- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chandrababu: అమరావతిని బంగారం చేస్తాం
అమరావతిపై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్ ప్రభుత్వం.. రాజధాని బ్రాండ్ ఇమేజ్ను సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన జరిగి పదేళ్లయినా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ కక్షగట్టి దాన్ని బూడిద చేశారు
అక్కడి నుంచే పునరుద్ధరిస్తాం
ప్రజలు, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తిరిగితెస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
మతిలేనివాళ్లే రాజధానిని మారుస్తామంటారని ధ్వజం
అమరావతిపై శ్వేతపత్రం విడుదల
పునర్నిర్మాణానికి కంకణం
ఈనాడు - అమరావతి
రాజధాని అమరావతిపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతిపై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్ ప్రభుత్వం.. రాజధాని బ్రాండ్ ఇమేజ్ను సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన జరిగి పదేళ్లయినా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ లాంటి మతిలేనివారు తప్ప రాజధానిని మారుస్తానని ఎవరూ అనరని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం బూడిదగా మార్చిన ప్రాంతం నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతామని, అమరావతి బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ప్రజలు, పెట్టుబడిదారుల్లో అమరావతిపై మళ్లీ నమ్మకం కలిగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రాజధానిలో చేసిన విధ్వంసం, భవిష్యత్ కార్యాచరణపై ఆయన బుధవారం సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేసి, పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయింది
‘గత ఐదేళ్లలో అమరావతి ప్రతిష్ఠ మసకబారింది. 2019కి ముందు అమరావతికి నిధుల సమీకరణకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో బాండ్లు విడుదల చేస్తే.. గంటల వ్యవధిలో రూ.2 వేల కోట్లు వచ్చాయి. అప్పట్లో రేటింగ్ ఏజెన్సీలు అమరావతి బాండ్లకు ఏ+, ‘ఏఏ’ రేటింగ్లు ఇచ్చాయి. ఇప్పుడు ఆ రేటింగ్ సీ, బీబీ+కి పడిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కల్పించే రాజధాని నగరం లేకపోవడం వల్ల యువత వలస పోతున్నారన్నారని, భావితరాల భవిష్యత్ సర్వనాశనమైందని విచారం వ్యక్తం చేశారు. ‘జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని దెబ్బతీసే కుట్రను అమల్లోకి తెచ్చింది. ఎక్కడి పనులు అక్కడ నిలిపేసింది. రూ.వేల కోట్ల వ్యయంతో చేసిన నిర్మాణాల్ని గాలికొదిలేసింది. రాజధాని రైతులు, ప్రజలు 1631 రోజులు ఉద్యమం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకొచ్చి భూములిచ్చిన రైతులపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. తీవ్ర వేధింపులకు, అణచివేత చర్యలకు పాల్పడింది. రాజధానిలో 1,197 ఎకరాల భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ ఉపసంహరించింది. 2,903 మంది రైతులకు కౌలు, 4,422 మందికి కౌలు రద్దు చేసింది. మౌలిక వసతుల నిర్మాణ పనుల అంచనా వ్యయాన్ని రూ.3 వేల కోట్లకు కుదించింది. స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకున్న సింగపూర్ కన్సార్షియంపై అసంబద్ధ ఆరోపణలు మోపి, తరిమికొట్టింది. కేంద్ర ప్రభుత్వానికి లేనిపోని ఫిర్యాదులు చేసి కేంద్ర సాయం రాకుండా చేసింది. సీఆర్డీఏ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులోని ఫ్లాట్లన్నీ అప్పట్లో క్షణాల్లో బుక్ అయిపోయాయి. ఆ ప్రాజెక్టు పూర్తయితే సీఆర్డీఏకి రూ.57.37 కోట్లు లాభం వచ్చేది. కానీ జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఇప్పుడు ఆ ప్రాజెక్టులో రూ.164.5 కోట్ల నష్టం వస్తుంది’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
రూ.20, 30 వేల కోట్ల ఆదాయం వచ్చేది
రాజధానిలో మౌలిక వసతులు, నిర్మాణాలపై ప్రభుత్వమే రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టేలా అప్పట్లో ప్రణాళికలు రూపొందించామని, అది ఆచరణలోకి వస్తే ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.20-30 వేల కోట్ల ఆదాయం వచ్చేదని తెలిపారు. ‘రాజధానిలోని ఎస్ఆర్ఎం, విట్ వంటి యూనివర్సిటీల్లో చదువుకున్న పేద పిల్లలకు ఏడాదికి రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తున్నాయి. రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే.. అలాంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు అనేకం వచ్చేవి. రాజధానిలో అన్ని అవసరాలకూ పోగా ప్రభుత్వం వద్ద 8 వేల ఎకరాలు మిగులుతుంది. ఆ భూమి విలువ 2019లోనే ఎకరం రూ.10 కోట్లు. రాజధాని నిర్మాణం కొనసాగించి ఉంటే ఎకరం విలువ ఈపాటికే రూ.20 కోట్లకు చేరేది. అలా ప్రభుత్వం వద్ద రూ.1,60,000 కోట్ల విలువైన సంపద ఉండేది. రాజధాని నిర్మాణానికి నిధుల కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చేది కాదు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిచ్చారు.
రాజధాని అమరావతిపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
రాజధానిని మార్చకుండా చట్టపరంగా చర్యలేమైనా చేపడతారా?
అది కచ్చితంగా ఆలోచించాల్సిన అంశమే.
అమరావతి నిర్మాణం పూర్తికి లక్ష్యాలేమైనా నిర్దేశించుకున్నారా?
లక్ష్యాలు నిర్దేశించుకుని కట్టడానికి అది ఒక భవనం కాదు. ఒక వ్యక్తో, కంపెనీనో చేసేది కాదు. నగర నిర్మాణమనేది అనేక మంది భాగస్వామ్యంతో దశలవారీగా జరిగే నిరంతర ప్రక్రియ.
రాజధానిలో స్థలాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల మాటేంటి?
132 సంస్థలకు స్థలాలిస్తే ఐదారు తప్ప మిగతావి రాలేదు. వాటితో మాట్లాడి, ఒప్పించే ప్రయత్నాలు ప్రారంభించాం. ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ సంస్థకు అప్పట్లో మా ప్రభుత్వం మంగళగిరి వద్ద స్థలం కేటాయించింది. జగన్ ప్రభుత్వం నీళ్లు కూడా ఇవ్వకపోవడంతో.. 950 పడకలతో నడవాల్సిన ఎయిమ్స్లో ఇప్పుడు 300 పడకలు మాత్రమే ఉన్నాయి.
స్టార్టప్ ఏరియా అభివృద్ధికి మళ్లీ సింగపూర్ కన్సార్షియమ్ను ఆహ్వానిస్తారా?
అమరావతి అభివృద్ధికి మేం ప్రపంచంలోని ఉత్తమ సంస్థల్ని తీసుకొస్తే జగన్ ప్రభుత్వం అందర్నీ తరిమేసింది. ఆ కంపెనీలు మళ్లీ వస్తాయా, లేదా అన్నది చూడాలి. మా ప్రయత్నం మేం చేస్తాం.
రాజధాని రైతులకు కౌలు చెల్లింపు గడువు పొడిగిస్తారా?
దీనిపై ఆలోచించి, వారికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటాం. రైతులపై జగన్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించేందుకు చర్యలు చేపడతాం. అమరావతి పరిరక్షణకు వారంతా ఐదేళ్లు పోరాడారు. విరాళాలు సేకరించి, ఆస్తులు అమ్ముకుని న్యాయపోరాటం చేశారు. వారికి కచ్చితంగా న్యాయం చేస్తాం.
ఆర్-5 జోన్పై ప్రభుత్వం ఆలోచనేంటి?
ఏ ఊరివాళ్లకు అక్కడ ఇంటి స్థలం ఇస్తే ఉపయోగం ఉంటుంది. ఆర్-5 జోన్లో గత ప్రభుత్వం స్థలాలు ఇచ్చినవారిలో అర్హులకు వారి ప్రాంతాల్లో స్థలాలిచ్చి, ఇళ్లు కట్టిస్తాం.
యంత్రాంగం డల్ అయిపోయింది
జగన్ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘నేను నాలుగోసారి ముఖ్యమంత్రినయ్యాను. కానీ ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. నేను మొదటిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు అధికారులంతా చాలా ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో ఉండేవారు. వరుసగా రెండోసారి నేనే సీఎంనయ్యాను కాబట్టి తేడా ఏమీ రాలేదు. మూడోసారి రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రినయ్యాను. సవాలక్ష సవాళ్లున్నా పరిగెత్తే యంత్రాంగం ఉండేది. ఇప్పుడు యంత్రాంగం డల్ అయిపోయింది. అలవాట్లు మారిపోయాయి. వ్యవస్థ మొత్తం విధ్వంసమైంది’ అని ఆయన పేర్కొన్నారు.
రాజధాని బ్రాండ్ ఇమేజ్ని పునరుద్ధరిస్తాం
రాజధాని విధ్వంసాన్ని చూసి నాకంటే బాధపడేవారు ఇంకెవరూ ఉండరు. శంకుస్థాపన సమయంలో హెలికాప్టర్లో రెండు రోజులు తిరిగి అమరావతిలోని ప్రతి అంగుళంలోనూ పవిత్రమైన జలాల్ని, మట్టిని చల్లాను. రాజధాని నిర్మాణానికి ఎలాంటి దుష్టశక్తులు అడ్డుపడకూడదని అనుకున్నాను. ఎన్ని చేసినా దుష్టశక్తుల నుంచి అమరావతిని కాపాడుకోలేకపోయాం. నాశనమైన అమరావతి బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరిస్తా. దిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వంతో అమరావతి సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలపై మాట్లాడతాం. మేం ఎన్డీయేలో భాగస్వాములం. కేంద్ర సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభిస్తాం.
పవర్పాయింట్ ప్రజంటేషన్లో చంద్రబాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమరావతి ఓఆర్ఆర్కు పచ్చజెండా
రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. -
రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం
గత ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. -
కోట్ల ప్రజాధనం.. వైఎస్ విగ్రహాలపాలు
ఇడుపులపాయలోని వైఎస్సార్ స్మారక రాజీవ్ నాలెడ్జి వ్యాలీలో ఏర్పాటు చేసిన రాజశేఖర్రెడ్డి విగ్రహాలు ఎన్నో తెలుసా? మొత్తం 23. -
సీమ ముఖచిత్రం మార్చనున్న హైదరాబాద్ - బెంగళూరు హైవే
రాయలసీమ ముఖచిత్రం త్వరలో మారిపోనుంది. గతంలో ఎన్నడూలేనంతగా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు కళకళలాడనున్నాయి. -
ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
రాష్ట్ర సమస్యల పరిష్కారం దిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. -
పోతేపోనీ అని వదిలేశారు!
గత జగన్ ప్రభుత్వ నిర్వాకంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ. 250 కోట్ల నిధుల్ని రాష్ట్ర పోలీసు శాఖ కోల్పోయింది. -
ఇద్దరు తెలుగు సీఎంల భేటీ నేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం ముఖాముఖి భేటీ కాబోతున్నారు. -
సహకార సంఘాలకు వైకాపా చెదలు
వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలోని అధికశాతం సహకార బ్యాంకుల్ని ఊడ్చేశారు. రుణాల పేరుతో ఎడాపెడా కొల్లగొట్టారు. -
ప్రజాదర్బార్కు వినతుల వెల్లువ
రాష్ట్ర మానవవనరులు, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్కు.. మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించారు. -
హమ్మయ్య.. ఈ చెట్లు బతికిపోయాయి
రహదారిపై పందిరి వేసినట్లు కనువిందు చేస్తున్న ఈ దృశ్యం.. రాజధాని అమరావతిలోనిది. నేలపాడులో హైకోర్టు ఎదుట రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లు సుందరంగా కనిపించడమే కాదు.. దారెంట నీడనిస్తున్నాయి. -
పవన్కల్యాణ్ వారాహి దీక్షోద్వాసన
ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వారాహి ఏకాదశ దీక్ష శుక్రవారం కలశోద్వాసన క్రతువుతో ముగించారు. -
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి బాధ్యులెవరు?
‘అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఉన్న అధికారులు ఎవరు? పింఛా ప్రాజెక్టు నిండిపోయి అన్నమయ్యకు అంచనాకు మించి వరద వస్తుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారు? -
రాజధాని నిర్మాణానికి తొలి వేతనం విరాళం
విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్సభ సభ్యుడిగా అందుకున్న తొలి గౌరవ వేతన మొత్తం రూ.1.57 లక్షలను అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. -
తితిదే నిర్ణయించిన ధరలకే ఆహారమందిస్తాం
తిరుమలలోని ఏపీ టూరిజం హోటళ్లలో తితిదే నిర్ణయించిన ధరలకే నాణ్యమైన ఆహారం అందిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న టాటా గ్రూప్ ఛైర్మన్, రేమండ్స్ సీఎండీ
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం బ్రేక్ దర్శన సమయంలో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, రేమండ్స్ గ్రూప్ సీఎండీ గౌతమ్ సింఘానియా వేర్వేరుగా దర్శించుకున్నారు. -
ద్వారంపూడి సంస్థకు షోకాజ్ నోటీసులివ్వండి
కాకినాడ నగర వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. -
పేదల భూముల్ని చౌకగా కొట్టేశారు
పేదలకు ఇచ్చిన ఎసైన్డ్ భూములను వైకాపా పెత్తందార్లు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కుల కల్పనపై గత వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి, తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. -
ధ్రువపత్రాలు ఎందుకు అందించలేదో వివరణ ఇవ్వండి
మాజీ మంత్రి, వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ జడ్జి ఎస్.రామకృష్ణ 2021లో వేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన కేసులో దిగువ కోర్టు ధ్రువపత్రాలు(సర్టిఫైడ్ కాపీలు) ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. -
9, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. -
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాల సమయంలోనూ రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో శుక్రవారం 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. -
ఎర్రచందనం దందాలో పెద్ద తలకాయల్ని పట్టుకోండి
ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖాధికారులను ఆదేశించారు.