Minister Seethakka: ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం

తెలంగాణలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.

Published : 29 Jun 2024 16:14 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. జులై 12 లోపు http://tgswadtr.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రవేశాలకు మళ్లీ ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గురుకులాల్లో పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని