- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Dr Prabhakar Reddy: వృత్తి వైద్యం.. ప్రవృత్తి జగన్ను కీర్తించడం..
ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. అందులోనూ వైద్యవృత్తిలో ఉన్నారు. ఆ విషయాన్ని మరిచి వైకాపాతో మమేకమయ్యారు. నిత్యం జగన్ను కీర్తిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడాన్ని, ఫార్వర్డ్ చేయడాన్ని ప్రవృత్తిగా చేసుకున్నారు.
కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్రెడ్డి తీరిది
జూన్ 9న జగన్ ప్రమాణానికి విశాఖకు రావాలని వైద్యులకు చెప్పిన వైనం
ఈనాడు, అమరావతి, కర్నూలు: ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. అందులోనూ వైద్యవృత్తిలో ఉన్నారు. ఆ విషయాన్ని మరిచి వైకాపాతో మమేకమయ్యారు. నిత్యం జగన్ను కీర్తిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడాన్ని, ఫార్వర్డ్ చేయడాన్ని ప్రవృత్తిగా చేసుకున్నారు. ఫక్తు వైకాపా కార్యకర్తగా వ్యవహరించిన ఆయన పేరు డాక్టర్ ప్రభాకర్రెడ్డి. తాను ప్రభుత్వ ఉద్యోగినన్న విషయాన్ని మర్చిపోయి వ్యవహరించిన ప్రభాకర్రెడ్డి ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అవాకులు.. చవాకులు పేలుతున్నారని కూడా విమర్శించారు. ఇలాంటి ఈయనకు నాటి ప్రభుత్వం కర్నూలు జీజీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. అయినా వందల మంది వైద్యులు, సిబ్బందికి దిశానిర్దేశం చేయాల్సిన ఈయన్ను కట్టడి చేసే చర్యలకు ప్రయత్నమేమీ చేయలేదు. కర్నూలు జీజీహెచ్లో కార్డియోథొరాసిక్ విభాగాధిపతిగా ఉంటూ పైరవీలతో ఇన్ఛార్జి సూపరింటెండెంట్ పోస్టులోకి వచ్చిన ప్రభాకర్రెడ్డి ఎన్నికలకు ముందు వరకు సాగించిన ప్రచారాన్ని ఉద్యోగులు ప్రస్తుతం గుర్తుచేస్తున్నారు. ఆయన భావజాలం పూర్తిగా వైకాపాతో ఉన్నందున.. ఇప్పుడు ఆయనతో కలిసి ఎలా పనిచేయగలమని వైద్యులు, సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.
జగన్ దేవుడిగా కీర్తిస్తూ..
నాటి సీఎం జగన్ను పొగుడుతూ పాటలు, పద్యాలు, కవితలు, చిన్నపాటి కథలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. కార్టూన్లూ వేయించారు. జగన్ను దేవుడితో కూడా పోల్చారు. వీటికి వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రుల వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్బుక్లోనూ, ఇతర సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించారు. ఈయన స్వామిభక్తికి వైకాపా ప్రభుత్వం మెచ్చి... సీనియర్లను కాదని నాటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి సిఫార్సుతో ఇన్ఛార్జి సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టారు. పేరుకు ఇన్ఛార్జి అని పేర్కొన్నా.. ఆసుపత్రి పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది. వాస్తవానికి.. అదనపు డీఎంఈ హోదా ఉన్న వైద్యులనే సూపరింటెండెంట్గా నియమించాలన్న నిబంధన ఉన్నా అమలు చేయలేదు. ఆయనకు ముందు సూపరింటెండెంట్లుగా నియమితులైన ఇద్దరూ వైకాపా నాయకుల అండదండలతోనే పదవులు దక్కించుకున్నారు. సూపరింటెండెంట్గా వచ్చిన తర్వాత కూడా. ‘విధులు నిర్వర్తించడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా’ అంటూ ప్రభాకర్రెడ్డి పోస్టు పెట్టారు.
విశాఖకు వెళ్దాం.. సిద్ధంగా ఉండాలి
ఈ ఏడాది జూన్ 9న జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారని, ఆ కార్యక్రమానికి విశాఖ రావాలని వైద్యులకు పిలుపునిచ్చారు. ఆయన తెదేపాకు వ్యతిరేకంగా విమర్శలు కూడా చేశారు. ‘మామా గాంధార సార్వభౌమ... ల్యాండ్టైట్లింగ్ యాక్ట్ గురించి ఎవరైనా తప్పుడు సమాచారం.. అవాకులు.. చవాకులు పేలితే.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారట’ అని దివంగత ఎన్టీఆర్ బొమ్మతో పోస్ట్ పెట్టారు. జగనన్నే మన నమ్మకమని.. బతకాలిరా తమ్ముడు అని లోగో తయారుచేసి, అందులో ఫ్యాన్ గుర్తునూ ఉంచారు. జగనన్న చల్లని దీవెనలు పేదలందరికీ అందాలని, సీబీఎస్ఈ సిలబస్లో చదివించాలని, తల్లిదండ్రులు జగనన్నకు మంచిపేరు తేవాలనీ పేర్కొన్నారు. బెండపూడి విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడితే పులిసిపోతారు.. నాటునాటు పాట ఫంక్షన్లో హీరోలు అదే ఆంగ్లంలో మాట్లాడితే మా నాయనే.. మా బాబే అని మురిసి చంకలు గుద్దుకుంటారు. ఎంత కడుపు మంటారా పిల్లలపైన సామీ! అని కూడా ఓ పోస్టు పెట్టారు. ఎందుకిలా చేస్తున్నారు? వైద్యవృత్తిలో ఉన్నారు కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడికి దిగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖలోని అగనంపూడి టోల్గేట్ తొలగింపు
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఇన్నాళ్లు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న టోల్ వసూళ్లకు ఎట్టకేలకు తెరపడింది. -
తొలిసారి జైలుకు పిన్నెల్లి.. 14 కేసులున్నా ఇప్పటివరకూ తప్పించుకుని..
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన జీవితంలో తొలిసారి జైలుపాలయ్యారు. ఆయనపై 14 కేసులున్నా ఇప్పటి వరకు శిక్ష పడకుండా తప్పించుకు తిరిగారు. -
దాదాగిరీ వీడని పిన్నెల్లి.. పోలీసుల ముందే తెదేపా నేతపై దాడి
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నా తన దాదాగిరీ వీడలేదు. -
ఏపీ ప్రభుత్వం హుందాతనం.. జవహర్రెడ్డికి మళ్లీ పోస్టింగ్
వైకాపా ప్రభుత్వంలో కీలక హోదాల్లో వివాదాస్పదంగా పనిచేసి, ఈ నెలాఖరులో పదవీవిరమణ చేయనున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు రిటైర్మెంట్ ముంగిట పోస్టింగులు ఇచ్చి కూటమి ప్రభుత్వం హుందాగా వ్యవహరించింది. -
అర్ధరాత్రి రోడ్డు ఊడ్చిన నరసరావుపేట ఎమ్మెల్యే
ఎవరూ చూడరు... ఎవరూ పట్టించుకోరని అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే కుదరదని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. -
విలువల శిఖరం రామోజీ
తెలుగుభాష అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం. తెలుగుజాతి అంటే ఎనలేని ఆప్యాయత. ఆయన ఎప్పుడూ తెలుగు జాతి, భారతదేశం బాగుండాలని కోరుకున్నారు. -
నాన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం
‘ప్రజాశ్రేయస్సు, ప్రజాస్వామ్య విలువల కోసం జీవితాంతం మా నాన్నగారు రామోజీరావు పరితపించారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే సంకల్ప సభగా ఈ సంస్మరణ సభను మేం భావిస్తున్నాం. -
అక్షరమే ఆయుధంగా పోరాడిన అసమాన యోధుడు
అసాధారణ వ్యక్తిత్వం, అకుంఠిత దీక్షతో ఎంచుకున్న ప్రతి రంగంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా జీవించిన కర్మయోగి, ప్రజాకంటక పాలకులపై తుది శ్వాస వరకూ అక్షరమే ఆయుధంగా పోరాడిన అసమాన యోధుడు, విలువలకు నిలువెత్తు శిఖరం... రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ఆయన పుట్టినగడ్డ ఘన నివాళులర్పించింది. -
పనిలోనే విశ్రాంతి పొందిన.. నిర్విరామ శ్రామికుడు
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు జీవిత ప్రస్థానంపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన లఘుచిత్రం (ఏవీ) స్ఫూర్తిదాయకంగా ఉంది. -
ఇదీ సంగతి!
దేశంలో కనీస వ్యాయామం చేయనివారు సగం మంది... -
పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల అదనపు జూనియర్ సివిల్ కోర్టు రెండు కేసుల్లో 14 రోజుల రిమాండ్ విధించింది. -
ఆకట్టుకున్న.. రామోజీ చిత్ర ప్రదర్శన
రామోజీరావు జీవిత ప్రస్థానంలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఆయన జీవితంలోని అమూల్యమైన క్షణాలన్నింటినీ కళ్లముందు ఆవిష్కృతం చేసిన ఈ చిత్ర ప్రదర్శనను ఆహూతులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. -
ప్రభుత్వాల ఒత్తిళ్లు, దాడులను ఎదుర్కొంటూ.. విలువల కోసమే పోరాడిన వ్యక్తి
వ్యతిరేక వార్తలను ప్రచురిస్తున్నారనే కక్షతో రామోజీరావు ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలని ప్రయత్నించినా ఆయన ఎంతో ధైర్యంగా నిలబడ్డారని హిందూ పత్రిక పూర్వ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్.రామ్ కొనియాడారు. -
నిజాయతీ, నిర్భీతి మూర్తీభవించిన రామోజీ
సొంత కుటుంబసభ్యుల్ని బెదిరించినా పాత్రికేయ విలువల్ని కాపాడేందుకు రాజీపడకుండా నిలబడ్డ గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. -
సర్వే పేరుతో రూ.110 కోట్ల దారిమళ్లింపు
గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్)ని వైకాపా ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. గత ఐదేళ్లలో డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకు వినియోగించాల్సిన నిధుల్ని విచ్చలవిడిగా దారి మళ్లించింది. -
తితిదేలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ
తితిదే నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని తిరుమల తొలి పర్యటన సందర్భంగా స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దానికి అనుగుణంగానే చర్యలు ప్రారంభించారు. -
పారిశుద్ధ్యం.. భద్రత.. ఓ కుంభకోణం!
బోధనాసుపత్రుల్లో జోన్ల వారీగా పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు గత వైకాపా ప్రభుత్వం పిలిచిన టెండర్ను కొత్త ప్రభుత్వం రద్దుచేసింది. కొత్తగా మరోసారి టెండరు పిలవనుంది. -
వైకాపా భవనాలకు అనుమతుల్లేవు
వివిధ జిల్లాల్లోని వైకాపా కార్యాలయ భవనాల నిర్మాణాలకు అనుమతులు తీసుకోలేదని, నిబంధనలకు విరుద్ధంగా వాటిని నిర్మించారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. -
సెప్టెంబరు 21 నాటికి అన్న క్యాంటీన్లు
సెప్టెంబరు 21 నాటికి రాష్ట్రంలో ప్రతిపాదిత 203 అన్న క్యాంటీన్లూ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. -
65.18 లక్షల మందికి రూ.4,399 కోట్ల పింఛన్లు
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన పింఛన్లను జులై 1వ తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దనే అందించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. -
నీటి నమూనాలు పరీక్షించకుంటే చర్యలు తప్పవు
నీటి నమూనాల నాణ్యత నిర్ధారణ పరీక్షలను సక్రమంగా చేయని సీహెచ్ఓలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
నీట్పై చర్చకు ఇండియా కూటమి సిద్ధం: రాహుల్
-
పీజీ చేసిన ఉద్యోగికి.. లీవ్లెటర్ రాయడం రాకుంటే ఎలా? - సుప్రీం కోర్టు
-
రకుల్ప్రీత్ సింగ్ ‘వర్కౌట్స్’.. ఎడారిలో మాళవిక.. నభా ‘కాఫీ’ కబుర్లు!
-
పార్టీని వీడే వారి గురించి ఆలోచించొద్దు: కేసీఆర్
-
రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు: సీఎం రేవంత్
-
ఏసీబీ డీజీగా అతుల్ సింగ్.. ఏపీలో పలువురు IPSల బదిలీ