- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ramoji Rao: పనిలోనే విశ్రాంతి పొందిన.. నిర్విరామ శ్రామికుడు
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు జీవిత ప్రస్థానంపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన లఘుచిత్రం (ఏవీ) స్ఫూర్తిదాయకంగా ఉంది.
తెలుగునాట.. ఆయన పేరు తెలియని ఊరు లేదు
రామోజీరావు జీవితాన్ని ఆవిష్కరించిన లఘుచిత్రం
ఈనాడు, అమరావతి: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు జీవిత ప్రస్థానంపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన లఘుచిత్రం (ఏవీ) స్ఫూర్తిదాయకంగా ఉంది. రామోజీరావు అకుంఠిత దీక్ష, పట్టుదల, కార్యసాధన.. తెలుగునేలపై సాగించిన అక్షరయజ్ఞం, మాతృభాషా పరిరక్షణ కోసం తపించిన విధానం, భారతీయ పత్రికారంగంలో అనితర సాధ్యమైన ప్రయోగాలు, పాత్రికేయ విలువలతో ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుంబిగించడం, తెలుగునాట ప్రకంపనలు సృష్టించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అద్భుతమైన విజయం సాధించేవరకూ ఎన్టీఆర్కు అందించిన సహకారం, తెలుగు ప్రజల ఘనకీర్తిని ప్రపంచ పటంపై చాటడం, ప్రజాసమస్యల పరిష్కారానికి సమరయోధుడిలా సాగించిన పోరు, ఆఖరి వరకూ ప్రజల పక్షాన నిలబడిన విధానం.. ఇవన్నీ తెలుగుజాతి ఉన్నంత వరకూ అఖండంగా వెలుగుతూనే ఉంటాయి.. అని రామోజీరావు జీవితంలోని అన్ని దశలనూ కళ్ల ముందు కదలాడేలా రూపొందించిన లఘుచిత్రం ఆహూతులను కట్టిపడేసింది. లఘుచిత్రంలో స్ఫూర్తిదాయకమైన అంశాలివీ..
దీక్షాదక్షుడు...
రామోజీరావు.. ఈ పేరు తెలియని ఊరు తెలుగునాట లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా మన జీవితాలతో పెనవేసుకుపోయిన అక్షర సైనికుడాయన. భారతీయ పత్రికారంగంలో అనితర సాధ్యమైన ప్రయోగాలు చేసిన శిఖర సమానుడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోను నిర్మించిన మహా స్వాప్నికుడు. ప్రజాస్వామ్యం పరీక్షా సమయాలను ఎదుర్కొన్న ప్రతిసారీ కలం పట్టి కదంతొక్కి దుర్మార్గాలను ఎండగట్టిన దీక్షాదక్షుడు.
ప్రజాప్రయోజనం తప్ప ఏదీ ముఖ్యం కాదు..
1936లో జన్మించి, 2024లో తన 88వ ఏట మహాప్రస్థానం చేరే వరకూ.. పనిలోనే విశ్రాంతి పొందిన ఈ నిర్విరామ శ్రామికుడికి ప్రజాప్రయోజనం తప్ప ఏదీ.. మరేదీ ముఖ్యం కాదని చెప్పొచ్చు. ఈ ఒక్క లక్ష్యం.. లక్షణమే రామోజీరావును నాడు నందమూరి తారకరామారావుకు, నేడు నారా చంద్రబాబునాయుడికి చేరువ చేసింది. ఆనాడు.. 1982లో నాటి చారిత్రక పరిస్థితుల దృష్ట్యా, తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు.. కొత్త రాజకీయ పతాకానికి రామోజీరావు స్వాగతం పలికారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా నదులు పారుతున్నా.. అన్నపూర్ణ ఒడిలో ఆకలి కేకలు వినిపించే దురవస్థ ఎందుకని ప్రశ్నించిన ఎన్టీఆర్కు ‘ఈనాడు’ పత్రిక వీరతిలకం దిద్దింది. తెలుగు భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పరిరక్షించాలనే ఎన్టీఆర్ ఆశయమే.. రామోజీరావును ఆయనకు ఆప్తుడిని చేసింది. స్థాపించిన తొమ్మిది నెలల్లోనే నవశకానికి నాంది పలుకుతూ తెలుగుదేశం సూపర్హిట్ కావడానికి రామోజీరావు చేసిన కృషి అనన్య సామాన్యం. ఇది ఆయన ఏ స్వప్రయోజనమూ ఆశించి చెయ్యలేదు. ఏడాదికోసారి ముఖ్యమంత్రులను మారుస్తూ, తెలుగు నేతలను కించపరుస్తూ, ప్రజాసమస్యలను గాలికొదిలేసిన నాటి చీకటి రాజకీయాన్ని నిగ్గదీసి.. నిప్పులతో కడిగేసి.. తెలుగునాట కొత్త సూర్యుడు ఉదయించేలా ఉద్యమించిన ధీరుడాయన. అపూర్వమైన వీరి కలయిక తెలుగునేలపై కొత్త రాజకీయానికి విత్తనాలు వేసింది.
తెలుగు ఘనకీర్తి ప్రపంచమంతా మార్మోగాలని..
తెలుగు ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ముందంజ వేయాలి. తెలుగు ఘనకీర్తి ప్రపంచమంతా మార్మోగాలని కలలు కనేవారు రామోజీరావు. అందుకే నారా చంద్రబాబునాయుడి ఆలోచనలను, ముందుచూపును అభినందించేవారు. ప్రజాసమస్యలను గుర్తించడం, పరిష్కార మార్గాలను అన్వేషించడం, వాటిని నెరవేర్చేందుకు తగిన ప్రణాళికలు వేసుకోవడం, సాధించే వరకూ సేదతీరకుండా శ్రమించడం వంటి లక్షణాలే చంద్రబాబును.. రామోజీరావు మనసుకు దగ్గర చేశాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యువతకు ఉపాధి మార్గంలా మలచడం, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించడం.. వంటి అంశాలలో చంద్రబాబు విజన్ను, విధానాలను రామోజీరావు ప్రశంసించేవారు. ఎంత ఆత్మీయత ఉన్నా.. ఏరోజూ ఏకపక్షంగా ఒక పార్టీ కోసమో, ఒక ప్రయోజనం కోసమో పత్రికను అణుమాత్రం కూడా వినియోగించలేదాయన. అన్ని రాజకీయపక్షాల ఆలోచనలకు, అభిప్రాయాలకు అక్షర వేదిక కల్పించారు. ఒక్కసారి 2004 నాటి రాజకీయ పరిస్థితులను, ‘ఈనాడు’ వివిధ పక్షాల వార్తలకు ఇచ్చిన ప్రాముఖ్యాన్ని చూస్తే రామోజీరావు నిష్పక్షపాత నిక్కచ్చితనం ఎవరికైనా అర్థమవుతుంది.
అఖండ కీర్తి....
ఏరోజైనా ఏనాడైనా.. ప్రజలే ఆయనకు ప్రథమం. అందుకే.. చంద్రబాబు ప్రజల కోసం చేపట్టిన ప్రతి ప్రగతికారక విధానాన్ని అభ్యుదయ మార్గాన్ని సమర్థించారు రామోజీరావు. ఆయన మన మధ్య లేకపోయినా.. ఆ ఖ్యాతి.. తెలుగుజాతి ఉన్నంత వరకూ అఖండంగా వెలుగుతూనే ఉంటాయి. వారి ఆశయాలు, ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూనే ఉంటాయి.. అని రామోజీరావు జీవితంలోని అన్ని దశలనూ లఘుచిత్రంలో స్పృశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్ఫోన్లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. -
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది.
తాజా వార్తలు (Latest News)
-
రకుల్ప్రీత్ మోటివేషన్.. నభా ప్రమోషన్.. రుహానీ శర్మ సెల్ఫీ!
-
కాగజ్నగర్లో తల్లీ ముగ్గురు కూతుళ్ల ఆత్మహత్యాయత్నం
-
కర్ణాటకలో నాయకత్వ మార్పు..? సీఎం ఏమన్నారంటే!
-
ఆ సైనికుల మరణం తీవ్రంగా కలచివేసింది: చంద్రబాబు
-
మహ్మద్ అబు సల్మియాను విడుదల చేసిన ఇజ్రాయెల్
-
ప్రాణం తీసిన ‘రాంగ్ రూట్’.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి