- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Andhra News: ‘వేలిముద్రలు’ చెరిపేసిన నేరం జగన్దే!
గత వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర పోలీసు శాఖ 10 లక్షల మందికి పైగా నేరగాళ్ల వేలిముద్రలను నిక్షిప్తపరిచిన అధునాతన సర్వర్లు కాలిపోయాయి.
నేర నిర్ధారణ సాంకేతిక వ్యవస్థ నిర్వహణ గాలికి
రూ.2 కోట్లూ విదల్చని వైకాపా సర్కారు
కాలిపోయిన సర్వర్లు, యూపీఎస్లు
10 లక్షల మంది నేరగాళ్ల వేలిముద్రల డేటా గల్లంతు
తెదేపా ప్రభుత్వంపై కసితో వ్యవస్థపై కక్ష
నిధులడిగితే, నాటి డీజీపీ రాజేంద్రనాథరెడ్డి హేళన
ఈనాడు, అమరావతి: గత వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర పోలీసు శాఖ 10 లక్షల మందికి పైగా నేరగాళ్ల వేలిముద్రలను నిక్షిప్తపరిచిన అధునాతన సర్వర్లు కాలిపోయాయి. వాటి యూపీఎస్లు పేలిపోయాయి. నేరగాళ్లు, అనుమానితుల గుర్తింపు, నేర పరిశోధన, ఛేదన కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక ఏఎఫ్పీఐఎస్ (ఆటోమేటెడ్ ఫింగర్ అండ్ పామ్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్) వార్షిక నిర్వహణకు కేవలం రూ.2 కోట్ల నిధులు ఇవ్వని కారణంగా ఏడాదిన్నరగా ఆ వ్యవస్థంతా కుప్పకూలిపోయింది. దీంతో నేరఘటనా స్థలంలో లభించిన వేలిముద్రలను పాత నేరగాళ్ల వేలిముద్రలతో సరిపోల్చేందుకు పోలీసులకు అవకాశం లేకుండా పోయింది. కొత్తగా సేకరించిన వేలిముద్రలను కూడా డేటాబేస్లో నిక్షిప్తం చేసే వీల్లేకుండా పోయింది. వెరసి.. అనుమానితులు, తప్పించుకు తిరుగుతున్న నేరగాళ్లను పట్టుకునే మార్గాల్లో ఒకటి మూసుకుపోయినట్లైంది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారన్న ఏకైక కారణంతో కక్షగట్టి మరీ ఏఎఫ్పీఐఎస్ను జగన్ సర్కారు దెబ్బతీసింది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక వైకాపా హయాంలో జరిగిన ఇలాంటి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
వ్యవస్థపై రాజేంద్రనాథరెడ్డి వెటకారాలు
తెదేపా ప్రభుత్వ హయాంలో 2017లో ఏపీసీఐడీలోని వేలిముద్రల విభాగంలో ఏఎఫ్పీఐఎస్ను ఏర్పాటు చేశారు. పాపిలోన్ అనే రష్యా సంస్థ నుంచి రూ.10 కోట్లు వెచ్చించి ఈ అధునాతన సాంకేతిక వ్యవస్థను సమకూర్చుకున్నారు. ఏపీ పోలీసు డేటా సెంటర్లోని సర్వర్లలో 10 లక్షల మందికిపైగా పాత నేరగాళ్ల వేలిముద్రలను నిక్షిప్తపరిచారు. 2017 నుంచి 2022 వరకూ ఐదేళ్ల పాటు ఈ వ్యవస్థ వార్షిక నిర్వహణ చేపట్టేలా తెదేపా హయాంలోనే ఒప్పందం కుదరడంతో సంబంధిత సంస్థ వైకాపా అధికారంలోకి వచ్చాక కూడా మూడేళ్ల పాటు పర్యవేక్షించింది. 2022లో నాటి డీజీపీ రాజేంద్రనాథరెడ్డి ఏఎఫ్పీఐఎస్కు వార్షిక నిర్వహణ నిధుల చెల్లింపును నిలిపేశారు. నేరగాళ్ల గుర్తింపులో ఇది కీలకమని పోలీసు అధికారులు చెప్పినా లెక్కచేయలేదు. ‘ఈ వ్యవస్థ లేకముందు పోలీసింగ్ లేదా? గతంలో నేరగాళ్లను పట్టుకోలేదా? ఈ వ్యవస్థ ఉంటేనే పోలీసు శాఖ పనిచేస్తుందా?’ అంటూ వెటకారమాడినట్లు సమాచారం. నిర్వహణ లేక గతేడాది ఏప్రిల్లో ఏఎఫ్పీఐఎస్ సర్వర్లు కాలిపోయాయి. యూపీఎస్లు పేలిపోయాయి. మొత్తంగా ఆ వ్యవస్థే దెబ్బతింది.
నేరగాళ్ల గుర్తింపు ప్రశ్నార్థకం!
ఏఎఫ్పీఐఎస్ ద్వారా నేరగాళ్లు, అనుమానితులను గుర్తించడానికి నాటి తెదేపా ప్రభుత్వం 580 పోలీసు స్టేషన్లకు మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ (ఎంఎస్సీడీ)లను అందించింది. పోలీసులు గస్తీ తిరుగుతున్నప్పుడు, తనిఖీలు చేస్తున్నప్పుడు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వారి వేలిముద్రలు, హస్తముద్రలను ఎంఎస్సీడీలో తీసుకుంటే, వాటిని ఆ పరికరం ఏఎఫ్పీఐఎస్ డేటాబేస్లో నిక్షిప్తమై ఉన్న లక్షల మంది నేరగాళ్ల వేలి, హస్త ముద్రలతో సరిపోల్చేది. వాటితో సరిపోలితే అతని పేరు, చిరునామా, పాత కేసులు, జైలు జీవితం, శిక్షలు తదితర వివరాలన్నీ నిమిషాల్లో ప్రత్యక్షమయ్యేవి. దీంతో పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకునేవారు. అమాయకులైతే వదిలేసేవారు. సర్వర్లు కాలిపోవటంతో ఏడాదిన్నరగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఎంఎస్సీడీలన్నీ నిరుపయోగమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఠాణాలకు ఎంఎస్సీడీలను సమకూర్చేందుకు, వేలిముద్రల సాంకేతిక విధానాన్ని మెరుగుపరిచేందుకు పోలీసు బలగాల ఆధునికీకరణ (ఎంవోపీఎఫ్) కింద కేంద్రం రూ.7 కోట్ల నిధులు కేటాయించినా, రాష్ట్ర ప్రభుత్వం తన మ్యాచింగ్ గ్రాంట్ రూ.5 కోట్లు ఇవ్వలేదు. దీంతో కేంద్రం నిధులు రాకుండాపోయాయి.
- నేర ఘటనా స్థలంలో వేలి, హస్తముద్రలు సేకరించి సర్వర్లో నిక్షిప్తం చేసేందుకు 98 పోలీసు సబ్ డివిజన్లలో లైవ్ స్కానర్లను తెదేపా హయాంలో ఏర్పాటు చేశారు. ఈ వేలి, హస్తముద్రలను ఏఎఫ్పీఐఎస్ డేటాబేస్లోని సమాచారంతో సరిపోల్చి నేరగాళ్లను గుర్తించేందుకు జిల్లా కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు పెట్టారు. ఇప్పుడవీ నిరుపయోగంగా మారాయి.
- గతంలో ఈ వ్యవస్థను ఉపయోగించుకుని క్లిష్టమైన కేసుల్ని ఛేదించారు. పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టుకున్నారు. జనం గుమికూడిన ప్రాంతాల్లో అనుమానితుల్ని పసిగట్టేందుకు, దొంగతనం కేసుల్లో రికవరీలకు, అనాథ మృతదేహాలను గుర్తించేందుకు అవకాశమున్న ఈ కీలక వ్యవస్థను జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
మీరేదైనా వాహనం కొంటే స్టిక్కరింగ్కు ఎంతవుతుంది? మహా అయితే రూ.2 వేల నుంచి రూ.5 వేలు. కానీ, వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశువైద్య సేవా వాహనాలకు రంగులు, జగన్ బొమ్మలు వేయించడానికి రూ.2.50 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా. -
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పురోగతి, తర్వాత వైకాపా ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని వివరించారు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సు తొలగింపు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సును కళాశాల విద్యాశాఖ మూసివేసింది. బీకాం కంప్యూటర్స్ ఒక్కటే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. -
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
ఒంగోలు సత్యనారాయణపురంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. పిల్లర్ల దశలో ఉన్న భవనంలోనే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. నాడు-నేడు రెండో దశలో భాగంగా కొత్త భవనం నిర్మిస్తామని 2022లో పాత భవనాన్ని గత వైకాపా ప్రభుత్వం కూలగొట్టింది. -
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. -
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి చేయనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. -
అమరావతిని బంగారం చేస్తాం
అమరావతిపై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్ ప్రభుత్వం.. రాజధాని బ్రాండ్ ఇమేజ్ను సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన జరిగి పదేళ్లయినా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు
కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ- అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణ
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. -
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికే నిర్ణయం
పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్ కుష్విందర్ ఓహ్రా స్పష్టం చేశారు. -
అందరికీ ఉచిత ఇసుక
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు శ్రీకారం చుడుతోంది. సీఎం చంద్రబాబు బుధవారం దిశానిర్దేశం చేయడంతో ఆ శాఖ అధికారులు ఈ విధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కల్కి సినిమా టికెట్ ధర పెంపుపై హైకోర్టులో పిల్
కల్కి సినిమా టికెట్ల ధరను మొదటి 14 రోజులు పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్) బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. -
మహిళా కార్యదర్శులకు పోలీసు బాధ్యతలు.. ప్రభుత్వ నిర్ణయంలో ఏదైనా పురోగతి ఉంటే చెప్పండి
గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ, చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. -
హైకోర్టులో జీపీ, ఏజీపీల నియామకం
రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు ఆరుగురు ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), 14 మంది సహాయ ప్రభుత్వ న్యాయవాదులు (ఏజీపీ) నియమితులయ్యారు. -
ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ఉన్నత విద్యామండలి
ఉన్నత విద్యా మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అమలు కావడం లేదు. వైకాపా ప్రభుత్వంలో నియమించిన వారే పని చేస్తుండడంతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. -
వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్మన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం బుధవారం కడప రిమ్స్కు తరలించారు. -
జప్తు చేసిన రూ.20 కోట్ల సామగ్రి మాయం!
వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. సెక్యూరిటీ గార్డు కాపలా ఉంటున్నారు.. కానీ లోపల యంత్రసామగ్రి మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. కనీసం కేసు నమోదు కాలేదు. -
ఐఏఎస్లూ.. పొలాలకు వెళ్లండి
ఐఏఎస్ అధికారులు కూడా సచివాలయం నుంచి పొలాలకు కదలాలని.. రైతులతో మాట్లాడాలని, సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు సలహాలు, సూచనలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. -
ప్రోత్సాహకాలు అందిస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. -
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం
రాబోయే వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మిగిలిన 6.75 లక్షల గృహాలను మార్చికల్లా పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్
-
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ
-
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్ రాకెట్ను ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు
-
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM