- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Polavaram: పోలవరంలో సవాళ్లు.. పరిష్కరించదగ్గవే!
పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఎదురైన సవాళ్లన్నీ పరిష్కరించదగ్గవేనని విదేశీ నిపుణులు ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. మొత్తం మీద సానుకూల వ్యాఖ్యలు చేసినప్పటికీ సమగ్ర అధ్యయనం తర్వాతే తుది నిర్ణయాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ నిపుణుల ప్రాథమిక అంచనా
సమగ్ర అధ్యయనం తర్వాతే తుది నిర్ణయాలని స్పష్టీకరణ
నేడు కేంద్ర జలసంఘం ఛైర్మన్తో భేటీ
డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబంధించి సాంకేతిక వివరాలను పరిశీలిస్తున్న నిపుణులు
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఎదురైన సవాళ్లన్నీ పరిష్కరించదగ్గవేనని విదేశీ నిపుణులు ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. మొత్తం మీద సానుకూల వ్యాఖ్యలు చేసినప్పటికీ సమగ్ర అధ్యయనం తర్వాతే తుది నిర్ణయాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ‘ఆయా అంశాలపై తలో అనుమానం ప్రస్తావిస్తున్నారు. ప్రాథమికంగా మా దృష్టికి వచ్చిన అంశాల ఆధారంగా అభిప్రాయాలు చెబుతున్నాం. ఇవి తుది నిర్ణయాలు కావు. మేం కొంత సమాచారం కోరాం. అవన్నీ మాకు ఇచ్చామని మీరు చెబుతున్నారు. ఆ నివేదికలను మేం అధ్యయనం చేయలేదు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిస్థితులను మాత్రమే చూశాం. ఇందుకు సంబంధించి చేసిన పరీక్షల అధ్యయన నివేదికలను లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తాం. బుధవారం ప్రాథమికంగా కొన్ని అభిప్రాయాలు వెల్లడిస్తాం’ అని విదేశీ నిపుణులు తేల్చిచెప్పారు.
నేడు నిపుణుల ప్రజంటేషన్
ఇంత వరకు పోలవరంలో అధికారులు ఇచ్చిన ప్రజంటేషన్ను నిపుణులు పరిశీలించారు. మంగళవారం రాత్రి, బుధవారం విదేశీ నిపుణులు అందుబాటులో ఉన్న పోలవరం నివేదికలన్నీ అధ్యయనం చేసి ఒక ప్రజంటేషన్ సిద్ధం చేయబోతున్నారు. బుధవారం కేంద్ర జలసంఘం ఛైర్మన్తో జరిగే వీడియో కాన్ఫరెన్స్లో దాన్ని సమర్పించి, వివరాలు తెలియజేయనున్నారు. తుది నిర్ణయాలు తీసుకునేందుకు ప్రస్తుతం చేసిన పరీక్షలు సరిపోతాయా, ఇంకా ఏమైనా అధ్యయనం చేయాల్సి ఉందా అన్నది తేల్చిచెప్పాలని కేంద్ర జలసంఘం డైరెక్టర్ ఇప్పటికే విదేశీ నిపుణులను కోరారు. నవంబరు వరకు గోదావరిలో వరద కాలమని, ఆ తర్వాత ప్రాజెక్టులో పనులు త్వరితగతిన చేయాలనుకుంటున్నామని, అందువల్ల అప్పటికి పరిష్కారాలు సిద్ధం చేస్తే పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లే ఆస్కారం ఉంటుందని కేంద్ర జలసంఘం ప్రతినిధులు కోరారు. బుధవారం తమ ప్రజంటేషన్లో ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తామని- సత్వరమే ఎలా ముందుకెళ్లాలో తెలియజేస్తామని, తుది నివేదిక ఆ తర్వాత సమర్పిస్తామని విదేశీ నిపుణులు వెల్లడించారు.
డయాఫ్రం వాల్ నిర్మాణానికి ముందు భూగర్భంలో నుంచి తీసిన రాయి నమూనాల గురించి
విదేశీ నిపుణులకు వివరిస్తున్న సీడబ్ల్యూసీ డిప్యూటీ డైరెక్టర్ అశ్వినీకుమార్ వర్మ
డయాఫ్రం వాల్పై భిన్న చర్చలు
పోలవరం సవాళ్లపై మంగళవారం పూర్తిస్థాయిలో చర్చలు జరిగాయి. ప్రాజెక్టులో వివిధ కట్టడాలు నిర్మించిన కంపెనీల ప్రతినిధులు, వారి నిపుణులు సంబంధిత నిర్మాణాలపై ప్రజంటేషన్ ఇచ్చారు. వాటిలో తలెత్తిన సమస్యలపై ఏం చేస్తున్నామో చెప్పారు. ఇదే పద్ధతిలో వెళ్లాలా, ఇంకేమైనా మార్పులు చేయాలా అని నిపుణులను అడిగారు. ప్రస్తుతమున్న డయాఫ్రం వాల్ను మరమ్మతు చేయవచ్చని డయాఫ్రం వాల్ సాంకేతికతపై అనుభవమున్న విదేశీ నిపుణుడు అభిప్రాయపడ్డారు. కెల్లర్, బావర్ కంపెనీ ప్రతినిధులు దాంతో విభేదించారు. కొత్త కట్టడం అవసరమని పేర్కొన్నారు. డ్యాం భద్రతా అంశాన్ని పరిశీలించే విదేశీ నిపుణుడు సైతం భద్రత అంశాలు లోతుగా పరిశీలించాలి కదా అని వ్యాఖ్యానించారు. ఎగువ కాఫర్ డ్యాం భద్రంగానే ఉందన్న నిపుణులు.. సీపేజీ సమస్య పరిష్కారానికి మార్గాలు సూచిస్తామని చెప్పారు. కొన్ని పర్మిబిలిటీ పరీక్షలకు సిఫార్సు చేశారు. ఆ ఫలితాలు చూసిన తర్వాత ఎలా ముందడుగు వేయాలో తెలియజేస్తామన్నారు. జెట్ గ్రౌటింగ్, వైబ్రో కాంపాక్షన్ పనులు, స్టోన్ కాలమ్స్ తదితర అంశాలపైనా చర్చ జరిగింది. ఎగువ కాఫర్ డ్యాం బాగానే ఉందని విదేశీ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రధాన డ్యాం ప్రాంతంలో అగాధాలున్న చోట ఇసుక సాంద్రత పెంచే పనులు చేపట్టినా ఒక స్థాయి దాటి దిగువకు వెళ్లడం లేదని అధికారులు తెలియజేశారు. సమావేశంలో విదేశీ నిపుణులు డేవిడ్ బి పాల్, రిచర్డ్ డొన్నెల్లీ, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, సీస్ హించ్బెర్గర్, రాష్ట్ర జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, చీఫ్ ఇంజినీర్ నరసింహమూర్తి, పోలవరం అథారిటీ కార్యదర్శి రఘురామ్, సీఈ వెంకట సుబ్బయ్య, కేంద్ర జలసంఘం డిప్యూటీ డైరెక్టర్ అశ్వనీకుమార్ వర్మ, నిపుణులు విజయ్ శరణ్, గౌరవ్ తివారీ, అన్నెపు ప్రవీణ్, మనీష్ గుప్తా (సీఎస్ఎంఆర్ఎస్), బావర్, కెల్లర్, అఫ్రి, మేఘా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
నిపుణుల రాక ఆలస్యమైతే చాలా ఇబ్బందయ్యేది: మంత్రి
రెండు రోజులుగా పోలవరం ఎగువ, దిగువ కాఫర్డ్యాంల మధ్య సీపేజీ కారణంగా నీటి మట్టం పెరుగుతోందని, విదేశీ నిపుణులు ముందుగా వచ్చి అన్నీ పరిశీలించడంతో ఎంతో మేలు జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. లేకపోతే నవంబరు వరకు డయాఫ్రం వాల్ను పరిశీలించే అవకాశం ఉండేది కాదన్నారు. అంతర్జాతీయ నిపుణులు రాక మరో రెండు రోజలు ఆలస్యమైతే వారు వచ్చినా ఉపయోగం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టును మంత్రి సందర్శించారు. నిపుణుల సమావేశంలో కొద్దిసేపు పాల్గొన్నారు. అనంతరం స్పిల్వే, ఎగువ కాఫర్ డ్యాంల వద్ద నీటి పరిస్థితిని పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ.. రూ.60వేల కోట్లతో ఏర్పాటు
మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటుకానుంది. దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో భేటీ అయ్యారు. -
జగన్ ఫొటోతో ఉన్న నవరత్నాల లోగోలు తొలగించరేం?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా కొన్ని ప్రభుత్వశాఖల అధికారులకు గత వైకాపా ప్రభుత్వంపై అభిమానం తగ్గినట్లు లేదు. వైకాపా జెండా రంగులో రూపొందించిన కొన్ని ప్రభుత్వశాఖల వెబ్సైట్లను ఇప్పటికీ అదే విధంగా కొనసాగిస్తున్నారు. -
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
ఆ రొయ్యల శుద్ధి పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమై రోగాల బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం.. కాకాణి సొంతూరిలో భారీ మోసం
ధనార్జనే ధ్యేయంగా గత ఐదేళ్లలో వైకాపా నాయకులు వీలున్నచోటల్లా అక్రమ లేఅవుట్లు వేసి భారీగా దోపిడీకి పాల్పడ్డారు. -
నెల్లూరు జిల్లాలో 2 పెద్దపులులు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ అధికారి బి.చంద్రశేఖర్ ధ్రువీకరించారు. -
సూర్యారాధన చేసిన పవన్ కల్యాణ్
వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం సూర్యారాధన క్రతువులో పాల్గొన్నారు. -
జగన్ పర్యటనలో దొంగల హల్చల్
మాజీ సీఎం జగన్ పర్యటనలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గురువారం నెల్లూరులోని సెంట్రల్ జైలు వద్దకు రాగా.. ఆయన్ను చూసేందుకు వైకాపా కార్యకర్తలు పెద్దఎత్తున గుమిగూడారు. -
చంద్రబాబుకు థాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర
విదేశీ విద్యా పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లకు ధన్యవాదాలు తెలపడానికి మక్బుల్జాన్ అనే మహిళ ద్విచక్ర వాహన యాత్ర చేపట్టారు. -
కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణం వేగంగా సాగుతోంది. చిన్నఅవుటపల్లి నుంచి సూరాయపాలెం వరకూ పనులు తుది దశకు వచ్చాయి. -
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ
రాజధాని అమరావతిలో మరో ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ ఏర్పాటు కాబోతోంది. మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైనదిగా గుర్తింపు పొందిన ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ త్వరలో తన ప్రాంగణాన్ని అమరావతిలో నెలకొల్పనుంది. -
ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి
గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. -
పెద్దిరెడ్డీ.. ఇదేం పని?
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ‘ఘన’కార్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపంలోని రాయల్నగర్లో రూ.19 లక్షల కార్పొరేషన్ సొమ్ముతో ఇంటికి సీసీ రోడ్డు వేయించుకున్నారు.. అంతేకాకుండా మరెవరికీ ప్రవేశం లేదంటూ రెండు వైపులా గేట్లు పెట్టేశారు. -
చేసిన పాపం కాల్చేస్తే పోతుందని!?
కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబంధించిన కీలక పత్రాల దహనం అనేక సందేహాలకు తావిస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పీసీబీ కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమాలకు ఆధారాలు లభించకుండా చేసేందుకు పత్రాల్ని, దస్త్రాల్ని తగలబెట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మన్యంవీరుడు అల్లూరికి చంద్రబాబు నివాళి
స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. -
గుంతలు పూడ్చే ప్రాజెక్టు గోవిందా!
గత వైకాపా ప్రభుత్వం తలపెట్టిన గ్రామీణ రహదారుల్లో గుంతలు పూడ్చే ప్రాజెక్టు అటకెక్కింది. ఆర్థికసాయం చేసేందుకు నాబార్డు ససేమిరా అనడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. -
ప్రజా వేదిక శిథిలాలు అక్కడే
గతంలో జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలను తొలగించకుండా అలాగే ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వండి
దిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. -
సంక్షిప్త వార్తలు (11)
రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరిస్తామని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్మార్క్ తెలిపారు. -
ఇదీ సంగతి!
-
ఆగస్టు 16 నుంచి విజయవాడ-ముంబయి విమాన సర్వీస్
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబయికి ప్రత్యేక సర్వీస్ను నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. -
కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించాలి
రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
-
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
-
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
‘మీర్జాపూర్’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్ వర్మ
-
అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం
-
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ