- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chandrababu: నిరుపేద ఇంటికి చంద్రన్న ‘భరోసా’
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాకలో ఉండే బాణావత్ పాములు నాయక్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆ కుటుంబానికి తొలి పింఛను అందజేశారు.
పింఛను లబ్ధిదారుడు పాములు నాయక్ ఇంటికి సీఎం చంద్రబాబు
స్థితిగతులు చూసి ఇల్లు మంజూరు
20 నిమిషాలకు పైగా పూరిగుడిసెలోనే సీఎం
పెనుమాకలో బాణావత్ పాములునాయక్, ఆయన భార్య సీతకు పింఛను అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఈనాడు-అమరావతి, తాడేపల్లి, న్యూస్టుడే: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాకలో ఉండే బాణావత్ పాములు నాయక్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆ కుటుంబానికి తొలి పింఛను అందజేశారు. తొలుత పాములునాయక్కు వృద్ధాప్య పింఛను రూ.7 వేలు ఇచ్చి..ఆయన భార్య సీతకు సీఆర్డీఏ పింఛను రూ.5 వేలు, కూతురు సాయికి వితంతు పింఛను రూ.7 వేలు అందించారు. 20 నిమిషాలకు పైగా ఆ పూరి గుడిసెలోనే వారి మంచంపై కూర్చున్న ఆయన.. అక్కడే టీ తాగి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పింఛను ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయం పెంచేందుకు ఆలోచనలు చేస్తున్నామని చంద్రబాబు వారికి చెప్పారు. పేదల ఆదాయాన్ని పెంచి.. ఖర్చులు తగ్గించి జీవితాలు బాగుపడేలా వినూత్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా పిల్లలను చదివిస్తున్న తీరును చంద్రబాబు అభినందించారు. ఇప్పుడు చెప్పించే చదువే బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆ కుటుంబ స్థితిగతులను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున ఇల్లు మంజూరు చేస్తూ పత్రాలను అందించారు. పింఛన్ ఇవ్వడంతోపాటు మీకు ఇల్లు లేనందున ఇల్లు కూడా మంజూరు చేస్తున్నాను. అని ఆయన చెప్పగానే ఇల్లు తాము కట్టుకోలేమని కట్టించి ఇవ్వాలని వారు కోరడంతో కలెక్టర్కు ఆ బాధ్యత అప్పగించారు. ‘ఇంట్లో ఇక నుంచి ప్రతి నెలా ముగ్గురికీ కలిపి రూ.13 వేలు పింఛను వస్తుంది. దానికి తోడుగా మీరు కొంత సంపాదించుకుని పిల్లలను చదివించుకుంటే ప్రభుత్వ పరంగా సాయం అందుతుంది’ అని ఆయన వివరించారు. పేదరికంలో పుట్టి పేదరికంలో మగ్గితే ఎలా అని చంద్రబాబు అనగానే వితంతు సాయి మాట్లాడుతూ పొలాలు చేసి నష్టపోయామని, అప్పుల వల్ల ఇల్లు కట్టుకోలేకపోయామని వివరించారు. . ‘మీ అబ్బాయి కానిస్టేబుల్ అవుతానంటున్నాడు. మరో కుమారుడు లాయర్ కావాలనుకుంటున్నాడు. ఇప్పటి నుంచి బాగా చదువుకుంటే ఐదు, పదేళ్లలో ఉద్యోగాలు వచ్చి వారు జీవితంలో స్థిరపడతారు. మీరు ప్రతినెలా ఆసుపత్రికి రూ.5 వేలు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడే ఉన్న ఎయిమ్స్కు వెళితే అక్కడ పెద్ద డాక్టర్లు ఉంటారు. ఇలా వినూత్నంగా ఆలోచించాలి’ అని సూచిస్తూ వారికి భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. ‘మీ ఇంటి పక్కనే చాలా మంది పెద్ద ఇళ్లు కట్టుకున్నారు. వాళ్లు కూడా చిన్నతనంలో మీలాగానే ఉన్నా కొంచెం ముందుకు వెళుతున్నారు. మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఉన్న అన్ని కులాల వారు బాగున్నారు కదా? మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. వాళ్ల పూర్వీకులు ఎకరం, రెండెకరాలు పొలం ఇస్తే కష్టపడి పనిచేసి దానిని పెంచుకున్నారు. మీకు భూమి లేనందున కష్టార్జితంతో బతుకుతున్నారు. ప్రతి ఒక్కరికీ కనీస ఆదాయం సంపాదించే మార్గం చూపాలనేది నా ఆలోచన. లేకపోతే ఇలాగే పేదరికంలో పుట్టి పేదరికంలోనే చనిపోతారు. పిల్లలను చదివించి మంచి పనిచేస్తున్నారు. ఇది శుభ సూచికం. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది’ అని చంద్రబాబు వారితో అన్నారు. బాగా చదువుకుంటున్నారా? మంచి ర్యాంకు వస్తుందా? మార్కులు ఎన్ని వచ్చాయని పిల్లలను అడిగారు.
బాణావత్ పాములునాయక్ కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఆ కుటుంబాన్ని చూసి బాధేసింది
ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘పాములు నాయక్ కుటుంబాన్ని చూసినప్పుడు చాలా బాధ కలిగింది. చుట్టుపక్కల అన్నీ మంచి ఇళ్లు ఉన్నాయి. వీరు పూరి గుడిసెలో ఉంటున్నారు. అది కూడా కురుస్తోంది. పొలం కౌలుకు తీసుకుని ఉల్లిపంట వేస్తే కలిసి రాక రూ.9 లక్షలు నష్టపోయారు. ఆ సొమ్ము ఇప్పుడు చెల్లించాల్సి వస్తోంది. కూతురికి భర్త చనిపోవడంతో వారు కూడా ఇక్కడే ఉంటున్నారు. రూ.1.8 లక్షలతో ఇల్లు మంజూరు చేస్తామని చెబితే ఇల్లు కట్టుకోలేమని వారు అన్నారు. కట్టించి ఇస్తామని హామీ ఇచ్చా. 3.8 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇలాంటి పేదవారిని ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ రోజు శాశ్వతంగా నా జీవితంలో గుర్తుంటుంది’ అని చంద్రబాబు వివరించారు.
పింఛను లబ్ధిదారు ఇచ్చిన టీ తాగుతున్న చంద్రబాబునాయుడు
పెనుమాక వీధుల్లో ఇంటింటికీ వెళ్లి వృద్ధురాలిని, గ్రామస్థులను పలకరిస్తున్న సీఎం చంద్రబాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
మీరేదైనా వాహనం కొంటే స్టిక్కరింగ్కు ఎంతవుతుంది? మహా అయితే రూ.2 వేల నుంచి రూ.5 వేలు. కానీ, వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశువైద్య సేవా వాహనాలకు రంగులు, జగన్ బొమ్మలు వేయించడానికి రూ.2.50 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా. -
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పురోగతి, తర్వాత వైకాపా ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని వివరించారు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సు తొలగింపు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సును కళాశాల విద్యాశాఖ మూసివేసింది. బీకాం కంప్యూటర్స్ ఒక్కటే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. -
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
ఒంగోలు సత్యనారాయణపురంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. పిల్లర్ల దశలో ఉన్న భవనంలోనే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. నాడు-నేడు రెండో దశలో భాగంగా కొత్త భవనం నిర్మిస్తామని 2022లో పాత భవనాన్ని గత వైకాపా ప్రభుత్వం కూలగొట్టింది. -
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. -
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి చేయనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. -
అమరావతిని బంగారం చేస్తాం
అమరావతిపై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్ ప్రభుత్వం.. రాజధాని బ్రాండ్ ఇమేజ్ను సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన జరిగి పదేళ్లయినా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు
కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ- అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణ
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. -
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికే నిర్ణయం
పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్ కుష్విందర్ ఓహ్రా స్పష్టం చేశారు. -
అందరికీ ఉచిత ఇసుక
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు శ్రీకారం చుడుతోంది. సీఎం చంద్రబాబు బుధవారం దిశానిర్దేశం చేయడంతో ఆ శాఖ అధికారులు ఈ విధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కల్కి సినిమా టికెట్ ధర పెంపుపై హైకోర్టులో పిల్
కల్కి సినిమా టికెట్ల ధరను మొదటి 14 రోజులు పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్) బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. -
మహిళా కార్యదర్శులకు పోలీసు బాధ్యతలు.. ప్రభుత్వ నిర్ణయంలో ఏదైనా పురోగతి ఉంటే చెప్పండి
గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ, చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. -
హైకోర్టులో జీపీ, ఏజీపీల నియామకం
రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు ఆరుగురు ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), 14 మంది సహాయ ప్రభుత్వ న్యాయవాదులు (ఏజీపీ) నియమితులయ్యారు. -
ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ఉన్నత విద్యామండలి
ఉన్నత విద్యా మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అమలు కావడం లేదు. వైకాపా ప్రభుత్వంలో నియమించిన వారే పని చేస్తుండడంతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. -
వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్మన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం బుధవారం కడప రిమ్స్కు తరలించారు. -
జప్తు చేసిన రూ.20 కోట్ల సామగ్రి మాయం!
వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. సెక్యూరిటీ గార్డు కాపలా ఉంటున్నారు.. కానీ లోపల యంత్రసామగ్రి మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. కనీసం కేసు నమోదు కాలేదు. -
ఐఏఎస్లూ.. పొలాలకు వెళ్లండి
ఐఏఎస్ అధికారులు కూడా సచివాలయం నుంచి పొలాలకు కదలాలని.. రైతులతో మాట్లాడాలని, సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు సలహాలు, సూచనలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. -
ప్రోత్సాహకాలు అందిస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. -
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం
రాబోయే వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మిగిలిన 6.75 లక్షల గృహాలను మార్చికల్లా పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు
-
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్
-
పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ రూ.5 వేలు
-
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?