- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Kuppam: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం!
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు..
ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు తీసుకున్న డిప్యూటీ సర్వేయర్
ఈ విషయం కలెక్టర్, జేసీల దృష్టికి వెళ్లడంతో తాజాగా సస్పెన్షన్
కుప్పం, న్యూస్టుడే: చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు తెలుగుదేశం నాయకులు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరగా, డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ రూ.1.80 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఇవ్వడంతో దస్త్రం ముందుకు కదిలింది. గత నెల 25, 26వ తేదీల్లో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. దీనిపై కలెక్టర్ సుమిత్కుమార్, సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీయగా లంచం బాగోతం వెలుగు చూసింది. సర్వే శాఖ ఏడీ గౌస్బాషాతో శాఖాపరమైన విచారణ చేయించగా, డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ రూ.లక్ష డిమాండ్ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికే చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైనా విచారణ జరిపి.. అది కూడా నిజమేనని నిర్ధారించారు. ఈ అంశాలపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని సోమవారం జేసీ శ్రీనివాసులు సర్వే ఏడీని ఆదేశించారు. రాత్రి డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ఉన్నత విద్యామండలి
ఉన్నత విద్యా మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అమలు కావడం లేదు. వైకాపా ప్రభుత్వంలో నియమించిన వారే పని చేస్తుండడంతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. -
వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్మన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం బుధవారం కడప రిమ్స్కు తరలించారు. -
జప్తు చేసిన రూ.20 కోట్ల సామగ్రి మాయం!
వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. సెక్యూరిటీ గార్డు కాపలా ఉంటున్నారు.. కానీ లోపల యంత్రసామగ్రి మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. కనీసం కేసు నమోదు కాలేదు. -
ఐఏఎస్లూ.. పొలాలకు వెళ్లండి
ఐఏఎస్ అధికారులు కూడా సచివాలయం నుంచి పొలాలకు కదలాలని.. రైతులతో మాట్లాడాలని, సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు సలహాలు, సూచనలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. -
ప్రోత్సాహకాలు అందిస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. -
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం
రాబోయే వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మిగిలిన 6.75 లక్షల గృహాలను మార్చికల్లా పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు. -
ఎస్టీ గురుకులాల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం
మెగా డీఎస్సీ వల్ల గిరిజన గురుకులాల్లో పొరుగు సేవల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎలాంటి అన్యాయం జరగదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. -
టెట్, మెగా డీఎస్సీ సన్నద్ధతకు సమయం పెంపు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), మెగా డీఎస్సీ సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అభ్యర్థులు, వివిధ విద్యార్థి, -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సు తొలగింపు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సును కళాశాల విద్యాశాఖ మూసివేసింది. బీకాం కంప్యూటర్స్ ఒక్కటే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. -
పట్టిసీమ.. అన్నదాతల కొంగు బంగారం
‘పట్టిసీమ..సీఎం చంద్రబాబు దార్శనికతకు ప్రతిబింబం..పోలవరం పూర్తి చేసేలోగా వరద నీటిని ఒడిసి పట్టి కృష్ణా డెల్టాతోపాటు రాయలసీమను సస్యశ్యామలం చేస్తుంది. అంతటి బృహత్తర పథకాన్ని వైకాపా గాలికొదిలేసింది. -
ఎత్తిపోతల్లో ఎగసిన గోదారి!
నైరుతి పలకరించి నెల రోజులు గడిచినా కృష్ణాలో ప్రవాహాల్లేవు. గోదావరిలో మాత్రమే కాస్త వరద పారుతోంది. ఈ నీటి పాయలను బీళ్ల వైపు మళ్లించాలని.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నిర్ణయించారు. -
కలరా కలకలం..
గత వైకాపా ప్రభుత్వం రక్షిత నీటి పైపులైన్లకు కనీసం మరమ్మతులు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. కలరా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. -
అన్నవరం వేదపాఠశాల విద్యార్థులకు అతిసారం
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు బుధవారం అతిసారం బారినపడ్డారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన ఎనిమిది మందికి దేవస్థానం సిబ్బంది వైద్యసేవలు అందించారు. -
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా
ఈ నెల 27వ తేదీన నిర్వహించాల్సిన గ్రూప్-2 మెయిన్స్ను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. పరీక్ష నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
క్లబ్ హౌస్ యజమానికి అధికారుల దాసోహం
పులివెందులలో ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం పేరుతో కడప ఎంపీ అవివాష్రెడ్డి బావ, క్లబ్హౌస్ యజమాని విజయశేఖర్రెడ్డికి అయాచిత లబ్ధి చేకూర్చేందుకు అధికారులు అడ్డదారులు తొక్కారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు బుధవారం తన రాజీనామా లేఖను అందజేయగా ఆయన దానిని ఆమోదించారు. -
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి చేయనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. -
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
మీరేదైనా వాహనం కొంటే స్టిక్కరింగ్కు ఎంతవుతుంది? మహా అయితే రూ.2 వేల నుంచి రూ.5 వేలు. కానీ, వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశువైద్య సేవా వాహనాలకు రంగులు, జగన్ బొమ్మలు వేయించడానికి రూ.2.50 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా. -
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ ఏఓఆర్గా గుంటూరు ప్రమోద్కుమార్
సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వొకేట్ ఆన్ రికార్డ్ (ఏఓఆర్)గా గుంటూరు ప్రమోద్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ బుధవారం జీవో విడుదల చేసింది. -
1.81 లక్షల ఇంజినీరింగ్ సీట్లు
రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ), కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కలిపి 1,81,732 సీట్లకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్
-
జోగి కబ్జాలో... ఎవరి పాపం ఎంత?
-
వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
-
కన్నబిడ్డ కసిరింది.. కన్నపేగు కుమిలింది
-
ఆరు నెలల చిన్నారి చికిత్సకు.. ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
-
క్షమించండి.. నెలలో తిరిగిస్తా.. ఉత్తరం రాసి చోరీకి పాల్పడ్డ దొంగ