- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ramoji Rao: నిజాయతీ, నిర్భీతి మూర్తీభవించిన రామోజీ
సొంత కుటుంబసభ్యుల్ని బెదిరించినా పాత్రికేయ విలువల్ని కాపాడేందుకు రాజీపడకుండా నిలబడ్డ గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు.
పాత్రికేయ విలువల్ని కాపాడేందుకు కుటుంబాన్నీ పణంగా పెట్టారు
వ్యాపారాలపై దాడులు చేస్తున్నా వెనకడుగు వేయలేదు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
సొంత కుటుంబసభ్యుల్ని బెదిరించినా పాత్రికేయ విలువల్ని కాపాడేందుకు రాజీపడకుండా నిలబడ్డ గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. ఎవరైనా వారి కుటుంబసభ్యులకు ఇబ్బందులు తలెత్తితే నలిగిపోతారని.. రామోజీరావు మాత్రం వాటన్నింటినీ దాటుకుని ‘ఏది జరిగితే అది జరగనీ’ అంటూ ప్రజల కోసం నిర్భీతిగా, నిజాయతీగా నిలబడ్డారని ప్రశంసించారు. కుటుంబాన్ని పణంగా పెట్టి, అలా వెనక్కి తగ్గకుండా ఉండటానికి ఎంతో సాహసం కావాలని చెప్పారు. ‘విలువలు, అంకితభావంతో పత్రికాధిపతిగా కొనసాగుతూనే.. ఇతర వ్యాపారాలు చేస్తుంటే వాటిపై దాడులు చేయటం గిట్టని వారికి చాలా తేలిక. కానీ రామోజీరావు మాత్రం అలాంటి దాడులన్నింటినీ తట్టుకుంటూ పాత్రికేయుడిగా, పత్రికాధిపతిగా రాజీపడని ధోరణితోనే నడిచారు. ఆయన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసు. ఆయన నష్టపోవటానికైనా సిద్ధమయ్యారే తప్ప వెనకడుగు వేయలేదు’ అని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తిమంతమైన పాత్రికేయుడి విగ్రహాన్ని నెలకొల్పాలని పవన్ కల్యాణ్ అన్నారు.
ఎన్నికల్లో విజయ వార్త విన్నారా.. అని వాకబు చేశా
ఎన్నికల ఫలితాలు రావటానికి కొద్ది రోజుల ముందు రామోజీరావు ఆరోగ్యం క్షీణిస్తోందనే సమాచారం వచ్చింది. అరాచక పాలకులపై అంతులేని పోరాటం చేసిన ఆయన ఆ విజయవార్త వింటారా లేదా అని ఆలోచిస్తూ ఉండేవాణ్ని. ‘ఆయన పరమపదించే ముందు ఎన్నికల్లో ప్రజాస్వామ్య విజయవార్తను విన్నారా? అది ఆయన చెవిన పడిందా?’ అని రామోజీరావు కుటుంబసభ్యుల్ని వాకబు చేశా. ఈ విజయాన్ని 24 గంటలపాటు ఆయన సంపూర్ణంగా ఆస్వాదించారని వారు చెప్పారు. పోరాట ఫలితాన్ని చూశాక, తెలుసుకున్నాకే ఆయన పరమపదించటం తృప్తినిచ్చింది.
సమాచార హక్కు ఉద్యమకారుడు
ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రతిదీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం ఉద్యమాన్ని రామోజీరావు ‘ఈనాడు’ పత్రిక ద్వారా ముందుండి నడిపించారు. ప్రజలకు అండగా ఆయన చేసిన మహాయజ్ఞం చాలా జటిలమైనది. పత్రికా రంగంలోనే కాకుండా సినిమా నిర్మాణం సహా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారు.
ఎవరైనా సరే ప్రజల తర్వాతే..
జనం కోసం నిలబడే విషయంలో ఆయన నిర్ధాక్షిణ్యంగా, నిష్పక్షపాతంగా ఉండేవారు. పరిచయస్తులు, స్నేహితులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు ఎవరైనా సరే ఆయనకు ప్రజల తర్వాతే. ఆ ఆలోచన ధోరణే ‘ఈనాడు’లో ప్రతిబింబించేది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రామోజీరావు పరితపించారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఆయన స్థాపించిన ఈనాడు, ఈటీవీ సంస్థలు.. వార్తలు, కథనాల సమర్పణలో తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉంటాయి. చేసే పనిని బట్టే గుర్తిస్తాయి తప్ప ఎవరి పట్లా ప్రత్యేక అభిమానం ప్రదర్శించవు. తెదేపా, కాంగ్రెస్ ఇలా ఏ పార్టీ అయినా సరే వాళ్లు మంచి చేస్తే మంచి చేశారని, చెడు చేస్తే చెడు చేశారనే వార్తలిస్తాయి. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి సంఘటనలు, అంశాలనైనా సరే మొదటి పేజీలో ప్రాధాన్యతతో ప్రచురిస్తాయి. రామోజీరావు పాత్రికేయ వారసత్వ ప్రవాహాన్ని ప్రతి పాత్రికేయుడూ పుణికిపుచ్చుకోవాలి. ఆయనది అపరిమితమైన, అవిశ్రాంత, ఉద్ధృత ప్రవాహం. దానిలో నుంచి మనం ఎంతో తోడుకోగలమో అంతా తీసుకోవాలి. తెలుగు ప్రజలందరూ ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
నమ్మినదాన్నే త్రికరణశుద్ధిగా ఆచరించాలని నాతో చెప్పారు
నేను రాజకీయాల్లోకి వచ్చాక 2008లో మొట్టమొదటిసారి రామోజీరావును కలిశాను. ఆయన మాట్లాడే విధానం నిక్కచ్చిగా ఉంటుంది. ప్రజల పక్షపాతి. మాట్లాడుతున్నంతసేపూ.. పాత్రికేయ విలువల్ని కాపాడటానికే ఆయన ఉన్నారనిపించింది. ప్రజా క్షేమం, ప్రజా సంక్షేమం కోణంలోనే మా మధ్య చర్చ జరిగింది. 2019లో వారి కుటుంబసభ్యులతో కలిసి నన్ను భోజనానికి ఆహ్వానించారు. దేశ పరిస్థితులు, ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ఎంత కీలకమో చెబుతుంటే ఆయన మాటల్లోని ఆవేదన నాకు కనిపించింది. ‘మీరు వర్ధమాన రాజకీయ నాయకులు. మీకు ఆల్ ద బెస్ట్. జీవితంలో ఏ విషయంలోనూ రాజీపడొద్దు. ఏదైతే నమ్ముతారో దాన్ని త్రికరణ శుద్ధిగా చెయ్యండి’ అని నాకు ఉద్బోధించారు. అలాంటి మహానుభావుడి సంస్మరణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా రావటం ఆనందంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్ఫోన్లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. -
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్