- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
CM Chandrababu: రివర్స్ టెండర్లలో ఆదా వట్టిదే
‘‘జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైంది. 2020 జులై నుంచి 2024 జూన్ వరకు ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్ పనులు ఏవీ చేయలేదు.
అదనపు పనులతో రూ.2,268 కోట్ల అదనపు భారం
2019 వరదల్లో డయాఫ్రం వాల్కు ఏమీ కాలేదు
2020 వరదల్లోనే విధ్వంసం
2023 వరకు నష్టంపై అధ్యయనమే లేదు
పోలవరంపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం
2028 జూన్కు తొలిదశ పూర్తి
ఈనాడు, అమరావతి: ‘‘జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైంది. 2020 జులై నుంచి 2024 జూన్ వరకు ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్ పనులు ఏవీ చేయలేదు. గుత్తేదారును మార్చడం వల్ల రివర్స్ టెండర్లతో నిధులు ఆదా చేశామని చెబుతున్నా తర్వాత అదే గుత్తేదారుకు అదనపు పనులు ఇవ్వడంతో రూ.2,268 కోట్ల అదనపు భారం పడింది. సకాలంలో ఎగువ కాఫర్ డ్యాం ఖాళీలను పూడ్చకపోవడంతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యాం ప్రాంతం అగాధాలతో నిండిపోయింది. ప్రాజెక్టు విధ్వంసమైంది’’ అని పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఇచ్చిన శ్వేతపత్రం పేర్కొంది. ‘‘2019 గోదావరి వరదల్లో డయాఫ్రం వాల్ దెబ్బతినలేదు. 2020 భారీ వరదల్లోనే ఈ విధ్వంసం జరిగింది. కానీ 2023 జనవరి వరకూ దీనిపై అధ్యయనమే జరగలేదు’’ అని ఆ పత్రం వివరించింది. గుత్తేదారును మార్చకపోతే 2020 ఖరీఫ్ నాటికే తొలిదశ ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవని పేర్కొంది. ‘‘ప్రస్తుతం తొలిదశలో +41.15 మీటర్ల స్థాయికి నీటిని నిలబెట్టి కుడి, ఎడమ కాలువల ద్వారా నీళ్లు 2028 జూన్ నాటికి అందించగలమని అంచనా వేస్తున్నాం’’ అని ప్రకటించింది. ఆ శ్వేతపత్రంలోని ఇతర అంశాలు ఇలా ఉన్నాయి.
- జగన్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు సివిల్ పనుల పురోగతి 3.84 శాతమే. ఎడమ, కుడి కాలువల్లో కొన్ని పెండింగు బిల్లుల చెల్లింపులు తప్ప ఏ పనీ జరగలేదు. పిల్ల కాలువల పనులూ ఇంకా ప్రారంభం కాలేదు. డీపీఆర్ కూడా ఖరారు కాలేదు.
- నిధుల కేటాయింపులు, ఖర్చు అంతంతమాత్రమే. ఛత్తీస్గఢ్, ఒడిశాలతో ముంపు వివాదాలు పరిష్కారం కాలేదు. 2017-18 ధరలకు అనుగుణంగా రెండో డీపీఆర్ ఆమోదంలోనూ పురోగతి లేదు.
గుత్తేదారు మార్పుపై పోలవరం అథారిటీ ఆగ్రహం
జగన్ ప్రభుత్వం పోలవరంలో గుత్తేదారు ఏజెన్సీని మార్చాలని తీసుకున్న నిర్ణయంపై పోలవరం అథారిటీ 2019 ఆగస్టు 13న నిర్వహించిన సమావేశం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ అభ్యంతరాలు ఇలా ఉన్నాయి.
- పోలవరం హెడ్ వర్క్స్ గుత్తేదారును నిర్ణయించడానికి ఏపీ ప్రభుత్వానికి 2009 నుంచి 2013 వరకు సమయం పట్టింది. మళ్లీ గుత్తేదారును మారిస్తే అదే సమస్య రావచ్చు. పనులు వేగం అందుకోవడానికి పది నెలల సమయం పడుతుంది. అది మొత్తం ప్రాజెక్టు ఆలస్యానికి దారి తీయవచ్చు. గుత్తేదారును మార్చడం వల్ల రెండేళ్ల పాటు గుత్తేదారుకు లోపభూయిష్ట బాధ్యత, ఐదేళ్ల నిర్వహణ బాధ్యత విధించడం సాధ్యం కాదు. ఇది ఊహించని సంక్లిష్టతలను సృష్టిస్తుంది. నిర్మాణవ్యయంలో పొదుపు సాధించినా.. ప్రాజెక్టు ఆలస్యమై ఆ ప్రయోజనాలూ ఆలస్యం కావడం వల్ల జరిగే నష్టం మరింత ఎక్కువ. గుత్తేదారులతో ఒప్పందం ముందస్తుగా రద్దు వల్ల వారికి అందించాల్సిన పరిహారం కోసం అదనపు ఖర్చు అవుతుంది.
- ప్రాజెక్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టెండర్లు రద్దు చేసి రివర్స్ టెండర్లు నిర్వహించాలనే ఆలోచన మానుకోవాలని పోలవరం అథారిటీ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. అయినా జగన్ ప్రభుత్వం గుత్తేదారును మార్చివేసింది. మేఘా సంస్థకు పనులు అప్పజెప్పింది.
- రివర్స్ టెండర్ల పేరుతో రూ.628.47 కోట్లు ఆదా చేసినట్లు తేల్చినా- ఆ తర్వాత ఈ పనుల అమలు సమయంలో కొన్ని స్పెసిఫికేషన్ల మార్పు, ఇతర పనులతో సహా మరికొన్ని అదనపు అంశాలు గుర్తించి రెండు తాజా టెండర్లు పిలిచారు. ఆ రెండు టెండర్ల పనులూ మేఘా సంస్థకే ఇచ్చారు. దీనివల్ల రివర్స్ ద్వారా ఆదా చేశామని చెప్పిన రూ.628.47 కోట్ల స్థానంలో రూ.2,268.68 కోట్ల అదనపు భారం పడింది.
- ఈ ప్రాజెక్టు జాప్యం కావడానికి కారణాలపై ఐఐటీ హైదరాబాద్ నివేదిక ఇచ్చింది. నీతి ఆయోగ్ ఆదేశాలతో ఈ నివేదిక సిద్ధమయింది. గుత్తేదారును మార్చడం, తగినంత పనులు చేయకపోవడం, వ్యూహాత్మక ప్రణాళిక, సమన్వయ లోపం, తరచు డిజైన్లు మార్చడం కారణాలుగా ఆ కమిటీ తేల్చింది. 2020లో 22 లక్షల క్యూసెక్కుల భారీ వరద రావడంతో ప్రధాన డ్యాం వద్ద మూడు ప్రదేశాల్లోను, దిగువ కాఫర్ డ్యాంలోను విధ్వంసం సృష్టించిందని కమిటీ పేర్కొంటూ ఎగువ కాఫర్ డ్యాంలలో గ్యాప్లను సకాలంలో మూసివేయకపోవడం వల్లే ఇలా అయిందని తేల్చింది.
- పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రీయింబర్స్ చేసిన నిధులన్నీ మళ్లీ అదే ప్రాజెక్టుపై వెచ్చించలేదు. అలా రూ.3,385.58 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయకుండా దారి మళ్లించారు. 2024 మే 31 నాటికి కేంద్రం నుంచి రూ.2,697 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి.
- 2019లో 15 లక్షల క్యూసెక్కుల వరద దాటదని అంచనా వేశారు. పోలవరం అథారిటీ నిర్ణయం ప్రకారం ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్లు ఆ వరద లోపు మూసివేయవద్దని నిర్ణయించారు. అలా వదిలేస్తే వరద ఎంత వేగంతో వస్తుందో కూడా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనాలు, వరద సూచనల ఆధారంగా ఆ సీజన్ వరకు ఎగువ కాఫర్ డ్యాం ఖాళీలు పూడ్చకూడదని నిర్ణయించారు. 2019 వరదల సీజన్లో 13.95 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా డయాఫ్రం వాల్కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
- 2020 జూన్ నాటికి ఎగువ కాఫర్ డ్యాం ఖాళీలు మూసివేయలేదు. 2020 వరద సీజన్లో 22 లక్షల క్యూసెక్కుల భారీ వరద రావడంతో డయాఫ్రం వాల్ దెబ్బతిని, ఇతర విధ్వంసాలు చోటుచేసుకున్నాయి.
- తర్వాత నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ డయాఫ్రం వాల్ పరిస్థితిపై అధ్యయనం చేసింది. ఎక్కడెక్కడ ఎంతమేర విధ్వంసం జరిగిందో గుర్తించింది. దిగువ కాఫర్ డ్యాం కట్ ఆఫ్ కూడా ధ్వంసమయిందని తేల్చింది. 2020 వరదల్లో ధ్వంసమైతే 2023 జనవరి, ఫిబ్రవరి నెలల్లో నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ అధ్యయనం చేసింది. డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ప్రాంతాన్నే సరిచేయాలని, మిగిలిన భాగం సురక్షితంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.
- డయాఫ్రం వాల్ మరమ్మతుల తర్వాత ఆ కట్టడం పనితీరుపై హామీ ఇవ్వడానికి గుత్తేదారు ఏజెన్సీలు మేఘా, బావర్ కంపెనీలు అంగీకరించలేదు. బావర్ ఇండియా లిమిటెడ్ నది పొడవునా కొత్త డయాఫ్రం వాల్ నిర్మించడం మంచిదని సూచించింది. మేఘా కంపెనీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రజలసంఘం నిర్ణయం తీసుకోవాలి.
- 2020 జులై నుంచి 2024 జూన్ వరకు డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం పనులన్నీ స్తంభించిపోయాయి. మరోవైపు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలలో అదనపు సీపేజి ఉన్నట్లు గుర్తించినా, ఇప్పటివరకు నియంత్రించలేదు.
- ప్రధాన డ్యాం గ్యాప్ 1లో చేసిన పనుల నాణ్యతపైనా అనుమానాలు ఉన్నాయి. ఆ పనులు చేపట్టేందుకు అదనపు ట్రీట్మెంట్ చర్యలు అవసరమని తేల్చారు. డిజైన్ ట్రీట్మెంట్ చర్యలు ఖరారు చేయకపోవడంతో ఆ పనులూ ముందుకు సాగలేదు. స్పిల్ వే కు ఎగువన నిర్మించిన గైడ్బండ్ కుంగిపోయింది. దాన్నీ ఇంకా సరిదిద్దాలి.
- గుత్తేదారును మార్చకుండా ప్రాజెక్టు ప్రణాళిక సక్రమంగా అమలు చేస్తే 2020 ఖరీఫ్లో నీటి విడుదలకు వీలుగా ప్రాజెక్టు పూర్తయ్యేది. ఆ తర్వాత ప్రాజెక్టును అసమర్థ ప్రణాళికతో 2023 జూన్ వరకు పొడిగించారు.
- పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అఫ్రి ఇండియా లిమిటెడ్, అంతర్జాతీయ నిపుణుల సేవలు తీసుకోవాలని పోలవరం అథారిటీ నిర్ణయించింది. అఫ్రి ఇండియా లిమిటెడ్ డిజైన్లు ప్రతిపాదిస్తే పోలవరం అథారిటీ నియమించిన అంతర్జాతీయ కన్సల్టెంట్ల సమన్వయంతో ఆమోదించాలి. పోలవరంలో మిగిలిన అన్ని పనులూ నాలుగేళ్లలో పూర్తిచేసే అవకాశం ఉంది. +41.15 మీటర్ల స్థాయికి పునరావాస పనులను 2026 నాటికి పూర్తిచేసే అవకాశం ఉంది.
- +41.15 మీటర్ల స్థాయికి 115.43 టీఎంసీల నీటిని నింపి కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని సరఫరా చేసేందుకు అన్ని పనులనూ 2028 జూన్ నాటికి పూర్తిచేసే అవకాశం ఉంది. +45.72 మీటర్ల స్థాయికి నీటిని నింపి ఆ స్థాయి పునరావాసం పనులు దశలవారీగా చేస్తాం. ప్రాజెక్టు తొలిదశలోని మిగిలిన పనులు పూర్తిచేసేందుకు అయ్యే వ్యయం రూ.12,157 కోట్లు.
పేలవమైన ప్రణాళికతో భారీ నష్టం
- ఎగువ కాఫర్ డ్యాంలోని ఖాళీలను తగిన సమయంలో పూర్తిచేయలేదు. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తయితే ముంపులో చిక్కుకునే గ్రామాలకు పునరావాసం కల్పించలేదు. స్పిల్ వేకు అప్రోచ్ ఛానల్, కుడి, ఎడమ హెడ్ రెగ్యులేటర్లకు అప్రోచ్ ఛానల్ పురోగతి పేలవం. ఫలితంగా ప్రధాన డ్యాం డయాఫ్రం వాల్, కట్ ఆఫ్ వాల్కు తీవ్ర నష్టం. దిగువ కాఫర్ డ్యాం దెబ్బతింది. ప్రధాన ఆనకట్ట నిర్మించాల్సిన చోట అగాధాలు ఏర్పడ్డాయి. ఈ అడ్డంకులు అధిగమించేందుకు అవసరమైన చర్యలూ ఖరారు కాలేదు. ఫలితంగా ప్రధాన ఆనకట్టల పని ఏదీ ప్రారంభం కాలేదు.
- కీలకమైన పని సమయంలో అకస్మాత్తుగా గుత్తేదారును మార్చారు. కేంద్రప్రభుత్వం, కేంద్ర జల్శక్తి, పోలవరం అథారిటీ సూచనలను విస్మరించారు. కొత్త ఏజెన్సీ సిబ్బంది, యంత్రాల సమీకరణలో జాప్యం చేయడంతో ఈ తీవ్ర నష్టాలన్నీ సంభవించాయి.
అప్పుడు పురోగతి.. జగన్ పాలనలో తిరోగమనం
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో మంచి పురోగతితో స్వర్ణయుగమైతే, 2019-24 మధ్య జగన్ ప్రభుత్వ హయాంలో తిరోగమనంలో నడిచింది. దానికి ఈ లెక్కలే నిదర్శనం. పనులు జరగకపోగా ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అనిశ్చితిలో పడింది. రెండు ప్రభుత్వాల హయాంలో పనులు జరిగిన తీరు...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్ఫోన్లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. -
విజయవాడ హైవేపై.. ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్ల ప్రారంభం
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది.