- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Polavaram: నీళ్లలో ఉన్నా డయాఫ్రం వాల్కు ఏం కాదు
‘పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్పై వరద నీరు ప్రవహంచినంత మాత్రాన ఆ కట్టడానికి ఏమీ కాదు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదు’ అని అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వ్యాఖ్యానించారు.
పోలవరం పర్యటనలో అంతర్జాతీయ నిపుణుల వ్యాఖ్య
వివిధ కోణాల్లో పరిస్థితుల అంచనా
కొన్ని అదనపు పరీక్షలకు సిఫార్సు
వెంటనే ప్రారంభించిన అధికారులు
దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ఖాళీల్లో ఉన్న మట్టి, ఇసుక తీస్తున్న నిపుణుడు
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే - పోలవరం: ‘పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్పై వరద నీరు ప్రవహంచినంత మాత్రాన ఆ కట్టడానికి ఏమీ కాదు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదు’ అని అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వ్యాఖ్యానించారు. ఒక డయాఫ్రం వాల్కు మరో కొత్త కట్టడాన్ని అనుసంధానించినంత మాత్రాన రెండింటి సమన్వయం సాధ్యం కాదన్న ఆలోచననూ వారు తోసిపుచ్చారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ను సందర్శించిన క్రమంలో జరిగిన చర్చలో వారు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన అంతర్జాతీయ నిపుణులు అనేక అంశాలు ప్రస్తావిస్తున్నారు. వాటిపై అక్కడ ఉన్న కేంద్ర జలసంఘం నిపుణులు, అఫ్రి డిజైన్ సంస్థ ప్రతినిధులు, స్థానిక ఇంజినీరింగ్ అధికారులు, ఇతర సంస్థల ప్రతినిధులు ఇచ్చే సమాధానాలు వింటూ వారి అనుమానాలను నివృత్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రాజెక్టులో కీలక కట్టడమైన డయాఫ్రం వాల్ గోదావరి భారీ వరదలకు ధ్వంసమైంది. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలా, పాతదానికే మరమ్మతులు చేసి, కొంతమేర కొత్తది నిర్మించి పాత కట్టడానికి అనుసంధానించాలా అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై సోమవారం చర్చ జరిగింది. ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్ను మరమ్మతు చేసుకుంటే సరిపోతుంది కదా అని ఒక నిపుణుడు వ్యాఖ్యానించారు. ఈ కట్టడం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమయింది? ఎప్పుడు పూర్తయింది అని నిపుణులు ప్రశ్నించారు. డయాఫ్రం వాల్ వరద నీటిలో ఉండిపోయింది కదా.. ఏం నష్టం జరగదా అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. వరద ఆ కట్టడంపై ప్రవహించినంత మాత్రాన ఏమీ నష్టం వాటిల్లదని, వరద నీటిలో ఉన్నంత మాత్రాన ఏం జరగదని నిపుణులు బదులిచ్చారు. ఈ డయాఫ్రం వాల్కు కొత్త కట్టడం జత చేస్తే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని మరికొందరు ప్రశ్నించగా.. అలాంటివేమీ ఉండవనీ సమాధానమిచ్చారు. 20 ఏళ్ల కిందట నిర్మించిన డయాఫ్రం వాల్ను వెడల్పు చేసి నిర్మించుకున్న ఘటనలు కూడా ఉన్నాయన్నారు. పాత డయాఫ్రం వాల్ ఒక సామర్థ్యంతో, కొత్తది మరో సామర్థ్యంతో పని చేస్తాయన్నది సరికాదని వివరించారు. డయాఫ్రం వాల్పై జాతీయ జలవిద్యుత్తు పరిశోధన సంస్థ పరీక్షించి ఇచ్చిన నివేదిక ప్రతులను నిపుణులు తీసుకున్నారు. డయాఫ్రం వాల్పై ఎలక్ట్రోడ్ల సాయంతో కాకుండా అక్కడక్కడా తవ్వి, మెటీరియల్ తీసి పరీక్షించాలని సూచించారు. డయాఫ్రం వాల్ గ్యాప్ల్లో ఉన్న మట్టి, ఇసుక నమూనాలను పరిశీలించారు. అది డయాఫ్రం వాల్లో ఉన్న మెటీరియల్ కాదని, పైన వచ్చి చేరిన ఇసుక మాత్రమే అని అధికారులు తెలియజేశారు. దీంతో డయాఫ్రం వాల్ ధ్వంసమైన చోట కొన్ని నమూనాలు తీసి పరిశీలించారు.
కాఫర్ డ్యాంల సీపేజీపై పోలవరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్న అంతర్జాతీయ నిపుణులు
సీపేజీపై మరిన్ని పరీక్షలకు సిఫార్సు
ఎగువ కాఫర్ డ్యామ్ను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు.. అక్కడ ఇప్పటికే చేసిన పరీక్షల నివేదికలను సరిచూశారు. వెంటనే మరికొన్ని పరీక్షలు చేయించాలని, ఆ ఫలితాలను మంగళవారం చూస్తామని సూచించారు. దీంతో స్థానిక ఇంజినీరింగ్ అధికారులు వెంటనే ఆ పరీక్షలు ప్రారంభించారు. వైబ్రో కాంపాక్షన్ పనులు, గ్యాప్-1 ప్రధాన డ్యాం ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. క్లే కోర్ (బంకమట్టి) ఉన్న చోట నిర్మాణాలు కష్టమనే అభిప్రాయాన్ని కూడా వారు తోసిపుచ్చారు. అలా నిర్మించిన ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయన్నారు.
డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతంలో సాంకేతిక అంశాలు పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్న రిచర్డ్ డోనెల్లీ
నేడు, రేపు సమీక్షలు
అంతర్జాతీయ నిపుణులు డివిడ్ బి.పాల్, రిచర్డ్ డోన్నెల్లీ, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, సీస్ హించ్బెర్గర్ తదితరులు మంగళ, బుధవారాల్లో పోలవరంలోనే సమీక్షలు నిర్వహించనున్నారు. తొలి రెండు రోజులు ప్రాజెక్టు పరిశీలించినవారు చివరి రెండు రోజులు.. అందుబాటులో ఉన్న సమాచారంపై అధ్యయనం చేసి అధికారులు, ఇతర నిపుణులతో చర్చిస్తారు. దీంతో ప్రస్తుతం ఉన్న నివేదికలకు తోడు ఇంకా ఏమేం సమాచారం కావాలో, ఇంకా ఏమైనా పరీక్షలు చేయించాలా అని అధికారులు వారిని అడిగి తెలుసుకుంటున్నారు. నిపుణుల్లో కొన్ని విషయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరు ఇప్పటికిప్పుడు ఏ పరిష్కారాలు చూపే అవకాశం లేదని.. నలుగురూ అంతర్గతంగా చర్చించి నివేదిక సమర్పిస్తారని సమాచారం. కేంద్ర జలసంఘం డిప్యూటీ డైరక్టర్ అశ్వనీకుమార్ వర్మ, డిజైన్ల చీఫ్ ఇంజినీరు విజయ్ శరణ్, పోలవరం అథారిటీకి చెందిన రఘురామ్, జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, పోలవరం ఇన్ఛార్జి చీఫ్ ఇంజినీర్ నరసింహమూర్తి తదితరులు నిపుణుల వెంట ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
ఒంగోలు సత్యనారాయణపురంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. పిల్లర్ల దశలో ఉన్న భవనంలోనే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. నాడు-నేడు రెండో దశలో భాగంగా కొత్త భవనం నిర్మిస్తామని 2022లో పాత భవనాన్ని గత వైకాపా ప్రభుత్వం కూలగొట్టింది. -
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పురోగతి, తర్వాత వైకాపా ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని వివరించారు. -
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
మీరేదైనా వాహనం కొంటే స్టిక్కరింగ్కు ఎంతవుతుంది? మహా అయితే రూ.2 వేల నుంచి రూ.5 వేలు. కానీ, వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశువైద్య సేవా వాహనాలకు రంగులు, జగన్ బొమ్మలు వేయించడానికి రూ.2.50 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా. -
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. -
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి చేయనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సు తొలగింపు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సును కళాశాల విద్యాశాఖ మూసివేసింది. బీకాం కంప్యూటర్స్ ఒక్కటే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. -
అమరావతిని బంగారం చేస్తాం
అమరావతిపై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్ ప్రభుత్వం.. రాజధాని బ్రాండ్ ఇమేజ్ను సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన జరిగి పదేళ్లయినా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు
కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ- అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణ
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. -
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికే నిర్ణయం
పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్ కుష్విందర్ ఓహ్రా స్పష్టం చేశారు. -
అందరికీ ఉచిత ఇసుక
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు శ్రీకారం చుడుతోంది. సీఎం చంద్రబాబు బుధవారం దిశానిర్దేశం చేయడంతో ఆ శాఖ అధికారులు ఈ విధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కల్కి సినిమా టికెట్ ధర పెంపుపై హైకోర్టులో పిల్
కల్కి సినిమా టికెట్ల ధరను మొదటి 14 రోజులు పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్) బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. -
మహిళా కార్యదర్శులకు పోలీసు బాధ్యతలు.. ప్రభుత్వ నిర్ణయంలో ఏదైనా పురోగతి ఉంటే చెప్పండి
గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ, చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. -
హైకోర్టులో జీపీ, ఏజీపీల నియామకం
రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు ఆరుగురు ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), 14 మంది సహాయ ప్రభుత్వ న్యాయవాదులు (ఏజీపీ) నియమితులయ్యారు. -
ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ఉన్నత విద్యామండలి
ఉన్నత విద్యా మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అమలు కావడం లేదు. వైకాపా ప్రభుత్వంలో నియమించిన వారే పని చేస్తుండడంతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. -
వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్మన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం బుధవారం కడప రిమ్స్కు తరలించారు. -
జప్తు చేసిన రూ.20 కోట్ల సామగ్రి మాయం!
వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. సెక్యూరిటీ గార్డు కాపలా ఉంటున్నారు.. కానీ లోపల యంత్రసామగ్రి మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. కనీసం కేసు నమోదు కాలేదు. -
ఐఏఎస్లూ.. పొలాలకు వెళ్లండి
ఐఏఎస్ అధికారులు కూడా సచివాలయం నుంచి పొలాలకు కదలాలని.. రైతులతో మాట్లాడాలని, సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు సలహాలు, సూచనలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. -
ప్రోత్సాహకాలు అందిస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. -
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం
రాబోయే వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మిగిలిన 6.75 లక్షల గృహాలను మార్చికల్లా పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ