News in pics: చిత్రం చెప్పే విశేషాలు (03-07-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 03 Jul 2024 15:40 IST
1/18
డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం.. సమాజాన్ని మేలుకొలుపుదాం కార్యక్రమంలో భాగంగా ఫొటో ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న విద్యార్థినులు..
డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం.. సమాజాన్ని మేలుకొలుపుదాం కార్యక్రమంలో భాగంగా ఫొటో ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న విద్యార్థినులు..
2/18
ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న విద్యార్థినులు
ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న విద్యార్థినులు
3/18
చర్లపల్లి జైలు నుంచి విడుదలైన ఖైదీలు
చర్లపల్లి జైలు నుంచి విడుదలైన ఖైదీలు
4/18
జైలు నుంచి బయటకి వచ్చిన ఖైదీలు
జైలు నుంచి బయటకి వచ్చిన ఖైదీలు
5/18
విశాఖ జిల్లా రాజవొమ్మంగిలో  కె.సత్యవతికి బంధువులు ఇచ్చిన బొప్పాయిని రెండు భాగాలుగా కోయగా అందులో ఒక్కొక్క దానిలో విత్తనాలు (నల్లటి గింజలు) లేకుండా కనిపించాయి. తెల్లటి రంగులో మూత్రపిండాల ఆకారంలో రెండు గింజలు పెద్ద సైజులో, ఇంకో దానిలో చిన్న సైజులో కనిపించాయి. 
విశాఖ జిల్లా రాజవొమ్మంగిలో  కె.సత్యవతికి బంధువులు ఇచ్చిన బొప్పాయిని రెండు భాగాలుగా కోయగా అందులో ఒక్కొక్క దానిలో విత్తనాలు (నల్లటి గింజలు) లేకుండా కనిపించాయి. తెల్లటి రంగులో మూత్రపిండాల ఆకారంలో రెండు గింజలు పెద్ద సైజులో, ఇంకో దానిలో చిన్న సైజులో కనిపించాయి. 
6/18
ఉట్నూరు మండలం వడ్‌గల్‌పూర్‌కు చెందిన రైతు సిందే సురేష్‌ తన ఆలోచనతో పాడైన సైకిల్‌ను కొని దానికి వ్యవసాయ పరికరాలు అమర్చి పత్తి చేనులో కలుపు, గుంటుక తీయడానికి ఉపయోగిస్తున్నారు. ఇందుకు రూ.1,000 ఖర్చు చేసినట్లు తెలిపారు. 
ఉట్నూరు మండలం వడ్‌గల్‌పూర్‌కు చెందిన రైతు సిందే సురేష్‌ తన ఆలోచనతో పాడైన సైకిల్‌ను కొని దానికి వ్యవసాయ పరికరాలు అమర్చి పత్తి చేనులో కలుపు, గుంటుక తీయడానికి ఉపయోగిస్తున్నారు. ఇందుకు రూ.1,000 ఖర్చు చేసినట్లు తెలిపారు. 
7/18
కర్ణాటకలోని బబలేశ్వర తాలూకా బబలాది గ్రామానికి చెందిన సిద్ధనగౌడ పాటిల్‌ అలియాస్‌ రామనగౌడ అనే రైతు తన ఎద్దును రూ.18.01 లక్షలకు విక్రయించారు. ఇది ఒక విలాసవంతమైన కారు ధర కన్నా ఎక్కువ. మూడేళ్ల కిందట తమ జిల్లాలో కోర్తి కొల్హార నుంచి రూ.1.05 లక్షలకు ఈ ఎద్దును ఆయన కొనుగోలు చేశారు. 
కర్ణాటకలోని బబలేశ్వర తాలూకా బబలాది గ్రామానికి చెందిన సిద్ధనగౌడ పాటిల్‌ అలియాస్‌ రామనగౌడ అనే రైతు తన ఎద్దును రూ.18.01 లక్షలకు విక్రయించారు. ఇది ఒక విలాసవంతమైన కారు ధర కన్నా ఎక్కువ. మూడేళ్ల కిందట తమ జిల్లాలో కోర్తి కొల్హార నుంచి రూ.1.05 లక్షలకు ఈ ఎద్దును ఆయన కొనుగోలు చేశారు. 
8/18
నాంపల్లి కూడలి వద్ద ట్రాఫిక్‌ ఐలాండ్‌లో పోలీసులు ఉంటారని తెలిసినా.. ద్విచక్రవాహనంపై నలుగురు విద్యార్థులతో శిరస్త్రాణం సైతం లేకుండా ఓ వ్యక్తి ప్రమాదకరంగా ప్రయాణించారు.
నాంపల్లి కూడలి వద్ద ట్రాఫిక్‌ ఐలాండ్‌లో పోలీసులు ఉంటారని తెలిసినా.. ద్విచక్రవాహనంపై నలుగురు విద్యార్థులతో శిరస్త్రాణం సైతం లేకుండా ఓ వ్యక్తి ప్రమాదకరంగా ప్రయాణించారు.
9/18
నల్గొండ: యాదాద్రీశుడి సన్నిధిలో మంగళవారం రాత్రి వర్షం కురిసింది. కృష్ణశిలతో నిర్మించిన ఆలయ గోపురం తడిసి ఆకర్షణీయంగా మారి భక్తులను ఆకట్టుకుంది.
నల్గొండ: యాదాద్రీశుడి సన్నిధిలో మంగళవారం రాత్రి వర్షం కురిసింది. కృష్ణశిలతో నిర్మించిన ఆలయ గోపురం తడిసి ఆకర్షణీయంగా మారి భక్తులను ఆకట్టుకుంది.
10/18
హైదరాబాద్‌: వెస్ట్‌ మారేడుపల్లిలోని కస్తూర్బా గాంధీ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల మంగళవారం ఘనంగా స్వర్ణోత్సవాలు జరుపుకొంది. విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.
హైదరాబాద్‌: వెస్ట్‌ మారేడుపల్లిలోని కస్తూర్బా గాంధీ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల మంగళవారం ఘనంగా స్వర్ణోత్సవాలు జరుపుకొంది. విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.
11/18
హైదరాబాద్‌: మంగళవారం రాత్రి రవీంద్రభారతిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టిస్ట్స్‌ సినీ స్పాన్సర్స్‌ అసోసియేషన్‌ (ఏపీ, టీఏసీఎస్‌ఏ) ఆధ్వర్యంలో కథక్, కూచిపూడి, భరతనాట్య నృత్యోత్సవం కనులపండువగా జరిగింది.
హైదరాబాద్‌: మంగళవారం రాత్రి రవీంద్రభారతిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టిస్ట్స్‌ సినీ స్పాన్సర్స్‌ అసోసియేషన్‌ (ఏపీ, టీఏసీఎస్‌ఏ) ఆధ్వర్యంలో కథక్, కూచిపూడి, భరతనాట్య నృత్యోత్సవం కనులపండువగా జరిగింది.
12/18
రెండు నెలల పాటు క్రమశిక్షణతో, భక్తితో సంప్రదాయ కోలాటం నేర్చుకున్న మహిళలు మంగళవారం నల్గొండ పట్టణంలోని శ్రీరాంనగర్‌ కాలనీలో ప్రదర్శించారు.జడ కొప్పు, చెక్కభజన వీక్షకులను ఆకట్టుకుంది.
రెండు నెలల పాటు క్రమశిక్షణతో, భక్తితో సంప్రదాయ కోలాటం నేర్చుకున్న మహిళలు మంగళవారం నల్గొండ పట్టణంలోని శ్రీరాంనగర్‌ కాలనీలో ప్రదర్శించారు.జడ కొప్పు, చెక్కభజన వీక్షకులను ఆకట్టుకుంది.
13/18
విశాఖపట్నం: దసపల్లా హిల్స్‌ ప్రాంతంలోని ఈ భవనం పచ్చదనంతో కనువిందు చేస్తోంది. ప్రతి అంతస్తులో రకరకాల మొక్కలు పెంచడంతో అటుగా వెళ్లే ప్రతి ఒక్కరూ కన్నార్పకుండా చూస్తున్నారు.
విశాఖపట్నం: దసపల్లా హిల్స్‌ ప్రాంతంలోని ఈ భవనం పచ్చదనంతో కనువిందు చేస్తోంది. ప్రతి అంతస్తులో రకరకాల మొక్కలు పెంచడంతో అటుగా వెళ్లే ప్రతి ఒక్కరూ కన్నార్పకుండా చూస్తున్నారు.
14/18
హైదరాబాద్‌: రామంతాపూర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల లోనికి వెళ్లే దారికి రెండు వైపులా ఉన్న చెట్లకు పూలు పూసి అందంగా కనిపిస్తున్నాయి. . రోడ్డుమీద పడిన పూలతో పసుపు తివాచీలా కనిపిస్తూ.. విశేషంగా ఆకట్టుకుంటోంది.
హైదరాబాద్‌: రామంతాపూర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల లోనికి వెళ్లే దారికి రెండు వైపులా ఉన్న చెట్లకు పూలు పూసి అందంగా కనిపిస్తున్నాయి. . రోడ్డుమీద పడిన పూలతో పసుపు తివాచీలా కనిపిస్తూ.. విశేషంగా ఆకట్టుకుంటోంది.
15/18
మెదక్‌: సిద్దిపేట కలెక్టరేట్‌ భవన ఆవరణలో పచ్చని గడ్డి పెరిగి హరితమయమైంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుండగా చుట్టుపక్కల వివిధ రంగుల్లో పూల మొక్కలతో కలెక్టరేట్‌కు వచ్చే సిబ్బంది, ప్రజలను ఆనందపరుస్తోంది.
మెదక్‌: సిద్దిపేట కలెక్టరేట్‌ భవన ఆవరణలో పచ్చని గడ్డి పెరిగి హరితమయమైంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుండగా చుట్టుపక్కల వివిధ రంగుల్లో పూల మొక్కలతో కలెక్టరేట్‌కు వచ్చే సిబ్బంది, ప్రజలను ఆనందపరుస్తోంది.
16/18
విశాఖపట్నం: పాతనగరం బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు అమ్మవారికి 108 బంగారు పుష్పాలను నివేదించి అర్చించారు.
విశాఖపట్నం: పాతనగరం బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు అమ్మవారికి 108 బంగారు పుష్పాలను నివేదించి అర్చించారు.
17/18
మెదక్‌: ఏకాదశిని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల్లో కొలువుదీరిన వనదుర్గమ్మకు మంగళవారం సహస్ర పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు అర్చకుడు పార్థివశర్మ అమ్మవారికి అభిషేకం చేసి మల్లె, జాజి, లిల్లీ పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.
మెదక్‌: ఏకాదశిని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల్లో కొలువుదీరిన వనదుర్గమ్మకు మంగళవారం సహస్ర పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు అర్చకుడు పార్థివశర్మ అమ్మవారికి అభిషేకం చేసి మల్లె, జాజి, లిల్లీ పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.
18/18
ఏలూరు: ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కథానాయకుడు ప్రభాస్‌ నడిపిన ప్రత్యేక కారును భీమవరం ఏవీజీ సినిమాస్‌ మల్టీప్లెక్స్‌లో ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. వీక్షకులు భారీగా తరలివచ్చి ఈ కారు ఎదుట స్వీయ చిత్రాలు తీసుకున్నారు.
ఏలూరు: ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కథానాయకుడు ప్రభాస్‌ నడిపిన ప్రత్యేక కారును భీమవరం ఏవీజీ సినిమాస్‌ మల్టీప్లెక్స్‌లో ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. వీక్షకులు భారీగా తరలివచ్చి ఈ కారు ఎదుట స్వీయ చిత్రాలు తీసుకున్నారు.
Tags :

మరిన్ని