- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chandrababu: ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి
గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు వినతి
మరో ఆరుగురు కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటీలు
16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాతోనూ..
రాష్ట్ర సమస్యల పరిష్కారంపై విస్తృత చర్చలు
ఈనాడు - దిల్లీ
ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జగన్ ప్రభుత్వ ఐదేళ్ల దుష్పరిపాలనతో ఆర్థిక వనరులన్నీ ఆవిరైపోయాయని చెప్పారు. వచ్చే ఆదాయం జీతాలు, పింఛన్లు, అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తగిన చేయూతనివ్వాలని కోరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దిల్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. ప్రధానమంత్రితోపాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, ఇంధనశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాలతో వరుసగా సమావేశమయ్యారు.
వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 2014లో రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలు, దానికితోడు గత ఐదేళ్ల జగన్ దుష్పరిపాలన వల్ల తలెత్తిన ఇబ్బందులను వివరించారు. గత ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ దారుణంగా దెబ్బతిన్నట్లు వివరించారు. అనుత్పాదక వ్యయం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహజ వనరుల దోపిడీ, మానవవనరుల అభివృద్ధిని గాలికొదిలేయడంతో అభివృద్ధి అడుగంటిపోయినట్లు చెప్పారు. ఆదాయాలు పడిపోయి అప్పులు ఆకాశాన్నంటినట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు, ఇతర జలవనరులు, రహదారులు, రాజధాని నిర్మాణాలను గత ప్రభుత్వం విస్మరించడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. రాష్ట్ర ఆదాయం కంటే జీతాలు, పింఛన్లు, అప్పుల చెల్లింపులు పెరిగిపోయాయని, దీనివల్ల మూలధన వ్యయం కోసం ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం విచక్షణారహితంగా అప్పులు చేసిందని, దానికితోడు ప్రజాధనాన్ని పెద్దఎత్తున దారి మళ్లించిందని చెప్పారు. ఫలితంగా ప్రజావసరాలు తీర్చడానికి ప్రస్తుతం ఆర్థిక వనరులు లేని పరిస్థితి దాపురించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడటం కష్టమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
మోదీ నాయకత్వంలో బలంగా పుంజుకుంటాం
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చంద్రబాబు ప్రధానితో చర్చించారు. ఈ సమావేశం జరిగిన తీరును సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పంచుకున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాల పరిష్కారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిర్మాణాత్మక సమావేశం జరిగింది. ఆయన నాయకత్వంలో మన రాష్ట్రం మళ్లీ బలమైన పవర్హౌస్గా అవతరిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.
చంద్రబాబును ఆహ్వానించడం మాకు గౌరవం: పనగడియా
భారత్, ఆంధ్రప్రదేశ్ విషయంలో చంద్రబాబుకున్న ఆశాభావం ఎంతో స్ఫూర్తినిచ్చినట్లు 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియా అభిప్రాయపడ్డారు. ఆయన్ను 16వ ఆర్థిక సంఘం కార్యాలయానికి ఆహ్వానించడాన్ని ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి సాంకేతిక నగరంగా తీర్చిదిద్దిన నిజమైన దార్శనిక నాయకుడు చంద్రబాబు అని ఆయన అభివర్ణించారు.
ఏఐఎస్ అధికారులకు విందు
చంద్రబాబునాయుడు గురువారం రాత్రి దిల్లీలో 66 మంది అఖిల భారత సర్వీసు అధికారులకు విందు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ వంతు చేయూతనందించాలని వారిని కోరారు. ఆయన శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్, ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్, ఎన్హెచ్ఏఐ ఛైర్మన్ సంతోష్ యాదవ్, ఫిక్కి ప్రతినిధి బృందంతో సమావేశం కానున్నారు.
ప్రధానిని చంద్రబాబు సాయం కోరిన 7 ప్రధానాంశాలు
1. స్వల్పకాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వడం
2. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునఃప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవడం
3. అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించడం
4. పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం
5. రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కు అదనపు కేటాయింపులు జరిపి రహదారులు, వంతెనలు, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడటం
6. బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు మద్దతు పలకడం
7. దుగరాజపట్నం పోర్టు పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతనందించడం
వికసిత ఆంధ్రప్రదేశ్కు కట్టుబడి ఉన్నాం: అమిత్షా
వికసిత భారత్ భారత్తోపాటు, వికసిత ఆంధ్రప్రదేశ్కు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్షా పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడితో దేశం, రాష్ట్ర పురోగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించాం. భారత్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని చంద్రబాబుతో సమావేశం అనంతరం ఆయన ఎక్స్లో తెలిపారు. ‘డైనమిక్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం ఉత్సాహంగా సాగింది. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి బాటన సాగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ పురోగతి, వృద్ధి కోసం ఎలా సాయం చేయాలన్న అంశంపై చర్చించాం’ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొనసాగుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టుల గురించి చంద్రబాబు, ఇతర సీనియర్ అధికారులతో సమీక్షించినట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. చంద్రబాబుతో వ్యవసాయం, గ్రామీణ రంగాల అభివృద్ధిపై చర్చించినట్లు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు. రాష్ట్ర రైతుల సాధికారత, పురోగతి కోసం మోదీ నాయకత్వంలో తాము కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ను ప్రోత్సహించి దాని నిజమైన శక్తిసామర్థ్యాలను వెలికితీయడంతోపాటు, ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వంలో ఏం చేయాలన్న దానిపై చర్చించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, ఇంధనశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృత్తి ఉద్యోగం.. ప్రవృత్తి కాంట్రాక్టులు
ఆయన హోదా కంటి ఆస్పత్రిలో సీనియర్ అసిస్టెంట్ స్థాయి. రోగులకు సేవచేయాల్సిన ఆయన.. ఆస్పత్రికి రావడం, సంతకం చేయడం, వెంటనే కారులో బయటకు వెళ్లడం, తన కాంట్రాక్టు పనులు పరిశీలించడం దినచర్యగా మార్చుకున్నారు. -
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా చిట్టడవిని తలపిస్తున్న రాజధాని అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. -
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ వ్యవహారంలో వైకాపా నేతలకు ఉచ్చు బిగుస్తోంది. -
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామ ఫ్యాక్షన్ గొడవల్లో 11 మంది హత్యకు కారణమై జీవితఖైదు పడిన దోషులను.. నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. -
నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
ఛైర్మన్ లేరు.. జీతాలు ఇవ్వడం కుదరదు
ఉన్నత విద్యామండలికి ఛైర్మన్ లేనందున జూన్ నెల జీతాలు ఇవ్వడం కుదరదంటూ వైకాపా హయాంలో నియమితులైన అధికారులు ఆదేశాలిచ్చారు. -
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
గ్రామ సచివాలయాల గురించి పదేపదే గొప్పలు చెప్పుకొన్న గత వైకాపా ప్రభుత్వం వాటి నిర్మాణపనులు చేసినవారికి బిల్లులు చెల్లించకుండా మొండిచేయి చూపింది. -
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ చిత్రం కాకినాడ 49వ డివిజన్ రాజేంద్రనగర్లోని చైతన్య డిగ్రీ కళాశాలకు వెళ్లే మార్గంలోనిది. -
ఓఆర్ఆర్తో ‘అభివృద్ధి పరుగులు’
అమరావతితో పాటు, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు జీవనాడిగా నిలిచే అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించడం... రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మేలిమలుపు తిప్పే పరిణామం. -
రేపటి నుంచి ఉచిత ఇసుక
రాష్ట్రంలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. -
విశాఖ తీరాన.. వీయాలి ఐటీ వీచిక!
దేశ తూర్పు తీరాన పోర్ట్ సిటీగా, నేవీ కేంద్రంగా, పర్యాటక క్షేత్రంగా పేరుగాంచిన విశాఖపట్నం.. ఐటీ రంగంలోనూ సరికొత్త ముద్ర వేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని యువత ఆకాంక్షిస్తోంది. -
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
మరో 30 ఏళ్లు తానే సీఎంగా ఉంటాననుకొని విశాఖలోని రుషికొండ మీద జగన్ రాజమహల్ను కట్టించుకున్నారు. రూ.500 కోట్ల ప్రజాధనాన్ని విలాస వసతులకు ఖర్చు చేశారు. -
‘పెద్దాయన’కు మేలు చేసేలా బొగ్గు గని ఒప్పందం
ఏ ప్రభుత్వ రంగ సంస్థ అధికారైనా.. ఆ సంస్థకు మేలు చేసేందుకు చూస్తారు. కానీ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఎండీగా మొన్నటి వరకు వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి మాత్రం.. ఓ బొగ్గు గని ప్రాజెక్టు ద్వారా వైకాపా ప్రభుత్వంలో నెంబర్ టూగా చక్రం తిప్పిన ‘పెద్దాయన’కు ఎక్కువ ప్రయోజనం దక్కేలా చూశారు. -
8 హైవేల విస్తరణకు కేంద్రం సుముఖం
రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన కీలకమైన 8 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ మొదలయ్యేందుకు మార్గం సుగమమైంది. -
ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస పవిత్ర సారె ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో తొలి సారెను వైదిక కమిటీ పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు కుటుంబసభ్యులతో కలిసి సమర్పించారు. -
వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలు అనుసరించండి
వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే.. వాటి నుంచి కూడా సరికొత్త సంపద సృష్టించవచ్చని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. -
వాల్తేర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్తోనే ప్రయోజనం: విశాఖ ఎంపీ శ్రీభరత్
శాఖ కేంద్రంగా వాల్తేర్ డివిజన్తో కూడిన దక్షిణకోస్తా రైల్వేజోన్ సాధించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఆ దిశగా కృషిచేస్తామని విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా విశాఖ నుంచి పూరీకి నడపనున్న ప్రత్యేక రైలును శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. -
ట్రిపుల్ఐటీ డైరెక్టర్ల రాజీనామా
రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం డైరెక్టర్లు కుమారస్వామి గుప్తా, భాస్కర్ పటేల్, బాలాజీ శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. -
ఇసుక దోపిడీకి రాచమార్గం
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం ఇసుక రీచ్లో వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేశారు. -
ఐదేళ్ల తర్వాత పలాసకు సాగునీరు
వైకాపా ఐదేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ రైతులు సాగునీటికి నానాకష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వంశధార ఎడమ కాలువ ద్వారా నీరందించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్షలు పడేలా నూతన చట్టాలు పటిష్ఠంగా ఉన్నాయని, వీటిపై జూనియర్ న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఒలింపిక్స్లో వారిద్దరూ ఆడతారు’.. ద్రవిడ్ వ్యాఖ్యలకు కోహ్లీ ఫన్నీ రియాక్షన్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత
-
సీఎం చంద్రబాబు ఇంటిచుట్టూ పీఎస్ఆర్ ఆంజనేయులు చక్కర్లు
-
ఆ విషయంలో ప్రియదర్శిపై నాకు అసూయ: విష్వక్ సేన్
-
కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కలలు కన్నారు: జూపల్లి కృష్ణారావు
-
హార్దిక్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్ కుమార్ రెడ్డి