరోసారి రుజువు చేశాయి. -
దారి ఇస్తారా.. ఇక్కట్లు కొనసాగిస్తారా?
పదవి ఏదైనా ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం ఉపయోగించాలి. జగన్ మాత్రం అధికారం అండతో తన నివాసం పరిసరాల వారిని ఇబ్బందులకు గురిచేశారు. -
పదవి కాదు.. బాధ్యత
‘ఎంతో కీలకమైన పదవి ఇచ్చారు. ఇది ఉత్తరాంధ్రకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా. దీన్ని పదవిగా కాకుండా బాధ్యతగా నిర్వర్తిస్తా’ అని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. -
కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలుపైనే తొలి సంతకం: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సుభాష్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలు పైనే తొలి సంతకం చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. -
జీజీహెచ్ అభివృద్ధికి ఆర్థిక సహకారం: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో (జీజీహెచ్) మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందిస్తామని గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
లోక్ అదాలత్కు భారీ స్పందన 14,389 కేసుల పరిష్కారం
రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లకు భారీ స్పందన లభించింది. 14,389 పైగా కేసులు పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.49.36 కోట్ల పరిహారం అందజేశారు. -
నాగార్జున వర్సిటీ వీసీ రాజీనామా
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.రాజశేఖర్ ఎట్టకేలకు శనివారం రాజీనామా చేశారు. విషయం తెలుసుకున్న వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. -
తిరుమలలోని శారదా పీఠం భవనాలు సీజ్ చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మించిన భవనాలను సీజ్ చేయాలని శ్రీఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. -
ఇదీ సంగతి!
-
మా భవనాలపై దాడులు జరగకుండా నియంత్రించండి
వైకాపా కార్యాలయాల కోసం నిర్మిస్తున్న భవనాలపై దాడులు జరపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని గవర్నర్కు వైకాపా నేతలు విజ్ఞప్తి చేశారు. -
జోగి కుటుంబం కబ్జాపై డీజీపీకి నివేదిక
అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో మాజీ మంత్రి, వైకాపా నాయకుడు జోగి రమేష్ కుటుంబం పాత్రపై డీజీపీ కార్యాలయానికి ప్రాథమిక నివేదిక చేరింది. -
‘అనంతబాబుపై నమోదైన హత్య కేసును.. ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలి’
ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసును ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
-
అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?
-
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు!
-
నా హార్ట్రేట్ పెరిగిపోయింది.. బర్త్డే గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్: ఎంఎస్ ధోనీ
-
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం
-
‘సుకన్య సమృద్ధి’కి ట్రైనీ అఖిల భారత సర్వీసు అధికారుల చొరవ.. 100 మంది పేరిట ఖాతాలు