- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chandrababu: మీ భద్రత మా బాధ్యత
సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
మీ ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యం
ఆర్థిక సమస్యలున్నా మీ సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకున్నాం
పెంచిన పింఛనుతో ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నా
సామాజిక భద్రత పింఛనుదారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
ఈనాడు, అమరావతి: సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ముందడుగు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్టు పింఛను మొత్తాన్ని ఒకేసారి రూ.1000 పెంచామని, ఇకపై నెలనెలా రూ.4వేలు అందిస్తామని పేర్కొన్నారు. దివ్యాంగులకు రూ.3వేలు పెంచి ఇకనుంచి రూ.6వేలు అందిస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పథకం పేరుతో ఇక పింఛన్లను అందించనున్నట్టు వివరించారు. పెంచిన పింఛను మొత్తాన్ని జులై 1న లబ్ధిదారుల ఇళ్ల వద్దే ప్రభుత్వం అందించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక భద్రత పింఛనుదారులకు లేఖ రాశారు. అందులో సారాంశం ఆయన మాటల్లోనే..
మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఇది
‘మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే, మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు, ఆకాంక్షలతో మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా మీ ఈ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 28 కేటగిరీలకు చెందిన 65,18,496 మంది లబ్ధిదారులకు జులై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తాం. కొత్త ప్రభుత్వం ముందు ఆర్థిక సమస్యలున్నా... మీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే మీకు మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.
మీ కష్టాలు చూసి చలించిపోయా
‘ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికారపక్షం మిమ్మల్ని పింఛను విషయంలో ఎంతో క్షోభకు గురిచేసింది. ఆ మూడు నెలలు పింఛను తీసుకోడానికి మీరు పడిన కష్టాలు చూసి నేను చలించిపోయా. మండుటెండలో, వడగాలుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి ఏప్రిల్ నుంచే పింఛను పెంపును వర్తింపజేస్తామని మాటిచ్చా. ఆ మాటను నెరవేరుస్తూ ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపును వర్తింపజేసి నగదు అందిస్తున్నాం. మూడు నెలలకు పెంచిన రూ.3 వేలు, జులై నెల పింఛను రూ.4వేలు కలిపి మొత్తం రూ.7వేలు మీ ఇంటివద్దకే తెచ్చి అందిస్తున్నాం’ అని వెల్లడించారు.
ఎన్నడూ లేని విధంగా పింఛన్ల పంపిణీ
‘పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై ఇకపై నెలకు రూ.819 కోట్ల భారం పడుతుంది. గడిచిన మూడు నెలలకు పెంపును వర్తింపజేేస్తామన్న హమీని నెరవేర్చేందుకు మరో రూ.1,650 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నాం. మీ శ్రేయస్సు కోసం ఆలోచించే మీ ప్రజాప్రభుత్వం.. దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా జులై 1న రూ.4,408 కోట్లను పింఛన్ల రూపంలో మీకు అందిస్తోంది. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛను విధానానికి ఆద్యుడు అయిన ఎన్టీఆర్ పేరుతో ‘ఎన్టీఆర్ భరోసా పథకం’గా సామాజిక భద్రత పింఛన్లు ఇకపై మీ ఇంటి వద్దే పంపిణీ చేస్తాం. పెరిగిన పింఛనుతో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాం. మీరు, మీ కుటుంబసభ్యులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. మీకు ఎల్లప్పుడూ మంచి చేయాలని చూసే ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నా’ అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
పింఛను నగదుతో పాటు లేఖ
పింఛనుదారులకు సోమవారం పింఛను నగదుతో పాటు ఈ లేఖనూ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందించనున్నారు. ఏప్రిల్ నుంచే పెంచిన పింఛను అమలు చేయనున్నందున పింఛనుదారులకు ఎంత పింఛను అందిందో తెలుసుకునేందుకు వారికి రసీదు కూడా ఇస్తారు. మరో రసీదులో లబ్ధిదారుల సంతకం తీసుకుని సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి నివేదించాలి.
పింఛను పండగకు నగదు సిద్ధం
జులై ఒకటిన ‘సామాజిక పింఛను పంపిణీ’ పండగలా నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 30న ఆదివారం కావడం.. సోమవారమే పింఛను ఇవ్వాల్సి రావడంతో ఆయా గ్రామాలకు శనివారమే నగదు తరలింపు చేపట్టింది. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండల కేంద్రంలో అధికారులు శనివారం బ్యాంకు నుంచి నగదు డ్రా చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వాటిని తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జులై 1న రూ.7 వేల పింఛను అందజేయనున్నారు.
న్యూస్టుడే, ధర్మవరం పట్టణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ నివాసం వెనుక రోడ్డులో.. అడ్డంకుల తొలగింపు
వైకాపా హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురిచేశారు. -
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
రేషన్ సరకులు పంపిణీ చేసే వ్యాన్లపై మాజీ సీఎం జగన్ బొమ్మలు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా, పాటించకపోవడంపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఊరువాడా ‘కొత్త పింఛన్ల కళ’
రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా వాడవాడలా సోమవారం పింఛన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛనుదారుల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.7 వేల చొప్పున పింఛన్ను లబ్ధిదారులకు అందించింది. -
నిరుపేద ఇంటికి చంద్రన్న ‘భరోసా’
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాకలో ఉండే బాణావత్ పాములు నాయక్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆ కుటుంబానికి తొలి పింఛను అందజేశారు. -
నీళ్లలో ఉన్నా డయాఫ్రం వాల్కు ఏం కాదు
‘పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్పై వరద నీరు ప్రవహంచినంత మాత్రాన ఆ కట్టడానికి ఏమీ కాదు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదు’ అని అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వ్యాఖ్యానించారు. -
విభజన సమస్యలు పరిష్కరించుకుందాం
విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6న హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి.. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం లేఖ రాశారు. -
ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టెట్ నోటిఫికేషన్ను సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది. పేపర్-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్-1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. -
ఇలా తిందాం.. పదికాలాలు పచ్చగా ఉందాం
తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. -
ఫోన్పే, గూగుల్పే ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు ఇక కుదరదు
ఫోన్పే, గూగుల్పే, పేటీఎం తదితŸర యూపీఐ యాప్ల ద్వారా ఇప్పటి వరకు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు షాక్ తగిలింది. ఈ నెల నుంచి వాటి ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. -
95 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
‘చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు 95 శాతం మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశాం. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల్లోపు 61,76,188 మందికి, రూ.4,169.49 కోట్లు అందించాం. -
రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి ఎగుమతి!
కాకినాడలో రేషన్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పేదల బియ్యాన్ని నూకలుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు రెండు రోజులుగా పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు నిర్వహించిన దాడుల్లో బట్టబయలైంది. -
స్తంభించిన దేవాదాయశాఖ వెబ్సైట్
దేవాదాయశాఖకు చెందిన వెబ్సైట్ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి నిలిచిపోయింది. దీంతో వివిధ ప్రధాన ఆలయాల్లో దర్శనాలు, పూజలు తదితరాలకు ఆన్లైన్లో ముందే టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు గందరగోళానికి గురయ్యారు. -
నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్
ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ ప్రవేశాల కౌన్సెలింగ్కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్కు మంగళవారం నుంచి ఈ నెల 10 వరకు అవకాశం కల్పించింది. -
ఆరోగ్యశాఖ ఉద్యోగుల వివరాలివ్వండి: మంత్రి సత్యకుమార్
ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వివరాలు పంపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు. -
ప్రభుత్వం మారినా ఉన్నత విద్యామండలిలో వారిదే పెత్తనం
ప్రభుత్వం మారినా ఉన్నత విద్యామండలి నిర్వహణ గాడిన పడలేదు. అధికారుల బెదిరింపులు, పాతవారి పెత్తనం కొనసాగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చంద్రబాబు చిత్రపటానికి ఎంపీల పాలాభిషేకం
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలు, దివ్యాంగులకు ఏప్రిల్ నుంచి పెంచిన పింఛను అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి తెదేపా ఎంపీలు సోమవారమిక్కడ పాలాభిషేకం చేశారు. -
ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు అంతా సిద్ధం
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. -
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ముంగిళిపట్టు పంచాయతీలో పింఛన్ల అక్రమ బాగోతం వెలుగు చూసింది. వైకాపా సర్పంచి జాగర్లమూడి భారతి దంపతులతోపాటు మరో 20 మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు తెదేపా నాయకులు వెల్లడించారు. -
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం!
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. -
‘స్టాప్ డయేరియా’పై విస్తృత అవగాహన
డయేరియా మహమ్మారి పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రానున్న రెండు నెలల పాటు పల్లెల్లో, మురికివాడల్లో ‘స్టాప్ డయేరియా’ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. రెండున్నరేళ్ల తర్వాత కదిలిన పోలీసులు
తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా మూకల దాడి ఘటనలో రెండున్నరేళ్ల తర్వాత పోలీసులు కదిలారు. నాటి వైకాపా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హింసాకాండపై ఇన్నాళ్లూ కనీసం చర్యలు తీసుకోని పోలీసులు..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం