- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
మన నడవడిక మన్ననలు పొందాలి
‘మనపై ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఉన్నారు. అభ్యర్థులందరినీ శాసనసభకు పంపించారు. వారి నమ్మకాన్ని సభలో ప్రతిఫలింపజేద్దాం’ అని జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.
సభలో ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపచేద్దాం
ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఈనాడు డిజిటల్, అమరావతి: ‘మనపై ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఉన్నారు. అభ్యర్థులందరినీ శాసనసభకు పంపించారు. వారి నమ్మకాన్ని సభలో ప్రతిఫలింపజేద్దాం’ అని జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ‘జనసేన నుంచి గెలిచిన వారిలో ఎక్కువ మంది సభకు కొత్తవారే. అందరం సభ నియమావళి, సంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలి’ అని సూచించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సభా వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ‘మనమంతా తొలి వంద రోజులకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. వాటిపై అధ్యయనం చేయాలి. ప్రభుత్వ శాఖలు, పాలనాపరమైన విధివిధానాలు, నిబంధనలు, పథకాలు, వాటి అమలు తీరుతో పాటు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా.. లేదా అనే విషయాలపై దృష్టి పెట్టాలి. ఆ తర్వాత మీరు చేసే చర్చలు ఎంతో బలంగా ఉంటాయి’ అని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
సమస్యల పరిష్కారానికి ‘జనవాణి’
ఎమ్మెల్యేలందరూ తమతమ నియోజకవర్గాల్లో ‘జనవాణి’ కార్యక్రమం చేపట్టాలని పవన్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ కట్టుబడి ఉండాలని, ప్రజాసంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమంగా సాగాలని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే అవసరం ఉందని అన్నారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
పరుష పదజాలం వాడొద్దు
భాష సరళంగా, మర్యాదపూర్వకంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ‘అధికారులతో మాట్లాడేటప్పుడే కాకుండా చర్చల్లో కూడా పరుష పదజాలం వాడొద్దు. ప్రజలతో గౌరవంగా ఉండాలి. వారు సమస్యలు చెబితే జాగ్రత్తగా వినాలి’ అని తెలిపారు. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు అభినందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని పవన్ తెలిపారు.
అధ్యయనం చేయాలి: మంత్రి నాదెండ్ల మనోహర్
‘బడ్జెట్ సమావేశాలు త్వరలో మొదలవుతాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఈ సమావేశాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సభలో ప్రశ్నలు లేవనెత్తడానికి, చర్చల్లో పాల్గొనడానికి తగిన అధ్యయనం చేయాలి. నియోజకవర్గ అంశాలను ప్రస్తావించడంతో పాటు వాటిని రాష్ట్ర స్థాయి కోణంలో కూడా చర్చించాలి’ అని సూచించారు.
దేశం మెచ్చేలా పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దుదాం
ఈనాడు, అమరావతి: దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఉద్యోగులు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్కల్యాణ్ కోరారు. ఎంతో ఇష్టంతో కీలకమైన ఈ శాఖను తీసుకున్నానని, ఇందులో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అహర్నిశలూ కృషి చేస్తానని, ఉద్యోగులూ తగిన సూచనలు అందించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం తనను కలిసేందుకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖలోని ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర ప్రతినిధుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నాక వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ దెబ్బ తీసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా గ్రామాభివృద్ధిని ఎంతో నిర్లక్ష్యం చేసింది. జలజీవన్ మిషన్ పథకాన్ని సరిగా అమలు చేసి ఉంటే వాటి ఫలాలు గ్రామీణ ప్రజలకు అందేవి. కేంద్రం నుంచి ఇంకా రూ.1,600 కోట్లు రావలసి ఉంది. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం. వారిని నేను ప్రత్యేకంగా గౌరవిస్తాను. నేనూ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడినే’ అని పవన్కల్యాణ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరం విధ్వంసం.. రూ.వేల కోట్ల నష్టం
జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
రివర్స్ టెండర్లలో ఆదా వట్టిదే
‘‘జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైంది. 2020 జులై నుంచి 2024 జూన్ వరకు ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్ పనులు ఏవీ చేయలేదు. -
భోగాపురంలో భూబకాసురులు
వైకాపా ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం అనేది ఆ పార్టీ నేతలు, వారితో అంటకాగే కొంతమంది అధికారులు హక్కుగా భావించిన పరిస్థితి. -
ఇంటింటా నైపుణ్య గణన
జనాభా లెక్కింపు మాదిరి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది. -
నిఘా విభాగం అధిపతిగా మహేష్చంద్ర లడ్హా!
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం అధిపతిగా మహేష్చంద్ర లడ్హా నియమితులు కానున్నారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఐజీగా కొనసాగుతున్నారు. -
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన గవర్నర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. -
కృష్ణపట్నం పోర్టులో కంటెయినర్ టెర్మినల్ పునరుద్ధరించాలి
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని కంటెయినర్ టెర్మినల్ను పునరుద్ధరించాలని, లేదంటే ప్రాణాలిచ్చేందుకూ వెనుకాడమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. -
కృష్ణపట్టిలో పెద్దపులి
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. -
వైకాపా వీర విధేయ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా
వైకాపాతో అంటకాగి, ఆ పార్టీకి వీరవిధేయుడిగా పేరొందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) ప్రసాదరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. -
వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా
‘‘కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకొని బియ్యం అక్రమ రవాణా చేశారు. ప్రభుత్వం రూ.39కి కిలో బియ్యం అందిస్తుంటే.. పేదల వద్ద రూ.7కి కొనుగోలు చేశారు. -
ఎన్టీఆర్ మోడల్ స్కూల్ను సందర్శించిన భువనేశ్వరి
నిరుపేద చిన్నారులకు అదో అక్షరాల గుడి.. తల్లిదండ్రుల్లేని వారిని అక్కున చేర్చుకున్న అమ్మ ఒడి..అదే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్. -
14 అడుగుల గిరినాగు పట్టివేత
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడలో 14 అడుగుల గిరినాగు (కింగ్ కోబ్రా) హల్చల్ చేసింది. అందరూ చూస్తుండగానే ఎస్సీ కాలనీలోని ఓ గుడిసెలోకి చొరబడింది. -
వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్పై వైకాపా పడగ
వైజాగ్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ (వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్)పై వైకాపా స్వారీ చేస్తోంది. కల్చరల్ సెంటర్కు సాధారణంగా ఒకటే కమిటీ ఉంటుంది. -
దారి కొట్టుకుపోయింది.. అవస్థలు మిగిలాయి..!
పక్కా రోడ్డు కోసం గిరిజనులు ఏళ్లుగా ఎదురుచూశారు. ప్రభుత్వం కనికరించి పనులు మొదలుపెట్టి.. మధ్యలోనే వదిలేసింది. ఇంకేం.. చేసిన కాస్త పనులూ వర్షాలకు కొట్టుకుపోయాయి. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. -
గత సర్కారు నిర్లక్ష్యం.. కొత్త ప్రభుత్వంపై చక్కదిద్దే భారం
గత ప్రభుత్వం పాఠశాలల్లో అసంపూర్తిగా వదిలేసిన మౌలికసదుపాయాల పనులను పూర్తి చేయడం కొత్త ప్రభుత్వానికి సవాల్గా మారనుంది. -
అరాచక అధికారులపై సర్కారు డేగకన్ను!
వైకాపా హయాంలో గత అయిదేళ్ల పాటు రాష్ట్రంలో కొనసాగిన దాష్టీకాలు, అరాచకాలు, అక్రమాలు, దాడులు, రాజకీయ హత్యలు, తప్పుడు కేసులకు బాధ్యులైన పోలీసు అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
గ్రామాలకు జగన్ ద్రోహం
గ్రామీణాభివృద్ధికి దోహదం చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలకు గత వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులివ్వకుండా భ్రష్టు పట్టించడమే కాదు.. కేంద్రం ఇతర పథకాల కింద ఇచ్చే నిధులూ ఉపయోగించుకోలేకపోయింది. -
తితిదేలో అక్రమాల చిట్టా సిద్ధం!
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదేళ్ల కాలంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు నడుం బిగించిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులు తమ పరిశీలనను ముగించారు. -
ఒక ముఖ్యమంత్రికి 986 మంది భద్రత కావాలా?
‘ఒక ముఖ్యమంత్రికి 986 మంది సిబ్బందితో భద్రత కావాలా? పరదాలు కట్టుకుని తిరగడం, చెట్లు కొట్టేయడం.. ఏమిటిది? నేరస్థులకు సెక్యూరిటీ కావాలని అంటున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయవ్య దిశగా పయనించనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పంచశీల ఒప్పందం భేష్.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
-
ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్ హాసన్
-
అవును నేను వృద్ధుడినే.. కానీ: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?
-
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు