- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Kakinada: ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
ఆ రొయ్యల శుద్ధి పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమై రోగాల బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు.
కాకినాడ జిల్లాలో రొయ్యల శుద్ధి కేంద్రం
కాలువల్లోకి యథేచ్ఛగా వ్యర్థాల విడుదల
జలాలు కలుషితమై గగ్గోలు పెడుతున్న స్థానికులు
కరప మండలం గురజనాపల్లిలోని వీరభద్ర ఎక్స్పోర్ట్స్ రొయ్యల శుద్ధి కర్మాగారం
కరప, న్యూస్టుడే: ఆ రొయ్యల శుద్ధి పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమై రోగాల బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాకినాడ జిల్లా కరప మండలం గురజనాపల్లిలో ఉన్న వీరభద్ర ఎక్స్పోర్ట్స్ రొయ్యల శుద్ధి కర్మాగారం గురించే ఇదంతా. కాకినాడ నగర వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి సోదరుడికి చెందిన ఈ పరిశ్రమ 2015లో ఏర్పాటయింది. ఇక్కడ రొయ్యల ప్రాసెసింగ్ చేస్తుంటారు. ఈ ప్రక్రియలో విడుదలయ్యే వ్యర్థ జలాలను ఖాళీగా ఉన్న వందల ఎకరాల సాల్ట్ భూముల గుండా చిన్న చిన్న కాలువల్లోకి వదిలేస్తున్నారు. అవి ఉప్పలంక సమీపంలోని గోదావరి పాయ ద్వారా సముద్రంలో కలుస్తున్నాయి. ఒకప్పుడు ప్రజావసరాలకు ఉపయోగపడిన ఈ కాలువల్లోని నీరు.. ఇప్పుడు కలుషితమై విషతుల్యంగా మారింది. గురజనాపల్లి, చొల్లంగి, ఉప్పలంక గ్రామాలపై ప్రభావం ఉండగా.. ఉప్పుసాగునూ ఈ కలుషిత జలాలు ప్రభావితం చేస్తున్నాయి. సముద్రంలోని చేపలు చనిపోయి మత్స్యకారులకు ఉపాధీ కరవవుతోంది.
పత్తా లేని పీసీబీ అధికారులు
ప్రతి రెండు నెలలకు ఒకసారి క్షేత్రస్థాయి పరిశీలన జరగాల్సి ఉన్నా కాలుష్య నియంత్రణశాఖ (పీసీబీ) అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఇదే పరిశ్రమలో గతంలో ఏడాది కాలంలో మూడుసార్లు అమ్మోనియా గ్యాస్ లీకైన ఘటనలున్నాయి. పలుమార్లు ప్రమాదం జరిగినా యాజమాన్యం తమ సొంత ప్రైవేటు ఆసుపత్రులలో బాధితులను చేర్పించి కేసులు లేకుండా జాగ్రత్త పడింది. కాకినాడలో ఇటీవల ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షలోనూ ఈ పరిశ్రమ కాలుష్యం గురించి ప్రస్తావించారు. పీసీబీ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్మాగారం నుంచి వస్తున్న కాలుష్య కారక వ్యర్థాలు
తగిన చర్యలు తీసుకుంటాం
- సందీప్రెడ్డి, ఈఈ, ఏపీ పీసీబీ, కాకినాడ
గురజనాపల్లిలోని రొయ్యల శుద్ధి పరిశ్రమ నుంచి రసాయనిక వ్యర్థాలు బయటకు వదలకుండా చర్యలు చేపడతాం. అనుమతికి మించి అధిక ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించి యాజమాన్యానికి ఇప్పటికే నోటీసు అందజేశాం. ప్రత్తిపాడు మండలం లంపకలోవలోని రొయ్యల పరిశ్రమకూ నోటీసులు ఇచ్చాం. జల కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృత్తి ఉద్యోగం.. ప్రవృత్తి కాంట్రాక్టులు
ఆయన హోదా కంటి ఆస్పత్రిలో సీనియర్ అసిస్టెంట్ స్థాయి. రోగులకు సేవచేయాల్సిన ఆయన.. ఆస్పత్రికి రావడం, సంతకం చేయడం, వెంటనే కారులో బయటకు వెళ్లడం, తన కాంట్రాక్టు పనులు పరిశీలించడం దినచర్యగా మార్చుకున్నారు. -
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా చిట్టడవిని తలపిస్తున్న రాజధాని అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. -
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ వ్యవహారంలో వైకాపా నేతలకు ఉచ్చు బిగుస్తోంది. -
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామ ఫ్యాక్షన్ గొడవల్లో 11 మంది హత్యకు కారణమై జీవితఖైదు పడిన దోషులను.. నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. -
నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
ఛైర్మన్ లేరు.. జీతాలు ఇవ్వడం కుదరదు
ఉన్నత విద్యామండలికి ఛైర్మన్ లేనందున జూన్ నెల జీతాలు ఇవ్వడం కుదరదంటూ వైకాపా హయాంలో నియమితులైన అధికారులు ఆదేశాలిచ్చారు. -
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
గ్రామ సచివాలయాల గురించి పదేపదే గొప్పలు చెప్పుకొన్న గత వైకాపా ప్రభుత్వం వాటి నిర్మాణపనులు చేసినవారికి బిల్లులు చెల్లించకుండా మొండిచేయి చూపింది. -
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ చిత్రం కాకినాడ 49వ డివిజన్ రాజేంద్రనగర్లోని చైతన్య డిగ్రీ కళాశాలకు వెళ్లే మార్గంలోనిది. -
ఓఆర్ఆర్తో ‘అభివృద్ధి పరుగులు’
అమరావతితో పాటు, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు జీవనాడిగా నిలిచే అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించడం... రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మేలిమలుపు తిప్పే పరిణామం. -
రేపటి నుంచి ఉచిత ఇసుక
రాష్ట్రంలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. -
విశాఖ తీరాన.. వీయాలి ఐటీ వీచిక!
దేశ తూర్పు తీరాన పోర్ట్ సిటీగా, నేవీ కేంద్రంగా, పర్యాటక క్షేత్రంగా పేరుగాంచిన విశాఖపట్నం.. ఐటీ రంగంలోనూ సరికొత్త ముద్ర వేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని యువత ఆకాంక్షిస్తోంది. -
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
మరో 30 ఏళ్లు తానే సీఎంగా ఉంటాననుకొని విశాఖలోని రుషికొండ మీద జగన్ రాజమహల్ను కట్టించుకున్నారు. రూ.500 కోట్ల ప్రజాధనాన్ని విలాస వసతులకు ఖర్చు చేశారు. -
‘పెద్దాయన’కు మేలు చేసేలా బొగ్గు గని ఒప్పందం
ఏ ప్రభుత్వ రంగ సంస్థ అధికారైనా.. ఆ సంస్థకు మేలు చేసేందుకు చూస్తారు. కానీ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఎండీగా మొన్నటి వరకు వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి మాత్రం.. ఓ బొగ్గు గని ప్రాజెక్టు ద్వారా వైకాపా ప్రభుత్వంలో నెంబర్ టూగా చక్రం తిప్పిన ‘పెద్దాయన’కు ఎక్కువ ప్రయోజనం దక్కేలా చూశారు. -
8 హైవేల విస్తరణకు కేంద్రం సుముఖం
రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన కీలకమైన 8 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ మొదలయ్యేందుకు మార్గం సుగమమైంది. -
ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస పవిత్ర సారె ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో తొలి సారెను వైదిక కమిటీ పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు కుటుంబసభ్యులతో కలిసి సమర్పించారు. -
వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలు అనుసరించండి
వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే.. వాటి నుంచి కూడా సరికొత్త సంపద సృష్టించవచ్చని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. -
వాల్తేర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్తోనే ప్రయోజనం: విశాఖ ఎంపీ శ్రీభరత్
శాఖ కేంద్రంగా వాల్తేర్ డివిజన్తో కూడిన దక్షిణకోస్తా రైల్వేజోన్ సాధించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఆ దిశగా కృషిచేస్తామని విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా విశాఖ నుంచి పూరీకి నడపనున్న ప్రత్యేక రైలును శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. -
ట్రిపుల్ఐటీ డైరెక్టర్ల రాజీనామా
రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం డైరెక్టర్లు కుమారస్వామి గుప్తా, భాస్కర్ పటేల్, బాలాజీ శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. -
ఇసుక దోపిడీకి రాచమార్గం
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం ఇసుక రీచ్లో వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేశారు. -
ఐదేళ్ల తర్వాత పలాసకు సాగునీరు
వైకాపా ఐదేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ రైతులు సాగునీటికి నానాకష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వంశధార ఎడమ కాలువ ద్వారా నీరందించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్షలు పడేలా నూతన చట్టాలు పటిష్ఠంగా ఉన్నాయని, వీటిపై జూనియర్ న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు
-
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు
-
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
-
సినీ ప్రొడక్షన్ విభాగ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆత్మహత్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి