- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Eenadu MD kiran: నాన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం
‘ప్రజాశ్రేయస్సు, ప్రజాస్వామ్య విలువల కోసం జీవితాంతం మా నాన్నగారు రామోజీరావు పరితపించారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే సంకల్ప సభగా ఈ సంస్మరణ సభను మేం భావిస్తున్నాం.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆయన కల
ఆ నగర నిర్మాణానికి రూ. 10 కోట్ల విరాళం
‘ఈనాడు’ ఎండీ సీహెచ్ కిరణ్ వెల్లడి
రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.10 కోట్ల చెక్కును చంద్రబాబు, పవన్కల్యాణ్లకు అందిస్తున్న
రామోజీరావు కుమారుడు కిరణ్, కోడళ్లు శైలజాకిరణ్, విజయేశ్వరి
ఈనాడు, అమరావతి: ‘ప్రజాశ్రేయస్సు, ప్రజాస్వామ్య విలువల కోసం జీవితాంతం మా నాన్నగారు రామోజీరావు పరితపించారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే సంకల్ప సభగా ఈ సంస్మరణ సభను మేం భావిస్తున్నాం. ఆయన నమ్మిన, పాటించిన విలువలను ఇకపై కూడా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరం సభాముఖంగా మాట ఇస్తున్నాం. మనం చేసే పనులు ప్రజోపయోగకరమైనవో.. కావో చూడాలని ఎప్పుడూ ఆయన చెప్పేవారు. ఆ కృషిని కొనసాగిస్తాం’ అని ‘ఈనాడు’ మేనేజింగ్ డైరక్టర్ సీహెచ్ కిరణ్ ప్రకటించారు. ‘నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఒక ఐకానిక్ నగరంగా రూపొందాలనేది ఆయన కల.
రామోజీరావు ఆకాంక్షలకు అనుగుణంగా నూతన నగరం అమరావతి అపురూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్ఠలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరఫున ఈ నగర నిర్మాణానికి రూ. 10 కోట్లు విరాళంగా అందజేస్తున్నాం’ అని వెల్లడించారు. తన తండ్రి ఆలోచనా విధానాన్ని, అనేక రంగాల్లో ఆయన కృషిని కిరణ్ వివరించారు.
పౌరులకు రక్షాకవచం
‘రామోజీరావు ప్రచారాన్ని ఇష్టపడే వారు కాదు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు రక్షించడానికి ఆయన ఎప్పుడూ ముందుండేవారు. పౌరులు ఇబ్బందులు పడుతుంటే వారికి రక్షాకవచంగా నిలిచేవారు. ప్రజల హక్కుల్ని పాలకులు కబళించినప్పుడు బాధితుల పక్షాన నిలిచేవారు. ఎక్కడ ఏ ఉపద్రవమొచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉండేవారు. ఏ గొప్ప సంస్థయినా ఒక మహామనిషి (లెజండరీ) నీడలో విస్తరిస్తుంది. ‘ఈనాడు’ గ్రూపు సంస్థలు కూడా రామోజీరావు అనే ఒక యుగపురుషుడి నీడలో వేళ్లూనుకున్నాయి. జీవితాంతం ఆయన ప్రజాసంక్షేమం, ప్రజా జీవనంలో విలువల కోసం ఒక యోధుడిలా పని చేశారు. ఐదు దశాబ్దాలుగా రామోజీరావు ప్రజావ్యతిరేక అంశాలను ఎదుర్కొనేందుకు ఎంతటి కష్టనష్టాలకైనా సిద్ధపడేవారు. దేశంలో ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా బాధితులకు అండగా నిలిచేవారు. అవసరమైన సహాయ సహకారాలు అందించేవారు’ అని కిరణ్ వివరించారు.
మాట్లాడుతున్న ‘ఈనాడు’ ఎండీ కిరణ్
రాజధానికి పేరు పెట్టింది ఆయనే..
‘‘నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరును సూచించింది రామోజీరావే. కృష్ణమ్మ ఒడ్డున రాజధాని నగరం అద్భుతంగా రూపుదిద్దుకోవాలని బలంగా ఆకాంక్షించారు. చంద్రబాబునాయుడు ఆహ్వానంపై శంకుస్థాపన కార్యక్రమానికి కూడా వచ్చి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆ కల నెరవేరాలని మా కుటుంబం తరఫున రూ. 10 కోట్ల విరాళం అందిస్తున్నాం. రామోజీరావు గతంలో ఏం చేశాం అనేది ఎప్పుడూ చూసేవారు కాదు. ఎప్పుడూ ఆయనది ముందుచూపే. కలలు నిజం చేసుకోవాలంటే ధైర్యంగా ముందడుగు వేయాలని, చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన నమ్మేవారు. ఈ సభను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇంత తక్కువ వ్యవధిలోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించింది. ఎంతో దూరం నుంచి ఈ కార్యక్రమానికి వచ్చి మా కుటుంబానికి అండగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు’ అని కిరణ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్ఫోన్లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. -
విజయవాడ హైవేపై.. ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్ల ప్రారంభం
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి