AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఏపీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
అమరావతి: ఏపీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మే 24 నుంచి జూన్ 1వరకు జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 1,27,190మంది (జనరల్, ఒకేషనల్ కలిపి) విద్యార్థులు హాజరు కాగా.. వీరిలో 74,868మంది (59%) ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జనరల్ కేటగిరీలో 59 శాతం, ఒకేషనల్లో 57 శాతం మంది చొప్పున పాసయ్యారు.
ఇంటర్ ద్వితీయ సప్లిమెంటరీ ఫలితాలు (జనరల్)
ఇంటర్ ద్వితీయ సప్లిమెంటరీ ఫలితాలు (ఒకేషనల్)
ఎవరికైనా సందేహాలు ఉంటే సమాధాన పత్రాల రీ-వెరిఫికేషన్ కోసం జూన్ 20 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇందుకోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 26న విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీట్పై 26 పిటిషన్లు.. జులై 8 నుంచి సుప్రీం కోర్టు విచారణ
-
హీనా ఖాన్ నువ్వు వారియర్వి.. నటికి ధైర్యాన్నిచ్చిన సమంత
-
అప్పుడే హెచ్చరికలు.. అంతలోనే బాంబుల మోత.. ఖాన్ యూనిస్లో విధ్వంసం
-
జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్.. భారత జట్టులో పలు మార్పులు
-
పరీక్షకు 2 గంటల ముందే ప్రశ్నపత్రం రెడీ.. ‘నీట్ పీజీ’ నిర్వహణకు కీలక నిర్ణయం..!
-
కేంద్రం నిధులను వైకాపా పక్కదారి పట్టించింది: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి