- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chandrababu: విభజన సమస్యలు పరిష్కరించుకుందాం
విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6న హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి.. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం లేఖ రాశారు.
6న హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయండి
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి చంద్రబాబు లేఖ
ఈనాడు, అమరావతి: విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6న హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి.. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లవుతోంది. విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై పలు దఫాలుగా చర్చలు జరిగినా.. పరిష్కారం కాని అంశాలు ఇంకా ఉన్నాయి. వీటికి సామరస్యపూర్వక పరిష్కారం సాధించేందుకు కట్టుబడి ఉన్నాం. రెండు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి దోహదపడేలా ముఖ్యమైన చిక్కులను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖాముఖి చర్చల ద్వారా కీలక అంశాలను పరిష్కరించుకునేందుకు వీలుంటుంది. ఈ చర్చలు మంచి ఫలితాలిస్తాయనే నమ్మకం ఉంది’ అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుస్థిర ప్రగతి సాధించడానికి.. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇది మన బాధ్యత. ప్రజల అభ్యున్నతికి దోహదపడేలా.. ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు ఇది కీలకం’ అని వివరించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రగతికి రేవంత్రెడ్డి చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో సవాళ్లు.. పరిష్కరించదగ్గవే!
పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఎదురైన సవాళ్లన్నీ పరిష్కరించదగ్గవేనని విదేశీ నిపుణులు ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. మొత్తం మీద సానుకూల వ్యాఖ్యలు చేసినప్పటికీ సమగ్ర అధ్యయనం తర్వాతే తుది నిర్ణయాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. -
అచ్యుతాపురం సెజ్లో కృతిమ మేధ పరిశ్రమ
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో తొలిసారి కృత్రిమ మేధ కంపెనీ అడుగుపెట్టబోతోంది. సబ్స్ట్రాక్ట్ మాన్యుఫ్యాక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్ప్రైజ్ (స్మైల్) పేరుతో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. -
వందేళ్ల తాతా.. వహ్వా నీ ఘనత: మాజీ ఎంపీపీని ఎత్తుకున్న జిల్లా కలెక్టర్
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ మంగళవారం పెదబయలు మండలంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. -
నిత్యావసరాల ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
పెరిగిన నిత్యావసరాల ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. -
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
గత ఎన్నికల ముందు ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో నిందితులు
మూడేళ్ల క్రితం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. -
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
వైకాపా అధినేత జగన్కు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి బినామీగా వ్యవహరిస్తున్నట్లు ఏపీ సాధు పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు, ఆనందాశ్రమం పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. -
అలాగే.. 6న కలుద్దాం
విభజన అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపాదనపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. -
ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం
రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికే పైరవీ బదిలీలు.. గత ఎన్నికల ముందు సిఫార్సు బదిలీలతో మాజీ మంత్రి రూ.50 కోట్లకుపైగా దండుకున్న వైనం.. సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరం.. ఇలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. -
పులివెందులలో ‘ఫోర్ స్టార్’ పన్నాగం
స్టార్ హోటళ్లు ఎక్కడ కడతారు? సందర్శకులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే నగరాల్లో కదా. కానీ ఘనత వహించిన జగన్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? పర్యాటకులే రాని పులివెందులలో ఫోర్స్టార్ హోటల్ కట్టేందుకంటూ తమ బంధువు క్లబ్హౌస్ను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థతో రూ.12.87 కోట్లతో కొనిపించింది. -
అమ్మ వెంకటరెడ్డీ.. ఇంత మోసమా?
జగన్ ప్రభుత్వంలో సాగిన ఇసుక దోపిడీలో ఆశ్చర్యకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ‘ముఖ్య’నేతలు భారీగా ఇసుక సొమ్ము దోచేయగా.. గుత్తేదారు పూర్తిగా డబ్బు చెల్లించకుండా ప్రభుత్వానికి రూ.800 కోట్ల బాకీ ఉండగా.. బకాయి లేదంటూ గనులశాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఏకంగా నో డ్యూ సర్టిఫికెట్ జారీచేసేశారు. -
ఆడపిల్లల అదృశ్యంపై ప్రత్యేక సెల్
‘‘ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదేళ్లలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే వైకాపా ప్రభుత్వం కనీసం ప్రెస్మీట్ కూడా పెట్టలేదు. పోలీసులూ స్పందించలేదు. -
‘వేలిముద్రలు’ చెరిపేసిన నేరం జగన్దే!
గత వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర పోలీసు శాఖ 10 లక్షల మందికి పైగా నేరగాళ్ల వేలిముద్రలను నిక్షిప్తపరిచిన అధునాతన సర్వర్లు కాలిపోయాయి. -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి: మంత్రి లోకేశ్
విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. -
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో.. సాంకేతిక సమస్యలను అధిగమించాలి
డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. -
‘ఆర్థిక’ శ్వేతపత్రం రూపకల్పనపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆరా
జగన్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక అరాచకంపై శ్వేతపత్రం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం తన ఛాంబరులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కార్యదర్శులు వినయ్చంద్, జానకి తదితరులతో సమావేశమయ్యారు. -
విశాఖ జైల్లో గంజాయి ఖైదీలే ఎక్కువ
విశాఖ జైల్లో 2 వేల మంది ఖైదీలు ఉండగా.. వారిలో 1,200 మంది గంజాయి ఖైదీలే ఉండటం విచారకరమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. -
18 వేల టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
కాకినాడ, పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ బృందాలు మంగళవారం పలు గోదాముల్లో తనిఖీలు కొనసాగించాయి. రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటీ డెమో పోస్టు భర్తీ
వైద్య, ఆరోగ్యశాఖ జోన్-3 పరిధిలోని డిప్యూటీ మాస్ మీడియా అధికారి (డెమో) పోస్టును నిబంధనలకు విరుద్ధంగా జోన్-4 అధికారులు భర్తీ చేయడం చర్చనీయాంశమైంది. -
అమరావతి అనుసంధాన రహదారుల అభివృద్ధి
రాజధాని అమరావతికి అనుసంధాన రహదారి అభివృద్ధి, కరకట్ట రోడ్డు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలకమని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే విశాలమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి రూపకల్పన చేశారు. -
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు త్వరలో శిక్షణ
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. విజయనగరంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతకు కల్పిస్తాం: గుమ్మడి సంధ్యారాణి
-
రోహిత్ - కోహ్లీ వీడ్కోలు.. ఆ స్థానాల్ని భర్తీ చేసే ఆ ఇద్దరు ఎవరు?
-
ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
-
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
-
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా
-
ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్