APPSC Group 2 Mains: ఏపీలో గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా

గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా పడింది. పాలనాపరమైన కారణాలతో వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Updated : 03 Jul 2024 22:01 IST

APPSC Group 2 Mains| అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా పడింది. పాలనాపరమైన కారణాలతో వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ(APPSC) వెల్లడించింది. సవరించిన పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష జరగాల్సి ఉంది. ఏప్రిల్‌లో గ్రూప్‌- 2 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల కాగా.. మెయిన్స్‌కు 92వేల మందికి పైగా అభ్యర్థులు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.

మరోవైపు, గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. సిలబస్‌లో మార్పులు చేయడం ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ పరీక్షకు మరికొంత సమయం పెంచాలని పలువురు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. నిరుద్యోగుల అభ్యర్థనల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు సైతం విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న వేళ ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని