- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
AP news: తెచ్చిన పెట్టుబడులెన్ని.. నంజుకున్న భూములెన్ని?
రాష్ట్ర పారిశ్రామికరంగంపై ప్రభుత్వం జులై 4న శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. జగన్ ప్రభుత్వ జమానాలో పారిశ్రామికంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందనే వివరాలను వెల్లడించనుంది.
కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపైనా ప్రభుత్వం దృష్టి
జగన్ జమానాపై తయారవుతున్న నివేదిక.. జులై 4న ప్రజల ముందుకు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర పారిశ్రామికరంగంపై ప్రభుత్వం జులై 4న శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. జగన్ ప్రభుత్వ జమానాలో పారిశ్రామికంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందనే వివరాలను వెల్లడించనుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవోల ద్వారా చేసిన భూ కేటాయింపులు, పెట్టుబడులు, ఇతర వివరాలతో జగన్ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ఎంతగా విధ్వంసం చేసిందో, దాని వల్ల రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో, పెట్టుబడుల ఆకర్షణ కోసం అప్పట్లో నిర్వహించిన సదస్సుల ద్వారా సాధించిన ప్రయోజనాలేంటో ప్రభుత్వానికి వివరించేలా సమగ్ర నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. నివేదిక తయారీలో కేపీఎంజీ సంస్థ సహకారం అందించనుంది. దీనిపై సీఎం దగ్గర చర్చించిన తర్వాత ప్రభుత్వం శ్వేతపత్రంగా ప్రజల ముందు ఉంచనుందని ఒక అధికారి తెలిపారు.
ప్రత్యేక జీవోల మతలబు ఏంటి?
జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో అస్మదీయులకు భూములను ఇష్టారాజ్యంగా చౌక ధరకు పంచిపెట్టిందన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేక జీవోలను ఇచ్చింది. ఇలా ఎన్ని సంస్థలకు భూములను కట్టబెట్టింది.. వాటి కేటాయింపులో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా.. రాయితీ ధరకు భూములిచ్చి సొంత ప్రయోజనాలు పొందారా.. ఐదేళ్లలో జరిగిన భూ దోపిడీ విలువ ఎంత.. వంటి వివరాలను శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వం వెల్లడించనుంది. ఏపీఐఐసీ ద్వారా జరిగిన భూ కేటాయింపుల వివరాలు బయటకు వెల్లడించకుండా గత ప్రభుత్వం గుట్టుగా వ్యవహరించింది. అదేసమయంలో పారిశ్రామికవేత్తలకు తాము వ్యతిరేకం కాదనే సంకేతాలను కూడా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ దృష్ట్యా కేపీఎంజీ సంస్థకు అధికారులు తగిన సూచనలను ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులు ఎన్ని? పరిశ్రమలు ఎన్ని? వాటి ద్వారా ఎంతమందికి ఉపాధి లభించింది? వంటి వివరాలను ప్రత్యేకంగా ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019కి ముందున్న ప్రభుత్వం కంటే ఎక్కువ పెట్టుబడులు తమ హయాంలోనే వచ్చాయని జగన్ చెప్పేవారు. అందులో వాస్తవాన్ని ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2019 జూన్ నుంచి 2022 ఆగస్టు వరకు రూ. 46,280 కోట్ల పెట్టుబడులతో 99 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, రూ. 39,655 కోట్లతో మరో 55 భారీ పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయంటూ మాజీ సీఎం జగన్ చెప్పారు. ఆ మాటల్లో వాస్తవం ఎంతో ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
- పెట్టుబడుల ఆకర్షణ కోసం గత ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల ఎంతమేర ప్రయోజనం చేకూరిందో అధికారులు లెక్కతేల్చే పనిలో ఉన్నారు. దావోస్ దాకా వెళ్లి రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు గత ప్రభుత్వం చెప్పింది అలాగే వివిధ ఔట్ రీచ్ కార్యక్రమాలు.. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎక్స్పోలకు హాజరు కావడానికి ఎంత మొత్తం ఖర్చు చేశారో లెక్కేస్తున్నారు.
- పెట్టుబడుల ఆకర్షణ పేరుతో గత ప్రభుత్వం ఎంతోమంది సలహాదారులను ఏర్పాటు చేసి.. ప్రతి నెలా వారికి రూ.లక్షల్లో జీతభత్యాలు చెల్లించింది. సలహాదారులుగా వ్యవహరించిన వారు చేసిన పనులు ఏంటి? వారికి చెల్లించిన జీతాల మేరకు రాష్ట్రానికి ప్రయోజనం కలిగిందా? కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు ఎంత ఉన్నాయి.. వాటిని సంస్థ అభివృద్ధి కోసం వెచ్చించారా? ఇతర అవసరాల కోసం మళ్లించారా? తదితర ప్రశ్నలన్నింటికీ శ్వేత పత్రం ద్వారా సమాచారం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరం విధ్వంసం.. రూ.వేల కోట్ల నష్టం
జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
రివర్స్ టెండర్లలో ఆదా వట్టిదే
‘‘జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైంది. 2020 జులై నుంచి 2024 జూన్ వరకు ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్ పనులు ఏవీ చేయలేదు. -
భోగాపురంలో భూబకాసురులు
వైకాపా ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం అనేది ఆ పార్టీ నేతలు, వారితో అంటకాగే కొంతమంది అధికారులు హక్కుగా భావించిన పరిస్థితి. -
ఇంటింటా నైపుణ్య గణన
జనాభా లెక్కింపు మాదిరి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది. -
నిఘా విభాగం అధిపతిగా మహేష్చంద్ర లడ్హా!
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం అధిపతిగా మహేష్చంద్ర లడ్హా నియమితులు కానున్నారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఐజీగా కొనసాగుతున్నారు. -
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన గవర్నర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. -
కృష్ణపట్నం పోర్టులో కంటెయినర్ టెర్మినల్ పునరుద్ధరించాలి
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని కంటెయినర్ టెర్మినల్ను పునరుద్ధరించాలని, లేదంటే ప్రాణాలిచ్చేందుకూ వెనుకాడమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. -
కృష్ణపట్టిలో పెద్దపులి
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. -
వైకాపా వీర విధేయ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా
వైకాపాతో అంటకాగి, ఆ పార్టీకి వీరవిధేయుడిగా పేరొందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) ప్రసాదరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. -
వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా
‘‘కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకొని బియ్యం అక్రమ రవాణా చేశారు. ప్రభుత్వం రూ.39కి కిలో బియ్యం అందిస్తుంటే.. పేదల వద్ద రూ.7కి కొనుగోలు చేశారు. -
ఎన్టీఆర్ మోడల్ స్కూల్ను సందర్శించిన భువనేశ్వరి
నిరుపేద చిన్నారులకు అదో అక్షరాల గుడి.. తల్లిదండ్రుల్లేని వారిని అక్కున చేర్చుకున్న అమ్మ ఒడి..అదే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్. -
14 అడుగుల గిరినాగు పట్టివేత
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడలో 14 అడుగుల గిరినాగు (కింగ్ కోబ్రా) హల్చల్ చేసింది. అందరూ చూస్తుండగానే ఎస్సీ కాలనీలోని ఓ గుడిసెలోకి చొరబడింది. -
వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్పై వైకాపా పడగ
వైజాగ్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ (వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్)పై వైకాపా స్వారీ చేస్తోంది. కల్చరల్ సెంటర్కు సాధారణంగా ఒకటే కమిటీ ఉంటుంది. -
దారి కొట్టుకుపోయింది.. అవస్థలు మిగిలాయి..!
పక్కా రోడ్డు కోసం గిరిజనులు ఏళ్లుగా ఎదురుచూశారు. ప్రభుత్వం కనికరించి పనులు మొదలుపెట్టి.. మధ్యలోనే వదిలేసింది. ఇంకేం.. చేసిన కాస్త పనులూ వర్షాలకు కొట్టుకుపోయాయి. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. -
గత సర్కారు నిర్లక్ష్యం.. కొత్త ప్రభుత్వంపై చక్కదిద్దే భారం
గత ప్రభుత్వం పాఠశాలల్లో అసంపూర్తిగా వదిలేసిన మౌలికసదుపాయాల పనులను పూర్తి చేయడం కొత్త ప్రభుత్వానికి సవాల్గా మారనుంది. -
అరాచక అధికారులపై సర్కారు డేగకన్ను!
వైకాపా హయాంలో గత అయిదేళ్ల పాటు రాష్ట్రంలో కొనసాగిన దాష్టీకాలు, అరాచకాలు, అక్రమాలు, దాడులు, రాజకీయ హత్యలు, తప్పుడు కేసులకు బాధ్యులైన పోలీసు అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
గ్రామాలకు జగన్ ద్రోహం
గ్రామీణాభివృద్ధికి దోహదం చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలకు గత వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులివ్వకుండా భ్రష్టు పట్టించడమే కాదు.. కేంద్రం ఇతర పథకాల కింద ఇచ్చే నిధులూ ఉపయోగించుకోలేకపోయింది. -
తితిదేలో అక్రమాల చిట్టా సిద్ధం!
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదేళ్ల కాలంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు నడుం బిగించిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులు తమ పరిశీలనను ముగించారు. -
ఒక ముఖ్యమంత్రికి 986 మంది భద్రత కావాలా?
‘ఒక ముఖ్యమంత్రికి 986 మంది సిబ్బందితో భద్రత కావాలా? పరదాలు కట్టుకుని తిరగడం, చెట్లు కొట్టేయడం.. ఏమిటిది? నేరస్థులకు సెక్యూరిటీ కావాలని అంటున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయవ్య దిశగా పయనించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్
-
చంద్రబాబు కార్యసాధకుడు.. అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారు: సుమన్
-
మహిళలూ.. భర్తలతో తాగుడు ఇలా మాన్పించండి: మంత్రి టిప్ వైరల్
-
ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం: సి.ఎం.రమేశ్
-
‘కల్కి’.. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రజనీకాంత్
-
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్కు తీవ్ర అస్వస్థత