- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Nallamala: 154 ఏళ్ల తర్వాత నల్లమలలో అడవి దున్న
నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించింది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్లో కెమెరా ట్రాప్లో దాని చిత్రాలు నమోదయ్యాయి.
నల్లమలలో సంచరిస్తున్న అడవి దున్న
ఆత్మకూరు, న్యూస్టుడే: నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించింది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్లో కెమెరా ట్రాప్లో దాని చిత్రాలు నమోదయ్యాయి. మన దేశంలోని పశ్చిమ కనుమల్లో సంచరించే అడవి దున్నలు నల్లమలలో కనిపించడంతో అటవీ సిబ్బంది సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. 1870 తర్వాత మళ్లీ ఇది కనిపించినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో వెలుగోడు రేంజ్లో మొదటిసారి అడవి దున్నను గుర్తించినట్లు ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా తెలిపారు. అక్కడినుంచి అది గత నెలలో బైర్లూటి రేంజ్లోకి వచ్చిందని పేర్కొన్నారు. కర్ణాటక వైపు నుంచి ఈ దున్న కృష్ణా నదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి
గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. -
ఏపీఎండీసీని వాడేసుకున్న ద్వివేది
అధికారులు, ఉద్యోగులకు ఆదర్శంగా నిలవాల్సిన గనులశాఖ పూర్వపు ప్రత్యేక ప్రధానకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.. వైద్యబిల్లుల కోసం దారితప్పారు. -
పెద్దిరెడ్డీ.. ఇదేం పని?
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ‘ఘన’కార్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపంలోని రాయల్నగర్లో రూ.19 లక్షల కార్పొరేషన్ సొమ్ముతో ఇంటికి సీసీ రోడ్డు వేయించుకున్నారు.. అంతేకాకుండా మరెవరికీ ప్రవేశం లేదంటూ రెండు వైపులా గేట్లు పెట్టేశారు. -
చేసిన పాపం కాల్చేస్తే పోతుందని!?
కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబంధించిన కీలక పత్రాల దహనం అనేక సందేహాలకు తావిస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పీసీబీ కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమాలకు ఆధారాలు లభించకుండా చేసేందుకు పత్రాల్ని, దస్త్రాల్ని తగలబెట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
ఆ రొయ్యల శుద్ధి పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమై రోగాల బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
-
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?