- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Andhra university: వైకాపా వీర విధేయ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా
వైకాపాతో అంటకాగి, ఆ పార్టీకి వీరవిధేయుడిగా పేరొందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) ప్రసాదరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
అదే బాటలో రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్
స్వేచ్ఛ లభించిందంటూ ఏయూలో కేక్ కోసిన ఉద్యోగులు
రాజీనామాలు చేసిన కృష్ణా, ఉర్దూ, ద్రవిడ వర్సిటీల వీసీలు
ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: వైకాపాతో అంటకాగి, ఆ పార్టీకి వీరవిధేయుడిగా పేరొందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) ప్రసాదరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొందరు ఉద్యోగులు శుక్రవారం కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం మారడంతో ఒక్కొక్కరుగా వీసీలు తమ పదవులకు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఆంధ్ర వర్సిటీ వీసీ ప్రసాదరెడ్డితో పాటు కృష్ణా వర్సిటీ వీసీ జి.జ్ఞానమణి, ఉర్దూ వర్సిటీ వీసీ ఎఫ్.రెహ్మాన్, ద్రవిడ వర్సిటీ వీసీ కొలకలూరి మధుజ్యోతి రాజీనామా చేశారు. వీరందరి స్థానాల్లో ఇన్ఛార్జులను నియమించేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అడ్డదారిలో ఆంధ్ర వర్సిటీలోకి అడుగుపెట్టి, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్ పదవి చేపట్టిన జేమ్స్ స్టీఫెన్ కూడా రాజీనామా సమర్పించారు. వీసీ, రిజిస్ట్రార్లు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ ఏయూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 14 రోజులుగా నిరసన చేయడం.. అదే సమయంలో ఉద్యోగ, దళిత, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తం కావడంతో వీసీ పదవికి ప్రసాదరెడ్డి రాజీనామా చేశారు.
ఉన్నత విద్యలో అరాచకశక్తి
ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిభను వీసీ ప్రసాదరెడ్డి మసకబార్చారు. ఫక్తు వైకాపా నాయకుడిలా.. అరాచకశక్తిగా వ్యవహరించారు. వర్సిటీలో జగన్ పుట్టినరోజు వేడుకలు, వైఎస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. వైకాపా నేత విజయసాయిరెడ్డితో కలిసి జీవీఎంసీ ఎన్నికల్లో.. వైకాపా విజయానికి వ్యూహాలు రచించారు. ఆ పార్టీ తరఫున టికెట్లు ఎవరికి కేటాయించాలో కూడా ఆయనే చెప్పారనే ఆరోపణలున్నాయి. తర్వాత ఉత్తరాంధ్ర వైకాపా ఇంఛార్జిగా వైవీ సుబ్బారెడ్డిని నియమించడంతో ఆయన మెప్పు పొందేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నాలు చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఏయూ పరిధిలోని కళాశాలల అధ్యాపకులతో దసపల్లా హోటల్లో సమావేశం నిర్వహించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ వైకాపా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మిని గెలిపించాలని విద్యార్థులతో సర్వేలు చేయించినట్లు ఆరోపణలున్నాయి.
శిష్యుడికి కీలక పదవి
ప్రైవేటు కళాశాలలో పనిచేసిన జేమ్స్ స్టీఫెన్కు అర్హత లేకున్నా అంబేడ్కర్ అధ్యయన కేంద్రం ఛైర్ ప్రొఫెసర్గా తాత్కాలిక నియామకం పేరుతో వర్సిటీలో స్థానం కల్పించారు. కొద్దిరోజులకే ట్రాన్స్డిసిప్లినరీ రీసెర్చ్ (టీడీఆర్) హబ్ డీన్గానూ బాధ్యతలు అప్పగించారు. సీనియర్ ఆచార్యులను పక్కనపెట్టి గతేడాది సెప్టెంబరులో రిజిస్ట్రార్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రసాదరెడ్డి శిష్యుడు కావడంతో మిగిలిన ఆచార్యులెవరూ దీనిపై నోరు మెదపలేదు.
బెదిరింపులు.. అక్రమ కేసులు
వైకాపా నేతల అండతో గత ఐదేళ్లు ప్రసాదరెడ్డి నియంతలా వ్యవహరించారు. ఆయన అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే స్థానిక పోలీసుల సహకారంతో అక్రమ కేసులు పెట్టడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రతిపక్షాలతో సంబంధమున్న, ఆ పార్టీల నాయకులను అభిమానించే ఉద్యోగులను ఏదో కారణంతో ఇబ్బంది పెట్టేవారు. టీడీఆర్ హబ్ పేరిట పీహెచ్డీ సీట్లు విక్రయించారు. వర్సిటీ ఇంజినీరింగ్ హాస్టళ్లకు సమీపంలోని చెట్లను నరికించి, నీటి గెడ్డలను పూడ్చేశారు. దీనిపై ఫిర్యాదు వెళ్లడంతో అటవీశాఖ అధికారులు వర్సిటీ అధికారులపై కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ ఆచార్యులను వేధింపులకు గురిచేశారు.
ప్రైవేటు సైన్యం ఏర్పాటు
తన నియంతృత్వ పోకడలకు ప్రతీకగా ప్రసాదరెడ్డి ఏకంగా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటుచేసుకున్నారు. రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ లేనివిధంగా ఏయూలో భద్రత అవసరాల పేరిట ‘చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్’ పదవిని సృష్టించారు. ఆ పదవిలో విశ్రాంత పోలీసు అధికారి మొహమ్మద్ ఖాన్ను నియమించారు. రూసా నిధుల నుంచి ఆయనకు నెలకు రూ.లక్ష వరకు జీతం చెల్లిస్తున్నారు. అప్పటికే వర్సిటీలో 100 మంది వరకు భద్రతాసిబ్బంది పనిచేస్తుండగా.. తన మనుషులు 100 మందిని విధుల్లోకి తీసుకున్నారు. వీసీ చుట్టూ ఐదుగురు సిబ్బందిని పెట్టి, ఆయన రాగానే కారు డోర్ తీయడం, సెల్యూట్ చేయడం వంటివి చేయించేవారు.
ప్రసాదరెడ్డి హయాంలో ఎలాంటి ప్రకటనా లేకుండా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన 45 మందికి పైగా ఏయూలో అనుబంధ ఆచార్యులుగా నియమించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా మరో 15మంది సహాయ ఆచార్యులను ఒప్పంద ప్రాతిపదికన నియమించారు. అడ్మిషన్లు తగ్గాయనే సాకుతో దాదాపు 28 కోర్సులను మూసేసి, 15 ఏళ్లుగా పనిచేస్తున్న 250 మంది అతిథి అధ్యాపకులను రోడ్డున పడేశారు.
వైకాపాకు జైకొట్టిన కృష్ణా వీసీ
వైకాపా మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని సిఫార్సులతో ఔట్సోర్సింగ్లో చాలామందిని ఉద్యోగాల్లో నియమించినట్టు కృష్ణా వీసీ జ్ఞానమణిపై ఆరోపణలున్నాయి. రూ.10 కోట్ల విశ్వవిద్యాలయ నిధులను ప్రభుత్వానికి మళ్లించారు. విశ్వవిద్యాలయంలో వసతిగృహాలు, ఫార్మసీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, ఫుడ్కోర్టు వంటి నిర్మాణాల విషయంలో తీవ్ర జాప్యం చేశారనే విమర్శలున్నాయి.
వీరి పరిస్థితి ఏంటి?
వైకాపాతో అంటకాగిన ఆచార్య నాగార్జున వర్సిటీ వీసీ రాజశేఖర్, విక్రమసింహపురి వర్సిటీ వీసీ సుందరవల్లి రాజీనామాలు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండు చేస్తున్నాయి. నాగార్జున వర్సిటీ వీసీ రాజశేఖర్ మూడు రాజధానులకు మద్దతుగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. వీసీగా బాధ్యతలు స్వీకరించేవేళ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. పలుమార్లు జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. వైకాపా ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం వర్సిటీ స్థలాన్ని కేటాయించారు. వర్సీటీకి సెలవులు ఇచ్చి, పరీక్షలనే వాయిదా వేసిన వైకాపా వీరవిధేయుడు రాజశేఖర్.
విక్రమ సింహపురి వీసీ సుందరవల్లి మాజీ సీఎం జగన్కు సమీప బంధువు. పరిపాలన భవనానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు, ఆ భవనంలో ఆయన విగ్రహాన్ని పెట్టి స్వామిభక్తి చాటుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక ఉద్యోగులను నియమించారు. పదోన్నతుల్లోనూ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్ఫోన్లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. -
విజయవాడ హైవేపై.. ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్ల ప్రారంభం
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది.