- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Pension: ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు జులై ఒకటో తేదీ నుంచి పెంచిన పింఛన్ మొత్తం, ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి రూ.7 వేలు అందించనున్నట్టు ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు.
సచివాలయ సిబ్బందితో చేపడతాం
జులై 1 నుంచి పండుగ వాతావరణంలో నిర్వహిద్దాం
తొలి దశలో 183 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ
కష్టపడ్డ వారికి త్వరలో నామినేటెడ్ పదవులు
పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు జులై ఒకటో తేదీ నుంచి పెంచిన పింఛన్ మొత్తం, ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి రూ.7 వేలు అందించనున్నట్టు ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో ఇంటి వద్దనే పింఛన్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం సచివాలయాల సిబ్బందితో పింఛన్ల పంపిణీ అసాధ్యమన్న నేపథ్యంలో.. అది సాధ్యమని నిరూపించడానికే పంపిణీలో వారిని వినియోగిస్తున్నట్టు తెలిపారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ప్రభుత్వం నుంచి వారికో హామీ పత్రం కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తానూ ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పాల్గొనాలని సూచించారు. తెదేపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, పరిశీలకులు, ముఖ్యనేతలతో చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. తొలి దశలో 183 అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో వీటి నిర్వహణ ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో అధికారం ఉందనే అహంకారంతో విర్రవీగి తెదేపా నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన వైకాపా నేతల్ని తెదేపాలోకి తీసుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే విజయానికి కృషి చేసిన వారిని నామినేటెడ్ పోస్టుల్లో నియమించనున్నట్లు తెలిపారు. వారి వివరాల్ని సేకరిస్తున్నామన్నారు. ‘పార్టీ నేతలు ఇచ్చే వివరాలతో పాటు, ఇతర మార్గాల్లోనూ నివేదికలు తెప్పించుకుంటున్నాను. కష్టపడిన వారికే పదవులు వచ్చేలా చూస్తాను. పార్టీ కోసం శ్రమించిన వారిని ఆదుకుంటేనే పార్టీ కూడా బలంగా ఉంటుంది’ అని చంద్రబాబు తెలిపారు.
అన్యాయం చేసిన వారిని ఉపేక్షించం
గత ప్రభుత్వంలో తెదేపాకు నష్టం చేసిన వారిని, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారినీ వదిలేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. మనకు అధికారం వచ్చిందని స్వలాభం కోసం ఇప్పుడు పార్టీలోకి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘ప్రజలు నమ్మి, మనల్ని గెలిపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. పొత్తులో భాగంగా 31 మంది ఇన్ఛార్జులకు సీట్లు ఇవ్వలేకపోయాం. అయినా వారు వెనకడుగు వేయకుండా ఎన్డీయే గెలుపు కోసం పనిచేశారు. అందుకే చరిత్ర తిరగరాసేలా ఫలితాలు వచ్చాయి. 57 శాతం ఓట్లు సాధించి.. 93 శాతం స్ట్రైక్రేట్తో గెలిచాం’ అని చంద్రబాబు అన్నారు. రైట్ మ్యాన్.. రైట్ పొజిషన్ అనే విధంగా భవిష్యత్తు నిర్ణయాలు ఉండబోతున్నాయని, 2029 ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు.
బీసీలకు ఎప్పుడూ సముచిత స్థానం
‘గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి గౌరవించాం. మరో బీసీ నేత అయ్యన్నపాత్రుణ్ని స్పీకర్గా నియమించాం. తెదేపాలో ఎప్పుడూ బీసీలకు సముచిత స్థానం ఉంటుంది. మంత్రిమండలి కూర్పులో కూడా సామాజిక సమతూకం పాటించాం’ అని చంద్రబాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరం విధ్వంసం.. రూ.వేల కోట్ల నష్టం
జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
రివర్స్ టెండర్లలో ఆదా వట్టిదే
‘‘జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైంది. 2020 జులై నుంచి 2024 జూన్ వరకు ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్ పనులు ఏవీ చేయలేదు. -
భోగాపురంలో భూబకాసురులు
వైకాపా ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం అనేది ఆ పార్టీ నేతలు, వారితో అంటకాగే కొంతమంది అధికారులు హక్కుగా భావించిన పరిస్థితి. -
ఇంటింటా నైపుణ్య గణన
జనాభా లెక్కింపు మాదిరి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది. -
నిఘా విభాగం అధిపతిగా మహేష్చంద్ర లడ్హా!
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం అధిపతిగా మహేష్చంద్ర లడ్హా నియమితులు కానున్నారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఐజీగా కొనసాగుతున్నారు. -
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన గవర్నర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. -
కృష్ణపట్నం పోర్టులో కంటెయినర్ టెర్మినల్ పునరుద్ధరించాలి
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని కంటెయినర్ టెర్మినల్ను పునరుద్ధరించాలని, లేదంటే ప్రాణాలిచ్చేందుకూ వెనుకాడమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. -
కృష్ణపట్టిలో పెద్దపులి
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. -
వైకాపా వీర విధేయ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా
వైకాపాతో అంటకాగి, ఆ పార్టీకి వీరవిధేయుడిగా పేరొందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) ప్రసాదరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. -
వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా
‘‘కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకొని బియ్యం అక్రమ రవాణా చేశారు. ప్రభుత్వం రూ.39కి కిలో బియ్యం అందిస్తుంటే.. పేదల వద్ద రూ.7కి కొనుగోలు చేశారు. -
ఎన్టీఆర్ మోడల్ స్కూల్ను సందర్శించిన భువనేశ్వరి
నిరుపేద చిన్నారులకు అదో అక్షరాల గుడి.. తల్లిదండ్రుల్లేని వారిని అక్కున చేర్చుకున్న అమ్మ ఒడి..అదే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్. -
14 అడుగుల గిరినాగు పట్టివేత
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడలో 14 అడుగుల గిరినాగు (కింగ్ కోబ్రా) హల్చల్ చేసింది. అందరూ చూస్తుండగానే ఎస్సీ కాలనీలోని ఓ గుడిసెలోకి చొరబడింది. -
వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్పై వైకాపా పడగ
వైజాగ్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ (వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్)పై వైకాపా స్వారీ చేస్తోంది. కల్చరల్ సెంటర్కు సాధారణంగా ఒకటే కమిటీ ఉంటుంది. -
దారి కొట్టుకుపోయింది.. అవస్థలు మిగిలాయి..!
పక్కా రోడ్డు కోసం గిరిజనులు ఏళ్లుగా ఎదురుచూశారు. ప్రభుత్వం కనికరించి పనులు మొదలుపెట్టి.. మధ్యలోనే వదిలేసింది. ఇంకేం.. చేసిన కాస్త పనులూ వర్షాలకు కొట్టుకుపోయాయి. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. -
గత సర్కారు నిర్లక్ష్యం.. కొత్త ప్రభుత్వంపై చక్కదిద్దే భారం
గత ప్రభుత్వం పాఠశాలల్లో అసంపూర్తిగా వదిలేసిన మౌలికసదుపాయాల పనులను పూర్తి చేయడం కొత్త ప్రభుత్వానికి సవాల్గా మారనుంది. -
అరాచక అధికారులపై సర్కారు డేగకన్ను!
వైకాపా హయాంలో గత అయిదేళ్ల పాటు రాష్ట్రంలో కొనసాగిన దాష్టీకాలు, అరాచకాలు, అక్రమాలు, దాడులు, రాజకీయ హత్యలు, తప్పుడు కేసులకు బాధ్యులైన పోలీసు అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
గ్రామాలకు జగన్ ద్రోహం
గ్రామీణాభివృద్ధికి దోహదం చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలకు గత వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులివ్వకుండా భ్రష్టు పట్టించడమే కాదు.. కేంద్రం ఇతర పథకాల కింద ఇచ్చే నిధులూ ఉపయోగించుకోలేకపోయింది. -
తితిదేలో అక్రమాల చిట్టా సిద్ధం!
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదేళ్ల కాలంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు నడుం బిగించిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులు తమ పరిశీలనను ముగించారు. -
ఒక ముఖ్యమంత్రికి 986 మంది భద్రత కావాలా?
‘ఒక ముఖ్యమంత్రికి 986 మంది సిబ్బందితో భద్రత కావాలా? పరదాలు కట్టుకుని తిరగడం, చెట్లు కొట్టేయడం.. ఏమిటిది? నేరస్థులకు సెక్యూరిటీ కావాలని అంటున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయవ్య దిశగా పయనించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
పంచశీల ఒప్పందం భేష్.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
-
ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్ హాసన్
-
అవును నేను వృద్ధుడినే.. కానీ: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?
-
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు