CBSE Results: సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షల ఫలితాలపై కీలక అప్డేట్
లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న సీబీఎస్ఈ పది, 12వ తరగతి ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది.
CBSE 10th Results | ఇంటర్నెట్ డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఫలితాలను మే 20 తర్వాతే వెల్లడించే అవకాశం ఉన్నట్లు సీబీఎస్ఈ తెలిపింది. ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్యలో జరిగిన ఈ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోన్న వేళ సామాజిక మాధ్యమాల్లో రిజల్ట్స్కు సంబంధించి ఫేక్ సమాచారం చక్కర్లు కొడుతోన్న వేళ బోర్డు స్పందించింది. ఇటీవలే ఆ నకిలీ సమాచారాన్ని ఖండించిన సీబీఎస్ఈ అధికారులు.. మే 20 తర్వాతే ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్ఈ బోర్డు గత కొన్నేళ్లుగా మెరిట్ జాబితాలను వెల్లడించకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2వరకు జరగ్గా.. దేశవ్యాప్తంగా దాదాపు 39లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?
-
24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!
-
కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో సీఎం చంద్రబాబు భేటీ
-
నిద్ర సరిపోవట్లేదు.. రాత్రి 8 తర్వాత రాలేను: బైడెన్
-
శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్ రెడ్డి
-
ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్.. 39 మందికి అస్వస్థత