- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rains: తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి.
జూన్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున సాధారణం కంటే 59% అధికంగా వానలు
రాయలసీమలో మరింత ఎక్కువగా..
గుంటూరు ఏటీ అగ్రహారం 14వ లైనులో నిలిచిన వర్షం నీరు
ఈనాడు, అమరావతి-గుంటూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని జిల్లాలోనూ సాధారణం కంటే అధికంగా వానలు కురిసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముసురు వాతావరణం నెలకొంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి పల్నాడు వరకు చాలాచోట్ల ఎడతెరపిలేని జల్లులు పడుతున్నాయి. వర్షాలు అనుకూలిస్తుండటంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. దుక్కి దున్నించి విత్తనం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నంద్యాల జిల్లాలో 152% అధికంగా
నంద్యాల జిల్లాలో సాధారణం కంటే 152% అధికంగా వర్షపాతం నమోదైంది. రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ వర్షాలు సాధారణం కంటే ఎక్కువగానే ఉన్నాయి. అనంతపురం 141.1%, చిత్తూరు 131.3, శ్రీసత్యసాయి 122.4, అన్నమయ్య 105.4, వైఎస్సార్ 95.8, కర్నూలు 79.8, తిరుపతి 60.5% చొప్పున అధికంగా వానలు కురిశాయి. కృష్ణా జిల్లాలోనూ సాధారణం కంటే 101% ఎక్కువ వర్షపాతం నమోదైంది.
శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు అత్యధికంగా గుంటూరు పశ్చిమ మండలంలో 113 మి.మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా బుట్టాయగూడెంలో 94.75 మి.మీ వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్టలో 83.0, బాపట్ల జిల్లా కూచినపూడిలో 72.75, రాజధాని అమరావతిలో 66.75, కృష్ణా జిల్లా భావదేవరపల్లిలో 54.25, పల్నాడు జిల్లా చాగల్లులో 54.0, ఏలూరులో 51.25 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం కూడా కోస్తాలో ముసురు వాతావరణం నెలకొంది. ఎడతెరపి లేకుండా చెదురుమదురు జల్లులు పడుతున్నాయి.
గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం
పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్ పైనుంచి ప్రవహిస్తున్న నీరు
పోలవరం, న్యూస్టుడే: పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద ఆదివారం సాయంత్రానికి 24.40 మీటర్లకు నీరు చేరుకుంది. దీంతో స్పిల్వేలోని రివర్ స్లూయిజ్ గేట్ల నుంచి స్పిల్ ఛానల్లోకి నీరు ప్రవహిస్తోంది. నీటి మట్టం పెరుగుతుండటంతో స్పిల్ ఛానల్పై రాకపోకలకు వీలుగా వేసిన అడ్డుకట్టకు కొంత మేర గండి కొట్టినట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
మూడేళ్ల క్రితం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. -
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
వైకాపా అధినేత జగన్కు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి బినామీగా వ్యవహరిస్తున్నట్లు ఏపీ సాధు పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు, ఆనందాశ్రమం పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. -
ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం
రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికే పైరవీ బదిలీలు.. గత ఎన్నికల ముందు సిఫార్సు బదిలీలతో మాజీ మంత్రి రూ.50 కోట్లకుపైగా దండుకున్న వైనం.. సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరం.. ఇలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. -
పులివెందులలో ‘ఫోర్ స్టార్’ పన్నాగం
స్టార్ హోటళ్లు ఎక్కడ కడతారు? సందర్శకులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే నగరాల్లో కదా. కానీ ఘనత వహించిన జగన్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? పర్యాటకులే రాని పులివెందులలో ఫోర్స్టార్ హోటల్ కట్టేందుకంటూ తమ బంధువు క్లబ్హౌస్ను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థతో రూ.12.87 కోట్లతో కొనిపించింది. -
అమ్మ వెంకటరెడ్డీ.. ఇంత మోసమా?
జగన్ ప్రభుత్వంలో సాగిన ఇసుక దోపిడీలో ఆశ్చర్యకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ‘ముఖ్య’నేతలు భారీగా ఇసుక సొమ్ము దోచేయగా.. గుత్తేదారు పూర్తిగా డబ్బు చెల్లించకుండా ప్రభుత్వానికి రూ.800 కోట్ల బాకీ ఉండగా.. బకాయి లేదంటూ గనులశాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఏకంగా నో డ్యూ సర్టిఫికెట్ జారీచేసేశారు. -
ఆడపిల్లల అదృశ్యంపై ప్రత్యేక సెల్
‘‘ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదేళ్లలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే వైకాపా ప్రభుత్వం కనీసం ప్రెస్మీట్ కూడా పెట్టలేదు. పోలీసులూ స్పందించలేదు. -
‘వేలిముద్రలు’ చెరిపేసిన నేరం జగన్దే!
గత వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర పోలీసు శాఖ 10 లక్షల మందికి పైగా నేరగాళ్ల వేలిముద్రలను నిక్షిప్తపరిచిన అధునాతన సర్వర్లు కాలిపోయాయి. -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి: మంత్రి లోకేశ్
విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. -
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో.. సాంకేతిక సమస్యలను అధిగమించాలి
డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. -
‘ఆర్థిక’ శ్వేతపత్రం రూపకల్పనపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆరా
జగన్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక అరాచకంపై శ్వేతపత్రం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం తన ఛాంబరులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కార్యదర్శులు వినయ్చంద్, జానకి తదితరులతో సమావేశమయ్యారు. -
విశాఖ జైల్లో గంజాయి ఖైదీలే ఎక్కువ
విశాఖ జైల్లో 2 వేల మంది ఖైదీలు ఉండగా.. వారిలో 1,200 మంది గంజాయి ఖైదీలే ఉండటం విచారకరమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. -
18 వేల టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
కాకినాడ, పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ బృందాలు మంగళవారం పలు గోదాముల్లో తనిఖీలు కొనసాగించాయి. రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటీ డెమో పోస్టు భర్తీ
వైద్య, ఆరోగ్యశాఖ జోన్-3 పరిధిలోని డిప్యూటీ మాస్ మీడియా అధికారి (డెమో) పోస్టును నిబంధనలకు విరుద్ధంగా జోన్-4 అధికారులు భర్తీ చేయడం చర్చనీయాంశమైంది. -
అమరావతి అనుసంధాన రహదారుల అభివృద్ధి
రాజధాని అమరావతికి అనుసంధాన రహదారి అభివృద్ధి, కరకట్ట రోడ్డు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలకమని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే విశాలమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి రూపకల్పన చేశారు. -
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు త్వరలో శిక్షణ
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. విజయనగరంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. -
అచ్యుతాపురం సెజ్లో కృతిమ మేధ పరిశ్రమ
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో తొలిసారి కృత్రిమ మేధ కంపెనీ అడుగుపెట్టబోతోంది. సబ్స్ట్రాక్ట్ మాన్యుఫ్యాక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్ప్రైజ్ (స్మైల్) పేరుతో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. -
టెస్లాతో మళ్లీ సంప్రదింపులు
పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించేందుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించింది. -
154 ఏళ్ల తర్వాత నల్లమలలో అడవి దున్న
నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించింది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్లో కెమెరా ట్రాప్లో దాని చిత్రాలు నమోదయ్యాయి. -
ఏపీ నిఘా విభాగాధిపతిగా మహేష్చంద్ర లడ్హా
రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా మహేష్చంద్ర లడ్హాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన లడ్హా కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకుని మంగళవారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. -
ఇసుక విధానంపై సీఎం కీలక భేటీ
రాష్ట్రంలో ఇసుక విధానం అమలుపై సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. -
నిత్యావసరాల ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి
పెరిగిన నిత్యావసరాల ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!