- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Amaravati: అమరావతి అనుసంధాన రహదారుల అభివృద్ధి
రాజధాని అమరావతికి అనుసంధాన రహదారి అభివృద్ధి, కరకట్ట రోడ్డు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలకమని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే విశాలమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి రూపకల్పన చేశారు.
మిగిలిన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంపై కసరత్తు
భూసేకరణకు రైతులతో సంప్రదింపులు
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతికి అనుసంధాన రహదారి అభివృద్ధి, కరకట్ట రోడ్డు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలకమని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే విశాలమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఆయన హయాంలో పనులు శరవేగంగా సాగినా, 2019లో వైకాపా అధికారంలోకొచ్చాక ఆగిపోయాయి. ఐదేళ్ల తర్వాత తిరిగి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే సీఎం చంద్రబాబు రాజధాని పునర్నిర్మాణంపై దృష్టి పెట్టారు.అమరావతిలో సువిశాలమైన రహదారులు నిర్మించి, చెన్నై- కోల్కతా హైవేతో అనుసంధానించాలన్న ఆలోచనతో గతంలో సీఎం చంద్రబాబు సీడ్ యాక్సెస్ రోడ్డు (ఈ3) నిర్మాణాన్ని రూ.242.30 కోట్లతో చేపట్టారు. దీని పొడవు 21.37 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టును ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. మొదటి దశలో 14.47 కి.మీ. పొడవున నిర్మించాల్సి ఉంది. దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు పనులు చేశారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చేనాటికి 86 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. మూడు చోట్ల భూమి సేకరించాల్సి ఉంది. రాయపూడి పెట్రోల్ బంకు పక్కన చర్చి అడ్డుగా ఉంది. దొండపాడు ప్రాంతంలో హెచ్టీ లైన్లను మార్చాల్సి ఉంది. ఈ రోడ్డు నిర్మాణానికి రైతులు భూములివ్వకుండా అప్పటి మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెర వెనుక మంత్రాంగం నడిపారు. కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. అమరావతిపై వైకాపా ప్రభుత్వ అక్కసు కారణంగా భూసేకరణలో అడ్డంకులు తొలగకపోగా, ఏ ఒక్క పనీ అంగుళమైనా ముందుకు కదల్లేదు.
భూసేకరణకు సిద్ధం
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని ప్రాధాన్యక్రమంలో చేపట్టాలని నిర్ణయించింది. ఆశ్రమం నుంచి ఉండవల్లి వరకు 3.80 కి.మీ. రోడ్డును ఆరు వరుసలుగా, మధ్యలో ప్రజా రవాణా కోసం బీఆర్టీఎస్ (బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం) ఉండేలా ప్రణాళిక రూపొందించింది. ఈ రోడ్డు కోసం 36 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. మూడో దశలో ఉండవల్లి నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు 3.10 కి.మీ. పొడవున 6 వరుసల పైవంతెన నిర్మించనున్నారు. దీని నమూనాలు రూపొందించినా, అంచనాలు సిద్ధం కాలేదు.
4 వరుసలుగా కరకట్ట విస్తరణ
కృష్ణా నది కుడి కట్ట విస్తరణ పనులకు 2021 జూన్లో నాటి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. రూ.150 కోట్లతో 15.525 కి.మీ. పొడవున రెండు వరుసలుగా విస్తరించాలన్నది ప్రణాళిక. ఈ ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్ సంస్థకు అప్పగించారు. ఈ పనులు సాగాలంటే 31 మంది రైతుల నుంచి 1.18 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీనిపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. పైగా 15 మంది రైతులు కోర్టుకెళ్లారు. ప్రస్తుత ప్రభుత్వం భవిష్యత్ అవసరాల దృష్ట్యా కరకట్ట రోడ్డును 2 వరుసలకు బదులు 4 లేన్లుగా వెడల్పు చేసే యోచనలో ఉంది. దీని వెంబడి వాణిజ్య ప్రాంతం అభివృద్ధి చెందొచ్చని అంచనా వేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కల్కి సినిమా టికెట్ ధర పెంపుపై హైకోర్టులో పిల్
కల్కి సినిమా టికెట్ల ధరను మొదటి 14 రోజులు పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్) బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. -
మహిళా కార్యదర్శులకు పోలీసు బాధ్యతలు..
గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ, చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. -
హైకోర్టులో జీపీ, ఏజీపీల నియామకం
రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు ఆరుగురు ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), 14 మంది సహాయ ప్రభుత్వ న్యాయవాదులు (ఏజీపీ) నియమితులయ్యారు. -
ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ఉన్నత విద్యామండలి
ఉన్నత విద్యా మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అమలు కావడం లేదు. వైకాపా ప్రభుత్వంలో నియమించిన వారే పని చేస్తుండడంతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. -
వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్మన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం బుధవారం కడప రిమ్స్కు తరలించారు. -
జప్తు చేసిన రూ.20 కోట్ల సామగ్రి మాయం!
వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. సెక్యూరిటీ గార్డు కాపలా ఉంటున్నారు.. కానీ లోపల యంత్రసామగ్రి మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. కనీసం కేసు నమోదు కాలేదు. -
ఐఏఎస్లూ.. పొలాలకు వెళ్లండి
ఐఏఎస్ అధికారులు కూడా సచివాలయం నుంచి పొలాలకు కదలాలని.. రైతులతో మాట్లాడాలని, సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు సలహాలు, సూచనలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. -
ప్రోత్సాహకాలు అందిస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. -
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం
రాబోయే వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మిగిలిన 6.75 లక్షల గృహాలను మార్చికల్లా పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు. -
ఎస్టీ గురుకులాల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం
మెగా డీఎస్సీ వల్ల గిరిజన గురుకులాల్లో పొరుగు సేవల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎలాంటి అన్యాయం జరగదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. -
టెట్, మెగా డీఎస్సీ సన్నద్ధతకు సమయం పెంపు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), మెగా డీఎస్సీ సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అభ్యర్థులు, వివిధ విద్యార్థి, -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సు తొలగింపు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సును కళాశాల విద్యాశాఖ మూసివేసింది. బీకాం కంప్యూటర్స్ ఒక్కటే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. -
పట్టిసీమ.. అన్నదాతల కొంగు బంగారం
‘పట్టిసీమ..సీఎం చంద్రబాబు దార్శనికతకు ప్రతిబింబం..పోలవరం పూర్తి చేసేలోగా వరద నీటిని ఒడిసి పట్టి కృష్ణా డెల్టాతోపాటు రాయలసీమను సస్యశ్యామలం చేస్తుంది. అంతటి బృహత్తర పథకాన్ని వైకాపా గాలికొదిలేసింది. -
ఎత్తిపోతల్లో ఎగసిన గోదారి!
నైరుతి పలకరించి నెల రోజులు గడిచినా కృష్ణాలో ప్రవాహాల్లేవు. గోదావరిలో మాత్రమే కాస్త వరద పారుతోంది. ఈ నీటి పాయలను బీళ్ల వైపు మళ్లించాలని.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నిర్ణయించారు. -
కలరా కలకలం..
గత వైకాపా ప్రభుత్వం రక్షిత నీటి పైపులైన్లకు కనీసం మరమ్మతులు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. కలరా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. -
అన్నవరం వేదపాఠశాల విద్యార్థులకు అతిసారం
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు బుధవారం అతిసారం బారినపడ్డారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన ఎనిమిది మందికి దేవస్థానం సిబ్బంది వైద్యసేవలు అందించారు. -
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా
ఈ నెల 27వ తేదీన నిర్వహించాల్సిన గ్రూప్-2 మెయిన్స్ను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. పరీక్ష నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
క్లబ్ హౌస్ యజమానికి అధికారుల దాసోహం
పులివెందులలో ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం పేరుతో కడప ఎంపీ అవివాష్రెడ్డి బావ, క్లబ్హౌస్ యజమాని విజయశేఖర్రెడ్డికి అయాచిత లబ్ధి చేకూర్చేందుకు అధికారులు అడ్డదారులు తొక్కారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు బుధవారం తన రాజీనామా లేఖను అందజేయగా ఆయన దానిని ఆమోదించారు. -
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి చేయనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్
-
జోగి కబ్జాలో... ఎవరి పాపం ఎంత?
-
వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
-
కన్నబిడ్డ కసిరింది.. కన్నపేగు కుమిలింది
-
ఆరు నెలల చిన్నారి చికిత్సకు.. ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
-
క్షమించండి.. నెలలో తిరిగిస్తా.. ఉత్తరం రాసి చోరీకి పాల్పడ్డ దొంగ