- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chandra babu: రాజకీయ ప్రేరేపిత రౌడీషీట్లు ఎత్తేయండి
వైకాపా ఐదేళ్ల పాలనలో తెదేపా నేతలపై ఇష్టారాజ్యంగా పెట్టిన రౌడీషీట్లను ఎత్తేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
రాష్ట్రంలో నేరాల శాతం సున్నాగా ఉండాలి
అధికారులు వేగంగా, సమర్థంగా పనిచేయాలి
కుప్పంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు
అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈనాడు, చిత్తూరు: వైకాపా ఐదేళ్ల పాలనలో తెదేపా నేతలపై ఇష్టారాజ్యంగా పెట్టిన రౌడీషీట్లను ఎత్తేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిజమైన రౌడీషీటర్ల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో నేరాల శాతం సున్నాగా ఉండాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు బుధవారం ఆర్అండ్బీ అతిథిగృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం గుడుపల్లె మండలం నలగంపల్లెలోని డిగ్రీ కళాశాలలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2019 ఎన్నికలకు ముందు నాపై ఎటువంటి కేసులు లేవు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏకంగా 22 కేసులు నమోదు చేశారు.
అందులో రెండు హత్యాయత్నం ఘటనలూ ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలకు తలొగ్గే పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారు. ఐదేళ్లలో కొందరు అధికారులు మనసు చంపుకొని పనిచేశారు. వైకాపా నేతల పైశాచికానందానికి సహకరించారు. చివరకు నా సొంత నియోజకవర్గం కుప్పానికీ రాలేని పరిస్థితిని కల్పించారు. రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు తెలుగుదేశం శ్రేణులపై రౌడీషీట్లు తెరిచారు. వ్యవస్థలు విధ్వంసం కావడాన్ని చూసి చాలా బాధపడ్డా. కూటమి పాలనలో ఎవరిపైనా అనవసరంగా కేసులు పెట్టొద్దు.. రౌడీషీట్లు తెరవద్దు. రాజకీయ ప్రోద్బలంతో తెలుగుదేశం శ్రేణులపై పెట్టిన షీట్లను ఎత్తేయండి’ అని పోలీసులను ఆదేశించారు.
పేదరిక నిర్మూలనకు కుప్పం నుంచే శ్రీకారం
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కుప్పం నుంచే శ్రీకారం చుట్టానని చంద్రబాబు చెప్పారు. తొలి అడుగు ఇక్కడి నుంచే పడాలని ఆకాంక్షించారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఏయే పనులు చేయాలి? ఎంత నిధులు అవసరం? ఎంత సమయం పడుతుందో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సుమిత్కుమార్, జేసీ శ్రీనివాసులును ఆదేశించారు. అభివృద్ధిలో దేశానికే కుప్పం తలమానికంగా ఉండాలని, నెలల వ్యవధిలోనే ఇక్కడ మార్పు కనిపించాలని నిర్దేశించారు. కుప్పం ప్రజల ఆర్థిక స్థితిని సర్వే ద్వారా తెలుసుకుని, వారి ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.
సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్
‘గత ప్రభుత్వ పాలనకు.. ఇప్పటి పాలనకు చాలా వ్యత్యాసం ఉండబోతోంది. వైకాపా హయాంలో మాదిరిగా బలవంతపు జనసమీకరణతో పెద్దపెద్ద సమావేశాలు, భారీ కాన్వాయ్లతో సైరన్ల మోత, హంగామా ఇప్పుడు ఉండవు. సాయంత్రం ఆరు గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకూ చెప్పా. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం. సాంకేతికతను అధికారులు అందిపుచ్చుకోవాలి. భౌతిక, వర్చువల్ పని విధానానికి సిద్ధంగా ఉండాలి. వేగంగా, సమర్థంగా పనిచేయాలి. ప్రజల వినతులు పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. డ్వాక్రా మహిళలను లక్షాధికారులుగా ఎలా చేయాలో నేను ఆలోచిస్తున్నా. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ప్రధాని మోదీ ప్రణాళికలు రూపొందించారు. దానికి దశాబ్దానికి ముందే ఆంధ్రప్రదేశ్లో ఈ లక్ష్యాన్ని సాధించాలి. మనిషి తలచుకోవాలే కానీ అసాధ్యమన్నదే లేదు. అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుని పనిచేయాలి. వైకాపా పాలనలో రైతులకు బిందు, తుంపర సేద్యం పరికరాలు ఇవ్వలేదు. దీంతో అన్నదాతలు నష్టపోయారు. కూటమి హయాంలో కర్షకులకు అండగా ఉంటాం. సౌర, పవన విద్యుత్తును ప్రోత్సహించి ప్రజలే విద్యుత్తు అమ్మేలా చర్యలు తీసుకుంటాం. తద్వారా కాలుష్యం కూడా తగ్గుతుంది’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పోలీసులకు తొలగని వైకాపా వాసనలు
చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కుప్పంలో ప్రజలు, తెదేపా కార్యకర్తలు స్వేచ్ఛగా ఆయన్ను కలుసుకుని సమస్యలు చెప్పుకొనేవారు. ప్రస్తుత పర్యటనలో మాత్రం కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపారు. జగన్ పాలన నాటి వాసనలను ఇంకా తొలగించుకోలేదు. కుప్పంలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో సైతం తాను ప్రయాణిస్తున్నా పక్కనే సామాన్యులు వాహనంలో వెళ్లే వ్యవస్థ ఉండాలని పోలీసులకు సూచించినా వారిలో మార్పు రాలేదు. ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వాలని తరలివచ్చిన వందల మందికి పోలీసులు ఆటంకం కలిగించారు. దీంతో ముఖ్యమంత్రిని కలవడం ప్రజలకు కష్టంగా మారి, చాలా మంది కలెక్టర్కే వినతులు ఇచ్చారు. డిగ్రీ కళాశాల, పీఈఎస్ కళాశాల వద్ద సైతం పోలీసులు ఇలాగే అత్యుత్సాహం ప్రదర్శించారు.
పనిచేసే కార్యకర్తలకే పదవులు
కుప్పంలో తెదేపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
అనంతరం పీఈఎస్ వైద్య కళాశాలలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ‘నా వెంట తిరిగే వారికి కాకుండా పనిచేసే కార్యకర్తలకు పదవులు ఇస్తా. కులమతాల పట్టింపు లేకుండా ప్రోత్సహిస్తా. గత ఐదేళ్లలో ఎవరెవరిపై కేసులు పెట్టారో.. ఆ వివరాలు అందిస్తే చట్టపరంగా తొలగించేందుకు పార్టీపరంగా ప్రయత్నిస్తా. భవిష్యత్తులో వైకాపా నాయకులు తెలుగుదేశం కార్యకర్తల జోలికి రావాలంటేనే భయపడేలా చేస్తా. 2029 ఎన్నికల్లో కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ సాధించేందుకు అంతా కృషి చేయాలి’ అని తెలుగుదేశం కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సాయంత్రం ఆయన విజయవాడ బయలుదేరి వెళ్లారు. కార్యక్రమాల్లో మంత్రి రాంప్రసాద్రెడ్డి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్, భానుప్రకాష్, నాయకులు దొరబాబు, సీఆర్ రాజన్, శ్రీధర్వర్మ, పెందుర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైన తెదేపా నాయకులు, కార్యకర్తలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
రాష్ట్రంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణను హైకోర్టు తప్పుపట్టింది. -
అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?
‘అరకొర సొమ్ము చేతిలో పెట్టి విడాకులు తీసుకుంటే.. రేప్పొద్దున్న భార్య, పిల్లలు ఎలా బతుకుతారు.. ఇదేం పరిష్కారం?’ అని గుంటూరు నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్బాబు విస్మయం వ్యక్తంచేశారు. -
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు!
పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగప్రవేశం చేశారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం దిల్లీ చేరుకున్నారు. -
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జులై 1వ తేదీ నుంచి కార్గో సేవలు పునఃప్రారంభం కానున్నాయి. కార్గో సర్వీసుకు 2021లో ముందడుగు పడినప్పటికీ కరోనా కారణంగా నిలిచిపోయాయి. -
జేఈఈ 8వ ర్యాంకర్కు రూ.1.60 కోట్ల పురస్కారం
విజయవాడ ఫిట్జి కళాశాల విద్యార్థి కోడూరు తేజేశ్వర్ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించినందుకు కళాశాల యాజమాన్యం రూ.1.60 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. -
అమరావతి పనులు పట్టాలెక్కించేందుకు సన్నాహాలు
ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు అవసరమైన సన్నాహాల్ని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చేస్తోంది. -
పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ కన్నుమూత
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్(76) కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యేకాలనీలోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. -
మాస్టారూ.. మీరే మీరే మాస్టారు!
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 39 ఏళ్లు వ్యాయామోపాధ్యాయునిగా పనిచేసిన తూము హన్మంతరావు చివరిగా సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. -
మీ భద్రత మా బాధ్యత
సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. -
స్టీల్ప్లాంటును జరిపేసి.. రాజధాని కట్టేద్దామన్నారు!
జగన్ లాంటి విపరీత, విధ్వంసకర ఆలోచనలు ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారని.. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఎదురైన అనుభవాలు మరోసారి రుజువు చేశాయి. -
దారి ఇస్తారా.. ఇక్కట్లు కొనసాగిస్తారా?
పదవి ఏదైనా ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం ఉపయోగించాలి. జగన్ మాత్రం అధికారం అండతో తన నివాసం పరిసరాల వారిని ఇబ్బందులకు గురిచేశారు. -
పదవి కాదు.. బాధ్యత
‘ఎంతో కీలకమైన పదవి ఇచ్చారు. ఇది ఉత్తరాంధ్రకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా. దీన్ని పదవిగా కాకుండా బాధ్యతగా నిర్వర్తిస్తా’ అని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. -
కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలుపైనే తొలి సంతకం: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సుభాష్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలు పైనే తొలి సంతకం చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. -
జీజీహెచ్ అభివృద్ధికి ఆర్థిక సహకారం: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో (జీజీహెచ్) మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందిస్తామని గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
లోక్ అదాలత్కు భారీ స్పందన 14,389 కేసుల పరిష్కారం
రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లకు భారీ స్పందన లభించింది. 14,389 పైగా కేసులు పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.49.36 కోట్ల పరిహారం అందజేశారు. -
నాగార్జున వర్సిటీ వీసీ రాజీనామా
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.రాజశేఖర్ ఎట్టకేలకు శనివారం రాజీనామా చేశారు. విషయం తెలుసుకున్న వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. -
తిరుమలలోని శారదా పీఠం భవనాలు సీజ్ చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మించిన భవనాలను సీజ్ చేయాలని శ్రీఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. -
ఇదీ సంగతి!
-
మా భవనాలపై దాడులు జరగకుండా నియంత్రించండి
వైకాపా కార్యాలయాల కోసం నిర్మిస్తున్న భవనాలపై దాడులు జరపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని గవర్నర్కు వైకాపా నేతలు విజ్ఞప్తి చేశారు. -
జోగి కుటుంబం కబ్జాపై డీజీపీకి నివేదిక
అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో మాజీ మంత్రి, వైకాపా నాయకుడు జోగి రమేష్ కుటుంబం పాత్రపై డీజీపీ కార్యాలయానికి ప్రాథమిక నివేదిక చేరింది. -
‘అనంతబాబుపై నమోదైన హత్య కేసును.. ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలి’
ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసును ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇంకా పోని వైకాపా వాసనలు.. కుర్చీ వదలని ఉపకులపతి..!
-
విశ్వవిజేత.. భారత్కు దక్కిన ప్రైజ్మనీ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం.. సీఎం రేవంత్ చొరవతో అంగీకరించిన కేంద్రం
-
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
-
అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?