- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Atchutapuram: అచ్యుతాపురం సెజ్లో కృతిమ మేధ పరిశ్రమ
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో తొలిసారి కృత్రిమ మేధ కంపెనీ అడుగుపెట్టబోతోంది. సబ్స్ట్రాక్ట్ మాన్యుఫ్యాక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్ప్రైజ్ (స్మైల్) పేరుతో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది.
రూ.189 కోట్ల పెట్టుబడితో వస్తున్న ఏఐ కంపెనీ
5వేల మందికి ఉపాధి లక్ష్యం
అచ్యుతాపురం సెజ్
ఈనాడు - అనకాపల్లి, న్యూస్టుడే- అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో తొలిసారి కృత్రిమ మేధ కంపెనీ అడుగుపెట్టబోతోంది. సబ్స్ట్రాక్ట్ మాన్యుఫ్యాక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్ప్రైజ్ (స్మైల్) పేరుతో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఇక్కడ ఏఐ ఉత్పత్తులను తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని సెజ్లో ప్రస్తుతం 208 పరిశ్రమలున్నాయి. వాటిలో ఎక్కువ భాగం తెదేపా ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటయ్యాయి. ఏషియన్ పెయింట్స్, సెయింట్ గొబైన్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. ఫార్మా, టెక్స్టైల్ అపరెల్ పార్క్, ఫెర్రో, టైర్లు, రంగులు, అద్దాల పరిశ్రమలతో సెజ్ కళకళలాడుతోంది. చండీగఢ్ కేంద్రంగా నమోదైన స్మైల్ సంస్థ రూ.189 కోట్ల పెట్టుబడితో ఏఐ పరికరాలను తయారుచేసే కంపెనీని ఏర్పాటు చేయబోతోంది. దీని ద్వారా 2028లోపు దశల వారీగా 5వేల మందికి ఉపాధి అవకాశాలను చూపిస్తామని కంపెనీ ప్రతినిధులు ఏపీఐఐసీకి ఇచ్చిన సవివర నివేదిక (డీపీఆర్)లో పేర్కొన్నారు. అది కూడా స్థానిక యువతకే ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏటా ఇంజినీరింగ్, డిప్లొమా చేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న వేల మంది విద్యార్థులకు ఈ ఏఐ కంపెనీలో ఉపాధి దక్కే అవకాశం ఉందని ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు. గతేడాది చివర్లో భూకేటాయింపునకు సంబంధించి ఏపీఐఐసీ అధికారులకు కంపెనీ ప్రతిపాదనలు పంపించగా పరిశ్రమల శాఖ ఆమోదం తెలిపింది. సెజ్లో 20 ఎకరాలను 33 ఏళ్లకు లీజుకు కేటాయించారు. ‘స్మైల్ పేరుతో ఏఐ సాంకేతిక పరిశ్రమ అచ్యుతాపురం సెజ్లో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీనికి టాప్ మెటలర్జికల్ కంపెనీకి సమీపంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. త్వరలోనే ఈ కంపెనీ నిర్మాణ పనులు పట్టాలెక్కనున్నాయి’ అని అచ్యుతాపురం ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.హరిప్రసాదరావు చెప్పారు.
స్థానికంగా ఉపాధి దక్కితే చాలు
సెజ్లో ఏఐ సాంకేతిక ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారుచేసే పరిశ్రమ వస్తుందని తెలిసింది. స్థానికంగా ఇంజినీరింగ్ చదివిన యువత ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇలాంటి కంపెనీలు వస్తే మాలాంటి వారు విశాఖకు కూడా వెళ్లనవసరం లేకుండా ఇక్కడే ఉపాధిని పొందవచ్చు.
పావని, నిరుద్యోగ యువతి, పూడిమడక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ.. రూ.60వేల కోట్లతో ఏర్పాటు
మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటుకానుంది. దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో భేటీ అయ్యారు. -
జగన్ ఫొటోతో ఉన్న నవరత్నాల లోగోలు తొలగించరేం?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా కొన్ని ప్రభుత్వశాఖల అధికారులకు గత వైకాపా ప్రభుత్వంపై అభిమానం తగ్గినట్లు లేదు. వైకాపా జెండా రంగులో రూపొందించిన కొన్ని ప్రభుత్వశాఖల వెబ్సైట్లను ఇప్పటికీ అదే విధంగా కొనసాగిస్తున్నారు. -
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
ఆ రొయ్యల శుద్ధి పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమై రోగాల బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం.. కాకాణి సొంతూరిలో భారీ మోసం
ధనార్జనే ధ్యేయంగా గత ఐదేళ్లలో వైకాపా నాయకులు వీలున్నచోటల్లా అక్రమ లేఅవుట్లు వేసి భారీగా దోపిడీకి పాల్పడ్డారు. -
నెల్లూరు జిల్లాలో 2 పెద్దపులులు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ అధికారి బి.చంద్రశేఖర్ ధ్రువీకరించారు. -
సూర్యారాధన చేసిన పవన్ కల్యాణ్
వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం సూర్యారాధన క్రతువులో పాల్గొన్నారు. -
జగన్ పర్యటనలో దొంగల హల్చల్
మాజీ సీఎం జగన్ పర్యటనలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గురువారం నెల్లూరులోని సెంట్రల్ జైలు వద్దకు రాగా.. ఆయన్ను చూసేందుకు వైకాపా కార్యకర్తలు పెద్దఎత్తున గుమిగూడారు. -
చంద్రబాబుకు థాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర
విదేశీ విద్యా పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లకు ధన్యవాదాలు తెలపడానికి మక్బుల్జాన్ అనే మహిళ ద్విచక్ర వాహన యాత్ర చేపట్టారు. -
కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణం వేగంగా సాగుతోంది. చిన్నఅవుటపల్లి నుంచి సూరాయపాలెం వరకూ పనులు తుది దశకు వచ్చాయి. -
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ
రాజధాని అమరావతిలో మరో ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ ఏర్పాటు కాబోతోంది. మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైనదిగా గుర్తింపు పొందిన ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ త్వరలో తన ప్రాంగణాన్ని అమరావతిలో నెలకొల్పనుంది. -
ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి
గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. -
పెద్దిరెడ్డీ.. ఇదేం పని?
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ‘ఘన’కార్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపంలోని రాయల్నగర్లో రూ.19 లక్షల కార్పొరేషన్ సొమ్ముతో ఇంటికి సీసీ రోడ్డు వేయించుకున్నారు.. అంతేకాకుండా మరెవరికీ ప్రవేశం లేదంటూ రెండు వైపులా గేట్లు పెట్టేశారు. -
చేసిన పాపం కాల్చేస్తే పోతుందని!?
కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబంధించిన కీలక పత్రాల దహనం అనేక సందేహాలకు తావిస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పీసీబీ కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమాలకు ఆధారాలు లభించకుండా చేసేందుకు పత్రాల్ని, దస్త్రాల్ని తగలబెట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మన్యంవీరుడు అల్లూరికి చంద్రబాబు నివాళి
స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. -
గుంతలు పూడ్చే ప్రాజెక్టు గోవిందా!
గత వైకాపా ప్రభుత్వం తలపెట్టిన గ్రామీణ రహదారుల్లో గుంతలు పూడ్చే ప్రాజెక్టు అటకెక్కింది. ఆర్థికసాయం చేసేందుకు నాబార్డు ససేమిరా అనడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. -
ప్రజా వేదిక శిథిలాలు అక్కడే
గతంలో జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలను తొలగించకుండా అలాగే ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వండి
దిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. -
సంక్షిప్త వార్తలు (11)
రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరిస్తామని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్మార్క్ తెలిపారు. -
ఇదీ సంగతి!
-
ఆగస్టు 16 నుంచి విజయవాడ-ముంబయి విమాన సర్వీస్
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబయికి ప్రత్యేక సర్వీస్ను నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. -
కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించాలి
రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
-
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు
-
‘భారతీయుడు2’ సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM