- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Free Sand: ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.
ఇకపై టన్ను ఇసుకపై రూ.287 మిగులు
సీనరేజ్ కింద రూ.88 మాత్రమే వసూలు
ఆ మొత్తమూ స్థానిక సంస్థల ఖాతాలకే
ఈనాడు, అమరావతి: ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.
- ఇకపై రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
- ఇప్పటి వరకు టన్ను రూ.475 చొప్పున విక్రయించారు. ఇందులో గుత్తేదారు తవ్వకాలు, రవాణా ఖర్చు రూ.100 తీసేయగా, మిగిలిన రూ.375 ప్రభుత్వానికి చేరేది.
- ఇకపై రూ.375 కాకుండా.. కేవలం రూ.88 వసూలు చేస్తారు. ఆ మొత్తమూ స్థానిక సంస్థలకే జమ కానుంది. ఇందులో.. సీనరేజ్ ఛార్జి కింద తీసుకునే రూ.66(టన్నుకు) నేరుగా జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు చేరుతుంది. జిల్లా ఖనిజ నిధి కింద రూ.19.80 చొప్పున వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఖాతాలోకి వెళ్తుంది. ఖనిజాన్వేషణ నిధి కోసం వసూలు చేసే మిగతా రూ.1.32 గనులశాఖలో ఖనిజాన్వేషణ ట్రస్ట్కు చేరుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక కొనుగోలుదారులకు ఇకపై ప్రతి టన్నుకు రూ.287 భారం తగ్గుతుంది.
- ఈనెల 8 నుంచి నిల్వ కేంద్రాల్లో ఇసుక విక్రయాలు చేసినప్పుడు టన్నుకు రూ.88తోపాటు, ఆ నిల్వ కేంద్రానికి ఏ రీచ్ నుంచి ఇసుక తవ్వి, తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం, స్టాక్ పాయింట్లో లోడింగ్ అయ్యే ఖర్చు తీసుకోనున్నారు. ఈ రేట్ను కలెక్టర్లు ఖరారు చేస్తారు.
- బోట్స్మెన్ సొసైటీలు పడవల్లో నదుల్లోకి వెళ్లి తెచ్చే ఇసుకను ఇప్పటి వరకు టన్ను రూ.625కి విక్రయించారు. ఇందులో బోట్స్మెన్ సొసైటీకి.. టన్నుకు రూ.200 చొప్పున చెల్లిస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో ఇకపై బోట్స్మెన్ సొసైటీలు తెచ్చే టన్ను ఇసుకకు రూ.200, సీనరేజ్ రూ.88 కలిపి రూ.288కే ఇకపై ప్రజలకు విక్రయించనున్నారు.
- సెప్టెంబరు వరకు ఆన్లైన్ పర్మిట్లు వంటివి లేకుండా ఇసుక విక్రయించనున్నారు.
- అక్టోబరు నుంచి నదుల్లో తవ్వకాలు ఆరంభించే నాటికి ఆన్లైన్ పర్మిట్లు జారీచేసి, ఆన్లైన్ చెల్లింపులు తీసుకురానున్నారు.
- ఇసుక తరలించే ప్రతి లారీ, ట్రాక్టర్ గనులశాఖ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఓ రూట్కు అనుమతి తీసుకొని, మరో మార్గంలో వెళితే చర్యలు తీసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమరావతి ఓఆర్ఆర్కు పచ్చజెండా
రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. -
రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం
గత ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. -
కోట్ల ప్రజాధనం.. వైఎస్ విగ్రహాలపాలు
ఇడుపులపాయలోని వైఎస్సార్ స్మారక రాజీవ్ నాలెడ్జి వ్యాలీలో ఏర్పాటు చేసిన రాజశేఖర్రెడ్డి విగ్రహాలు ఎన్నో తెలుసా? మొత్తం 23. -
సీమ ముఖచిత్రం మార్చనున్న హైదరాబాద్ - బెంగళూరు హైవే
రాయలసీమ ముఖచిత్రం త్వరలో మారిపోనుంది. గతంలో ఎన్నడూలేనంతగా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు కళకళలాడనున్నాయి. -
ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
రాష్ట్ర సమస్యల పరిష్కారం దిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. -
పోతేపోనీ అని వదిలేశారు!
గత జగన్ ప్రభుత్వ నిర్వాకంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ. 250 కోట్ల నిధుల్ని రాష్ట్ర పోలీసు శాఖ కోల్పోయింది. -
ఇద్దరు తెలుగు సీఎంల భేటీ నేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం ముఖాముఖి భేటీ కాబోతున్నారు. -
సహకార సంఘాలకు వైకాపా చెదలు
వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలోని అధికశాతం సహకార బ్యాంకుల్ని ఊడ్చేశారు. రుణాల పేరుతో ఎడాపెడా కొల్లగొట్టారు. -
ప్రజాదర్బార్కు వినతుల వెల్లువ
రాష్ట్ర మానవవనరులు, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్కు.. మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించారు. -
హమ్మయ్య.. ఈ చెట్లు బతికిపోయాయి
రహదారిపై పందిరి వేసినట్లు కనువిందు చేస్తున్న ఈ దృశ్యం.. రాజధాని అమరావతిలోనిది. నేలపాడులో హైకోర్టు ఎదుట రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లు సుందరంగా కనిపించడమే కాదు.. దారెంట నీడనిస్తున్నాయి. -
పవన్కల్యాణ్ వారాహి దీక్షోద్వాసన
ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వారాహి ఏకాదశ దీక్ష శుక్రవారం కలశోద్వాసన క్రతువుతో ముగించారు. -
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి బాధ్యులెవరు?
‘అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఉన్న అధికారులు ఎవరు? పింఛా ప్రాజెక్టు నిండిపోయి అన్నమయ్యకు అంచనాకు మించి వరద వస్తుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారు? -
రాజధాని నిర్మాణానికి తొలి వేతనం విరాళం
విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్సభ సభ్యుడిగా అందుకున్న తొలి గౌరవ వేతన మొత్తం రూ.1.57 లక్షలను అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. -
తితిదే నిర్ణయించిన ధరలకే ఆహారమందిస్తాం
తిరుమలలోని ఏపీ టూరిజం హోటళ్లలో తితిదే నిర్ణయించిన ధరలకే నాణ్యమైన ఆహారం అందిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న టాటా గ్రూప్ ఛైర్మన్, రేమండ్స్ సీఎండీ
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం బ్రేక్ దర్శన సమయంలో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, రేమండ్స్ గ్రూప్ సీఎండీ గౌతమ్ సింఘానియా వేర్వేరుగా దర్శించుకున్నారు. -
ద్వారంపూడి సంస్థకు షోకాజ్ నోటీసులివ్వండి
కాకినాడ నగర వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. -
పేదల భూముల్ని చౌకగా కొట్టేశారు
పేదలకు ఇచ్చిన ఎసైన్డ్ భూములను వైకాపా పెత్తందార్లు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కుల కల్పనపై గత వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి, తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. -
ధ్రువపత్రాలు ఎందుకు అందించలేదో వివరణ ఇవ్వండి
మాజీ మంత్రి, వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ జడ్జి ఎస్.రామకృష్ణ 2021లో వేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన కేసులో దిగువ కోర్టు ధ్రువపత్రాలు(సర్టిఫైడ్ కాపీలు) ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. -
9, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. -
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాల సమయంలోనూ రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో శుక్రవారం 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. -
ఎర్రచందనం దందాలో పెద్ద తలకాయల్ని పట్టుకోండి
ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖాధికారులను ఆదేశించారు.