Chandrababu: పెనుమాకలో పింఛన్లు ఇవ్వనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం చేపట్టనున్న ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు.

Published : 01 Jul 2024 04:11 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం చేపట్టనున్న ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ఉదయం 6 గంటలకు కాలనీలో స్వయంగా ఆయనే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేస్తారు. అనంతరం 6:30 గంటలకు గ్రామంలోని మసీదుసెంటర్‌ వద్ద నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రామస్థులు, లబ్ధిదారులతో మాట్లాడతారు. 

పెనుమాకలో ప్రజావేదిక కోసం ఏర్పాటు చేసిన రెయిన్‌ ప్రూఫ్‌ టెంట్లు 

సిద్ధమైన వేదిక


గొల్లప్రోలులో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మూడు రోజుల కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఉదయం 9.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి నియోజకవర్గ జనసేన నాయకులతో సమావేశమవుతారు. ఈ నెల 2న కాకినాడ కలెక్టరేట్‌లో కీలక శాఖలతో సమీక్ష నిర్వహిస్తారు. 3న ఉదయం ఉప్పాడ తీరంలో సముద్ర కోత సమస్యను పరిశీలిస్తారు. పిఠాపురంలో అదే రోజు సాయంత్రం వారాహి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని