- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
SIT: చంద్రబాబు, నారాయణలను కేసుల్లో ఇరికించడమే లక్ష్యం
జగన్ ప్రభుత్వం అప్పట్లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ తదితరులపై అక్రమ కేసులు బనాయించేందుకు, వారికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా పలువురు ఐఏఎస్ అధికారుల్ని బెదిరించింది.
ఎసైన్డ్ భూములు, ఐఆర్ఆర్ కేసుల్లో చెలరేగిపోయిన సిట్
విచారణ పేరుతో అధికారులపై కిరాతక, అమానవీయ ప్రవర్తన
భయపెట్టి... బెదిరించి... స్టేట్మెంట్లపై సంతకాలు
ఈనాడు, అమరావతి: జగన్ ప్రభుత్వం అప్పట్లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ తదితరులపై అక్రమ కేసులు బనాయించేందుకు, వారికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా పలువురు ఐఏఎస్ అధికారుల్ని బెదిరించింది. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, నారాయణ తదితరులు అవినీతికి, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని వారిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది. ఆ కేసుల దర్యాప్తు కోసమే ఐపీఎస్ అధికారి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)... సీనియర్ ఐఏఎస్ అధికారుల విచారణ పేరుతో అత్యంత అమానవీయంగా వ్యవహరించింది. వారిని అవమానిస్తూ, మానసికంగా కుంగిపోయేలా చేసింది. అప్పట్లో జరిగిన ఘోరాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. రాజధానిలో అక్రమంగా ఎసైన్డ్ భూములు కొన్నారని, వారి ఆస్తులకు విలువ పెరిగేలా రాజధాని ఇన్నర్ రింగ్రోడ్డు (ఐఆర్ఆర్) ఎలైన్మెంట్ను మార్చుకున్నారని పెట్టిన అక్రమ కేసుల్లో చంద్రబాబు, నారాయణలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని అప్పటి సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ను, ఐఆర్ఆర్పై పనిచేసిన కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగుల్ని సిట్ తీవ్రంగా బెదిరించి స్టేట్మెంట్లు తీసుకుంది. చంద్రబాబు, నారాయణ పేర్లు చెప్పండి చాలు... మిమ్మల్ని వదిలేస్తామని ప్రత్యేక ఆఫర్లూ ఇచ్చింది. వారి పేర్లు చెప్పేందుకు శ్రీధర్ అంగీకరించకపోవడంతో... సిట్ అధికారులు తామే రాసుకొచ్చిన స్టేట్మెంట్లపై ఆయనతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు.
తొలుత దొంగతనం కేసు
అప్పట్లో గుంటూరు జేసీగా భూసమీకరణలో కీలకంగా వ్యవహరించి, తర్వాత సీఆర్డీయే కమిషనర్గా పనిచేసిన శ్రీధర్తో... చంద్రబాబు, నారాయణలపై తప్పుడు వాంగ్మూలం ఇప్పించడమే లక్ష్యంగా సిట్ కుట్రపూరిత ఎత్తుగడలకు పాల్పడింది. ఆయనపై అన్నివైపుల నుంచీ ఒత్తిడి తెచ్చేందుకు మొదట దొంగతనం కేసు బనాయించింది. ఆయన గుంటూరు జేసీగా ఉన్నప్పుడు రాజధాని గ్రామాల రెవెన్యూ రికార్డులను దొంగతనంగా పట్టుకుపోయారని కేసు పెట్టింది. వెంకటేశ్వర్లు అనే విశ్రాంత తహసీల్దారుతో జేసీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇప్పించింది. జేసీ కారులో రికార్డులు తీసుకెళ్తుండగా తాను చూశానని... కలెక్టరేట్లో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగితో చెప్పించింది. తమను బెదిరించి రికార్డులు తీసుకెళ్లారంటూ రాజధాని గ్రామాల్లో పనిచేసే నలుగురైదుగురు వీఆర్ఓల్ని బెదిరించి వాంగ్మూలాలు తీసుకుంది. వాస్తవానికి రికార్డులన్నీ ఆయా గ్రామాల్లోనే ఉన్నాయి. ముందుజాగ్రత్తగా వాటి నకళ్లు కలెక్టరేట్లో భద్రపరిచారు. పైగా రికార్డులన్నీ ఆన్లైన్లోనూ ఉన్నాయి. అయినా ఎసైన్డ్ భూముల వ్యవహారంలో శ్రీధరే రింగ్మాస్టర్ అని, ఆయన రికార్డులు ఎత్తుకుపోయారని, వాటిలోని ఎసైన్డ్ భూముల వివరాలను చంద్రబాబు, నారాయణలకు చేరవేయడం ద్వారా వారికి లబ్ధి చేకూర్చారని జగన్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయించింది. ఎసైన్డ్ భూముల వ్యవహారంలో ఎలాంటి తప్పూ జరగలేదని వివరించి, ఆయన రికార్డులన్నీ అందజేస్తే... రైతులకు స్థలాలు కేటాయించేందుకు అనుసరించిన లాటరీ విధానంలో అవకతవకలు జరిగాయని మరో అభియోగాన్ని తెరపైకి తెచ్చింది. లాటరీ విధానం అత్యంత పక్కాగా జరిగిందని, కేంద్రం కూడా దాన్ని ప్రశంసించిందని చెబుతూ ఆ సర్టిఫికెట్ చూపించినా పట్టించుకోకుండా రోజుల తరబడి వేధించింది.
వారిద్దరి పేర్లు చెబితే వదిలేస్తామంటూ మైండ్గేమ్
ఆ అధికారి నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకోవడానికి సిట్ మైండ్గేమ్ అడింది. చంద్రబాబు, నారాయణ ఎసైన్డ్ భూములు కొన్నారని స్టేట్మెంట్ ఇస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయబోమని సిట్ అధికారులు ఆఫర్ ఇచ్చారు. కొందరు సిట్ అధికారులు ఆయనతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ... ‘‘మీ కుటుంబం గురించి ఆలోచించండి. రాజకీయ క్రీడలో మీరెందుకు బలిపశువు అవుతారు? వారిద్దరి పేర్లు చెప్పేస్తే పోతుంది కదా’’ అంటూ ఉచిత సలహాలిచ్చేవారని తెలిసింది. చివరకు చంద్రబాబు, నారాయణ రాజధానిలో ఎసైన్డ్ భూములు కొన్నారంటూ... సిట్ అధికారులే ఒక స్టేట్మెంట్ రాసుకొచ్చి సంతకం పెట్టాలన్నారు. దానికి ఆయన నిరాకరించడంతో... రెండు రోజుల తర్వాత కనీసం నారాయణపై అయినా స్టేట్మెంట్ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. చివరకు కొన్ని వీడియోలు, ఫొటోలు చూపించి... నారాయణతో ఉన్నవారు ఎవరని శ్రీధర్ను ప్రశ్నించారని, వారు రాజధాని గ్రామానికి చెందిన కొందరు రైతు నాయకులని, నారాయణతో ఉండేవారని ఆయన చెప్పారని తెలిసింది. దాంతో వారే నారాయణ కోసం ఎసైన్డ్ భూములు కొన్నట్టుగా సిట్ అధికారులు తప్పుడు అభియోగాలు మోపినట్టు సమాచారం.
కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగుల్ని ఎత్తుకొచ్చి..
రాజధాని ఐఆర్ఆర్ ఎలైన్మెంట్ నిర్ణయంలో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబు, నారాయణలపై తప్పుడు కేసు బనాయించేందుకు వారికి వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇవ్వాలని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ‘స్టూప్’కి చెందిన కొందరు ఉద్యోగుల్ని చెన్నై నుంచి సిట్ అధికారులు ఎత్తుకొచ్చారు. వారిని రాజమహేంద్రవరంలో ఉంచి తీవ్రంగా వేధించారు. చివరకు వారు చెప్పినట్టుగా కన్సల్టెన్సీ ఉద్యోగులు స్టేట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. సీఆర్డీయేలో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగులైన మనోజ్, అరవింద్ తమను బెదిరించి.. వారు చెప్పినట్టుగా ఓఆర్ఆర్ ఎలైన్మెంట్ తయారు చేయించారని కన్సల్టెన్సీ సిబ్బందితో సిట్ బలవంతంగా చెప్పించింది. మంత్రి నారాయణ, సీఆర్డీయే కమిషనర్ ఒత్తిడి మేరకే తాము అలా చేశామని మనోజ్, అరవింద్లతో చెప్పించింది. అవన్నీ శ్రీధర్ ముందు పెట్టి... చంద్రబాబు, నారాయణ, మీరు కుమ్మక్కైపోయారని బెదిరించింది.
భూముల విలువ పెంచుకునేందుకని తప్పుడు అభియోగాలు
విజయవాడలో నారాయణకు చెందిన భూములు, గుంటూరు జిల్లాలో హెరిటేజ్ సంస్థ భూముల విలువ పెంచేందుకు... ఐఆర్ఆర్ వాటి పక్కనుంచి వెళ్లేలా ఎలైన్మెంట్ నిర్ణయించారని సిట్ తప్పుడు అభియోగాలు మోపింది. ఐఆర్ఆర్కు కన్సల్టెన్సీ సంస్థ మూడు ఆప్షన్లు ఇవ్వగా... అప్పటి ప్రభుత్వం ఎంత కసరత్తు తర్వాత ఒక ఎలైన్మెంట్ను ఖరారు చేసిందో శ్రీధర్ వారికి వివరించినట్టు తెలిసింది. ఆ ఎలైన్మెంట్ ప్రతిపాదనను ప్రజలకు అందుబాటులో ఉంచి, అభ్యంతరాలు స్వీకరించి, వాటన్నిటినీ పరిష్కరించిన విషయాన్నీ ఆయన చెప్పినట్టు సమాచారం. అవి చంద్రబాబు, నారాయణలపై కేసు బిగించేందుకు ఉపయోగపడేలా లేకపోవడంతో సిట్ అధికారులు ఆయనపై మరింత ఒత్తిడి పెంచినట్టు తెలిసింది. చివరకు ఆయన మెయిల్ ఐడీ నుంచి మనోజ్ అనే సీఆర్డీయే ఉద్యోగికి ఒక మెయిల్ వెళ్లినట్టు, దానిలో పంపిన ఎలైన్మెంట్ను ఫాలో అవ్వాలని ఆయన సూచించినట్టు ఒక దొంగ మెయిల్ సృష్టించారని సమాచారం. దాన్ని కమిషనరే పంపినట్టుగా మనోజ్ నుంచి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నట్టు తెలిసింది. చివరకు నారాయణతో పాటు రాజధానికి ఎవరెవరు వచ్చేవారన్న వివరాలతో ఒక స్టేట్మెంట్ తయారుచేసి దానిపై శ్రీధర్ సంతకం తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రోత్సాహకాలు అందిస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. -
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం
రాబోయే వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మిగిలిన 6.75 లక్షల గృహాలను మార్చికల్లా పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు. -
ఎస్టీ గురుకులాల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం
మెగా డీఎస్సీ వల్ల గిరిజన గురుకులాల్లో పొరుగు సేవల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎలాంటి అన్యాయం జరగదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. -
టెట్, మెగా డీఎస్సీ సన్నద్ధతకు సమయం పెంపు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), మెగా డీఎస్సీ సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అభ్యర్థులు, వివిధ విద్యార్థి, -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సు తొలగింపు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సును కళాశాల విద్యాశాఖ మూసివేసింది. బీకాం కంప్యూటర్స్ ఒక్కటే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. -
పట్టిసీమ.. అన్నదాతల కొంగు బంగారం
‘పట్టిసీమ..సీఎం చంద్రబాబు దార్శనికతకు ప్రతిబింబం..పోలవరం పూర్తి చేసేలోగా వరద నీటిని ఒడిసి పట్టి కృష్ణా డెల్టాతోపాటు రాయలసీమను సస్యశ్యామలం చేస్తుంది. అంతటి బృహత్తర పథకాన్ని వైకాపా గాలికొదిలేసింది. -
ఎత్తిపోతల్లో ఎగసిన గోదారి!
నైరుతి పలకరించి నెల రోజులు గడిచినా కృష్ణాలో ప్రవాహాల్లేవు. గోదావరిలో మాత్రమే కాస్త వరద పారుతోంది. ఈ నీటి పాయలను బీళ్ల వైపు మళ్లించాలని.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నిర్ణయించారు. -
కలరా కలకలం..
గత వైకాపా ప్రభుత్వం రక్షిత నీటి పైపులైన్లకు కనీసం మరమ్మతులు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. కలరా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. -
అన్నవరం వేదపాఠశాల విద్యార్థులకు అతిసారం
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు బుధవారం అతిసారం బారినపడ్డారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన ఎనిమిది మందికి దేవస్థానం సిబ్బంది వైద్యసేవలు అందించారు. -
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా
ఈ నెల 27వ తేదీన నిర్వహించాల్సిన గ్రూప్-2 మెయిన్స్ను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. పరీక్ష నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. -
క్లబ్ హౌస్ యజమానికి అధికారుల దాసోహం
పులివెందులలో ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం పేరుతో కడప ఎంపీ అవివాష్రెడ్డి బావ, క్లబ్హౌస్ యజమాని విజయశేఖర్రెడ్డికి అయాచిత లబ్ధి చేకూర్చేందుకు అధికారులు అడ్డదారులు తొక్కారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు బుధవారం తన రాజీనామా లేఖను అందజేయగా ఆయన దానిని ఆమోదించారు. -
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి చేయనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. -
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
మీరేదైనా వాహనం కొంటే స్టిక్కరింగ్కు ఎంతవుతుంది? మహా అయితే రూ.2 వేల నుంచి రూ.5 వేలు. కానీ, వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశువైద్య సేవా వాహనాలకు రంగులు, జగన్ బొమ్మలు వేయించడానికి రూ.2.50 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా. -
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ ఏఓఆర్గా గుంటూరు ప్రమోద్కుమార్
సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వొకేట్ ఆన్ రికార్డ్ (ఏఓఆర్)గా గుంటూరు ప్రమోద్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ బుధవారం జీవో విడుదల చేసింది. -
1.81 లక్షల ఇంజినీరింగ్ సీట్లు
రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ), కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కలిపి 1,81,732 సీట్లకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆమోదం తెలిపింది. -
విద్యుత్ సంస్థల్లో 10 మంది డైరెక్టర్ల రాజీనామా
ఏపీ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల డైరెక్టర్ల రాజీనామాలను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో కొందరు గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
శ్రీవారి అన్నప్రసాదాలపై అవాస్తవాలు నమ్మొద్దు: తితిదే
శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాల్లో సేంద్రియ బియ్యం వాడకం నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని తితిదే నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం -
వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్మన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం బుధవారం కడప రిమ్స్కు తరలించారు. -
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
ఒంగోలు సత్యనారాయణపురంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. పిల్లర్ల దశలో ఉన్న భవనంలోనే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. నాడు-నేడు రెండో దశలో భాగంగా కొత్త భవనం నిర్మిస్తామని 2022లో పాత భవనాన్ని గత వైకాపా ప్రభుత్వం కూలగొట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
కన్నబిడ్డ కసిరింది.. కన్నపేగు కుమిలింది
-
ఆరు నెలల చిన్నారి చికిత్సకు.. ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
-
క్షమించండి.. నెలలో తిరిగిస్తా.. ఉత్తరం రాసి చోరీకి పాల్పడ్డ దొంగ
-
తూర్పుగోదావరి జిల్లాలో ప్రాణం నిలిపిన పింఛను!
-
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి చిత్రాలు
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?