- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chandrababu: రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వండి
దిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
కేంద్ర మంత్రులకు చంద్రబాబు వినతులు
ఈనాడు, దిల్లీ: దిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వాలంటూ ఆయన చేసిన వినతులివి..
హోం మంత్రి అమిత్షాతో
- ఏపీలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు భూసేకరణ ఖర్చు రూ.385 కోట్లు విడుదల చేయాలి. దాని నిర్వహణకు రూ.27.54 కోట్లు ఇవ్వాలి.
- విభజన చట్టం ప్రకారం ఆస్తులను పంపిణీ చేయాలి. పదో షెడ్యూల్లోని రాష్ట్ర స్థాయి సంస్థలను విభజించాలి.
- ఏపీ జెన్కో, తెలంగాణ డిస్కంల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి.
- 2015 నుంచి పెండింగ్లో ఉన్న ఏపీ ఐపీఎస్ కేడర్ను సమీక్షించి, ఐపీఎస్ల సంఖ్యను 79 నుంచి 117కి పెంచాలి.
రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో..
కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశమైన సీఎం చంద్రబాబు. చిత్రంలో కేంద్రమంత్రులు భూపతిరాజు శ్రీనివాసవర్మ,
రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్రెడ్డి
- అమరావతి అభివృద్ధికి దోహదం చేసే ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును వెంటనే మంజూరు చేయాలి.
- హైదరాబాద్- విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారిని 6/8 వరుసలుగా విస్తరించాలి.
- హైదరాబాద్- అమరావతి మధ్య కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే అభివృద్ధి చేయాలి.
- విజయవాడలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే తూర్పు బైపాస్ రోడ్డును వెంటనే మంజూరు చేయాలి. ఎన్హెచ్ఏఐ నేతృత్వంలో తయారవుతున్న డీపీఆర్ను వేగంగా పూర్తి చేసి, వెంటనే ఆమోదముద్ర వేయాలి.
- కుప్పం- హోసూరు- బెంగళూరు మధ్య 4 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలి.
- మూలాపేట (భావనపాడు) నుంచి విశాఖపట్నం వరకు 4 వరుసల గ్రీన్ఫీల్డ్ కోస్టల్ హైవే నిర్మించాలి.
వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో..
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో చంద్రబాబు
- విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో 3, చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో 1 పారిశ్రామిక నోడ్స్లో పరిశ్రమలకు నీరు, విద్యుత్తు, రైల్వే, రోడ్డు సౌకర్యాలు కల్పించేందుకు గ్రాంట్ రూపంలో ఆర్థిక సాయం చేయాలి.
- కేంద్ర ప్రభుత్వ ఉప్పు భూములను వాటి రిజిస్టర్డ్ విలువ ప్రకారం రాష్ట్రంలో పోర్టు ఆధారిత అభివృద్ధి కోసం బదిలీ చేయాలి.
వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో..
కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు వినతిపత్రం ఇస్తున్న చంద్రబాబు
- ఆంధ్రప్రదేశ్కు సమీకృత ఆక్వా పార్కు మంజూరు చేయాలి.
- ఉద్యాన పంటల రైతులకు సబ్సిడీ పెంచేందుకు కొత్త విధానాన్ని రూపొందించాలి.
- ఆర్కేవీవై పథకం కింద 2023-24లో రాష్ట్రానికి రావాల్సిన రూ.125.52 కోట్లు విడుదల చేయాలి.
- హార్టీకల్చర్ను సమీకృతంగా అభివృద్ధి చేసే పథకం కింద కేంద్ర వాటా రూ.165 కోట్లు, రాష్ట్ర వాటా రూ.110 కోట్లకు ఆమోదముద్ర వేయాలి.
- నేషనల్ ఆయిల్ సీడ్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వ వాటా రూ.111.29 కోట్లు వెంటనే విడుదల చేయాలి.
ఇంధనశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో..
కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్, చంద్రబాబు కరచాలన
- కర్నూలు-విశాఖపట్నం మధ్య హైఓల్టేజ్ డైరెక్ట్ కరెంట్ అంతర్రాష్ట్ర విద్యుత్తు సరఫరా లైన్కు ఆమోదం తెలపాలి. అదనపు నిబంధనల నుంచి మినహాయింపునివ్వాలి.
- విశాఖ- కాకినాడను గ్రీన్ హైడ్రోజన్ తయారీ హబ్గా ప్రోత్సహించాలి.
పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో..
కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురికి పుష్పగుచ్ఛం అందజేస్తూ..
- విభజన చట్టంలోని సెక్షన్ 93(4) ప్రకారం బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలి.
- ఈ నెలాఖరులో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రిఫైనరీ ప్రకటిస్తే దేశంలో ముడిచమురు శుద్ధి సామర్థ్యం పెరిగి 2047కల్లా వికసిత భారత్గా ఎదగడానికి దోహదం చేస్తుంది.
16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాకు పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం చంద్రబాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ వ్యవహారంలో వైకాపా నేతలకు ఉచ్చు బిగుస్తోంది. -
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామ ఫ్యాక్షన్ గొడవల్లో 11 మంది హత్యకు కారణమై జీవితఖైదు పడిన దోషులను.. నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. -
వృత్తి ఉద్యోగం.. ప్రవృత్తి కాంట్రాక్టులు
ఆయన హోదా కంటి ఆస్పత్రిలో సీనియర్ అసిస్టెంట్ స్థాయి. రోగులకు సేవచేయాల్సిన ఆయన.. ఆస్పత్రికి రావడం, సంతకం చేయడం, వెంటనే కారులో బయటకు వెళ్లడం, తన కాంట్రాక్టు పనులు పరిశీలించడం దినచర్యగా మార్చుకున్నారు. -
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా చిట్టడవిని తలపిస్తున్న రాజధాని అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. -
నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
ఛైర్మన్ లేరు.. జీతాలు ఇవ్వడం కుదరదు
ఉన్నత విద్యామండలికి ఛైర్మన్ లేనందున జూన్ నెల జీతాలు ఇవ్వడం కుదరదంటూ వైకాపా హయాంలో నియమితులైన అధికారులు ఆదేశాలిచ్చారు. -
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
గ్రామ సచివాలయాల గురించి పదేపదే గొప్పలు చెప్పుకొన్న గత వైకాపా ప్రభుత్వం వాటి నిర్మాణపనులు చేసినవారికి బిల్లులు చెల్లించకుండా మొండిచేయి చూపింది. -
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ చిత్రం కాకినాడ 49వ డివిజన్ రాజేంద్రనగర్లోని చైతన్య డిగ్రీ కళాశాలకు వెళ్లే మార్గంలోనిది. -
ఓఆర్ఆర్తో ‘అభివృద్ధి పరుగులు’
అమరావతితో పాటు, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు జీవనాడిగా నిలిచే అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించడం... రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మేలిమలుపు తిప్పే పరిణామం. -
రేపటి నుంచి ఉచిత ఇసుక
రాష్ట్రంలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. -
విశాఖ తీరాన.. వీయాలి ఐటీ వీచిక!
దేశ తూర్పు తీరాన పోర్ట్ సిటీగా, నేవీ కేంద్రంగా, పర్యాటక క్షేత్రంగా పేరుగాంచిన విశాఖపట్నం.. ఐటీ రంగంలోనూ సరికొత్త ముద్ర వేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని యువత ఆకాంక్షిస్తోంది. -
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
మరో 30 ఏళ్లు తానే సీఎంగా ఉంటాననుకొని విశాఖలోని రుషికొండ మీద జగన్ రాజమహల్ను కట్టించుకున్నారు. రూ.500 కోట్ల ప్రజాధనాన్ని విలాస వసతులకు ఖర్చు చేశారు. -
‘పెద్దాయన’కు మేలు చేసేలా బొగ్గు గని ఒప్పందం
ఏ ప్రభుత్వ రంగ సంస్థ అధికారైనా.. ఆ సంస్థకు మేలు చేసేందుకు చూస్తారు. కానీ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఎండీగా మొన్నటి వరకు వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి మాత్రం.. ఓ బొగ్గు గని ప్రాజెక్టు ద్వారా వైకాపా ప్రభుత్వంలో నెంబర్ టూగా చక్రం తిప్పిన ‘పెద్దాయన’కు ఎక్కువ ప్రయోజనం దక్కేలా చూశారు. -
8 హైవేల విస్తరణకు కేంద్రం సుముఖం
రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన కీలకమైన 8 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ మొదలయ్యేందుకు మార్గం సుగమమైంది. -
ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస పవిత్ర సారె ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో తొలి సారెను వైదిక కమిటీ పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు కుటుంబసభ్యులతో కలిసి సమర్పించారు. -
వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలు అనుసరించండి
వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే.. వాటి నుంచి కూడా సరికొత్త సంపద సృష్టించవచ్చని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. -
వాల్తేర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్తోనే ప్రయోజనం: విశాఖ ఎంపీ శ్రీభరత్
శాఖ కేంద్రంగా వాల్తేర్ డివిజన్తో కూడిన దక్షిణకోస్తా రైల్వేజోన్ సాధించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఆ దిశగా కృషిచేస్తామని విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా విశాఖ నుంచి పూరీకి నడపనున్న ప్రత్యేక రైలును శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. -
ట్రిపుల్ఐటీ డైరెక్టర్ల రాజీనామా
రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం డైరెక్టర్లు కుమారస్వామి గుప్తా, భాస్కర్ పటేల్, బాలాజీ శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. -
ఇసుక దోపిడీకి రాచమార్గం
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం ఇసుక రీచ్లో వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేశారు. -
ఐదేళ్ల తర్వాత పలాసకు సాగునీరు
వైకాపా ఐదేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ రైతులు సాగునీటికి నానాకష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వంశధార ఎడమ కాలువ ద్వారా నీరందించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్షలు పడేలా నూతన చట్టాలు పటిష్ఠంగా ఉన్నాయని, వీటిపై జూనియర్ న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సినీ ప్రొడక్షన్ విభాగ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆత్మహత్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
-
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు
-
మణికొండలో కేవ్ పబ్పై టీజీ న్యాబ్ అధికారుల దాడులు
-
ఇక టెట్ ఏటా రెండుసార్లు